అన్వేషించండి

KTR on Revanth Reddy: బీజేపీలో చేరతానని మోదీకి రేవంత్ చెప్పారు! తెలంగాణ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Telangana Politics | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరతారని, ఆ పార్టీలోనే కన్నుమూస్తానని ప్రధాని మోదీకి స్వయంగా చెప్పినట్లు సన్నిహితులకు చెప్పారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KTR Comments on Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తరువాతి స్టెప్ బీజేపీలో చేరడమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన టీంతో కలిసి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు ఎందుకు భయమో రేవంత్ రెడ్డి ఇటీవల అందుకు కారణాలు చెప్పాడంటూ మరో బాంబు పేల్చారు కేటీఆర్. 

బీజేపీలో మొదలై.. కాషాయంతోనే ముగింపు

‘తన రాజకీయం పుట్టింది బీజేపీలో. చివరికి తన రాజకీయ ప్రస్థానం ముగిసేది బీజేపీలోనే అని ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాషాయ జెండా కప్పుకుని ఏబీవీపీలో రేవంత్ ప్రస్థానం మొదలైందని, చివరికి బీజేపీలో చేరి కాషాయ జెండా కప్పుకుని చనిపోతానని ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా ? కాదా ! అని’ కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఈ మాటల్ని ఇటీవల తన సన్నిహితుల వద్ద బయటపెట్టారని
 కేటీఆర్‌ అన్నారు. రేవంత్ త్వరలోనే తన టీంతో కలిసి వెళ్లి బీజేపీలో చేరడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని.. రాష్ట్రంలో మాత్రం ప్రత్యర్థుల్లా నటిస్తూ, ఢిల్లీకి వెళ్తే స్నేహితుల్లా ఉంటారని కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఆరోపించారు. బీజేపీకి బీ టీమ్ ఎవరు అనే దానిపై కొన్నేళ్లుగా తెలంగాణలో హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీకి బీ టీమ్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు పదే పదే వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ పార్టీనే బీజేపీకి బీ టీమ్ అని రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం మారినా బీ టీమ్ గొడవ కొనసాగుతోంది. రైతు రుణమాఫీ చేశామని చెప్పి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు రైతుల్ని నట్టేట ముంచుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. దీనిపై చర్చకు ఎక్కడైనా తాము సిద్ధమేనని రేవంత్ కు సవాల్ సైతం విసిరారు.

ఎన్నికల తరువాత కొత్త వివాదం ఏంటంటే.. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం సాయం చేయకపోయినా.. మోదీని బడే భాయ్ అని రేవంత్ పిలవడానికి కారణం అదేనంటూ విమర్శిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లోనూ రాష్ట్రానికి నిధులు తేవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్, హరీష్ రావు విమర్శించారు. అదే బీఆర్ఎస్ కనుక అధికారంలో ఉండి ఉంటే, రాష్ట్రానికి నిధులు తెచ్చేదన్నారు. కేంద్రంతో పోరాడటం కాదు, కలిసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. త్వరలో రేవంత్ రెడ్డి తన టీంతో కలిసి వెళ్లి కాషాయ పార్టీలో చేరడం కన్ఫామ్ అని, కాంగ్రెస్ పెద్దలు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: Telangana: ఏ సెంటర్‌లోనైనా చర్చకు వస్తావా- రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- రుణమాఫీపై రాజుకున్న రాజకీయం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
Rains In AP and Telangana: ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Rains In AP and Telangana: ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
Shocking FASTag Scam: ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
Embed widget