అన్వేషించండి

Rains Effect: వరద బీభత్సం - రైల్వే ట్రాకులు గాల్లో తేలడం, లైన్ల పునరుద్ధరణపై సీపీఆర్వో ఏమన్నారంటే!

Rains in AP | భారీ వర్షాలు , వరదలు తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్దపై తీవ్ర ప్రభావం చూపాయి. వందల రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వరద ప్రభావంపై రైల్వే అధికారుల మాట్లలో..

Andhra Pradesh Rains | రెండు రోజుల ఎడతెరిపి లేకుండా కురిసి భారీ వర్షాలు, ఆపై వరద ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది. లాంగ్ జర్నీ చేసే ప్రయాణికులు రైళ్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వేకి భారీ నష్టాన్నే మిగిల్చాయి భారీ వరదలు. వరద ఎఫెక్ట్ పై దక్షిణ మద్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధధాల అధికారి (CPRO) శ్రీధర్ ను ఏబీపీ దేశం సంప్రదించింది. వరద నష్టం, రైళ్ల రాకపోకల పునరుద్ధరణపై ఆయన పంచుకున్న విశేషాలివే. 

ఏపీ, తెలంగాణాలో రైల్వే ట్రాక్స్ ఎక్కడెక్కడ ధ్వసంమయ్యాయి ?

సీపీఆర్వో: కాజీపేట్, విజయవాడ మధ్యలో రెండు చోట్ల రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కేసముద్రం, మహబూబాబాద్ మధ్యలో మట్టికొట్టుకుపోయి పట్టాలు గాల్లో వేలాడుతూ ఉండిపోయాయి. విజయవాడ సమీపంలో రాయనపాడులో ట్రాక్ పై భారీ స్దాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. స్టేషన్ లోకి వరదనీరు చేరింది. ట్రాక్ కు ఇరువైపులా వరద తీవ్రత కొనసాగుతోంది. ఇది మేజర్ ట్రంక్ రూట్, నార్త్  సౌత్ ను అనుసంధానం చేసే ప్రధాన మార్గం కావడంతో శనివారం సాయంత్రం నుంచి ఈ రోజు వరకూ 481 రైళ్లను రద్దు చేశాం. 13 రైళ్లను పాక్షికంగా  రద్దు చేశాం. 152 రైళ్లను దారిమళ్లించాము. ముఖ్యంగా దక్షిణ మద్య రైల్వే ఏపి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా మీదగా ఉండటం అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం ఉంది. కాజీపేట , విజయవాడ మధ్య ట్రాక్ దెబ్బతినడం, వరద ప్రభావం ఉంటంతో రైళ్ల రద్దుకు ప్రధాన కారణంగా మారింది. 

అనేక చోట్ల రైల్వే ట్రాక్ లు  గాల్లో వేలాడూ కనిపిస్తున్నాయి. అంతలా ప్రభావం చూపడానికి కారణాలేంటి...?

సీపీఆర్వో: డోర్నకల్ సమీపంలో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. మహబూబాద్ లో ఒకేరోజు ఏడాదిలో పడాల్సిన వర్షపాతంలో నలభై శాతం వర్షం పడటంతో ట్రాక్ లు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. వరద ఉధృతి విపరీతంగా ఉంది. మిగతా చోట అంత ప్రభావం చూపలేదు. వర్షం , విపత్తులను ఎదుర్కొనేందుకు  రైల్వే పూర్తిగా సన్నద్దంగా ఉంది. 

ఏఏ మార్గాల్లో వెళ్లే రైళ్లను ఇప్పటివరకు రద్దు చేశారు.. దారిమళ్లింపు మార్గాలేంటి..?

సీపీఆర్వో: ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే వైపు, సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్లే రైళ్లను, సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే  రైళ్లను రద్దు చేశాం. ఈ మార్గాల్లో కొన్ని పాక్షింగా రద్దు చేయడంతోపాటు అవసరమైన చోట కొన్ని రైళ్లను దారి మళ్లించాం. 

విజయవాడ వైపు వెళ్లే రైల్వేట్రాక్ పునరుద్దరణ ఎప్పుడు పూర్తవుతుంది. రాకపోకలు ఎప్పుడు మొదలవుతాయి?

సీపీఆర్వో: రైల్వే ట్రాక్ పై ఇంకా వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ప్రభావం తగ్గితే ఓ అంచనాకు వచ్చే అవకాశాలున్నాయి. ట్రాక్ కు ఏదైనా డ్యామేజ్ జరిగిందా, లేక వరద ప్రభావం తగ్గిన తరువాత రైళ్లు నడపవచ్చా అనేది ఓ అంచనాకు వస్తాం. కేసముద్రం విషయానికి  వస్తే రైల్వే జిఎం, ఉన్నతాధికారలు వెళ్లి స్వయంగా క్షేత్రస్దాయిలో పరిస్థితిని పరిశీలించారు. రేపు సాయంత్రం వరకూ రైళ్ల రాకపోకలు కొంత వరకూ మెరుగుపడే అవకాశాలున్నాయి. ఒకవేళ వరద ఉధృతి ఇంకా పెరిగి, వర్షాలు పడుతుంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 

 

వర్షాలు, వరదల ప్రభావంతో రైల్వే కు ఎంత నష్టం వచ్చింది...?

సీపీఆర్వో: రైల్వే ట్రాక్స్ దెబ్బతినడంతోపాటు రైళ్లు రద్దు చేయడం వల్ల భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. అది ఏస్దాయిలో ఉంటుందనేది ఇప్పుడే అంచనా వేయలేము. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా సాధ్యమైనంత వరకూ వారు గమ్యాన్ని చేరుకునేలా ఏర్పాట్లు చేశాము. ఓ ఐదు రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ముందుకు ,వెనక్కు తీసుకెళ్లలేని పరిస్థితి. వారికి ఉదయం నుంచి బ్రేక్ ఫాస్ట్, లంచ్ , టీ ఇలా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. ఆర్టీసి బస్సులు ఏర్పాటు , జేసిబిల సాయంతో ప్రయాణికులను సురక్షితంగా రక్షించాం. కేసముద్రంలో చిక్కుకున్న ఐదువేల మందిని గమ్యస్థానాలకు చేర్చాం.

రైళ్లు రద్దుతో ఇతర రాష్ట్రాల ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు ఏం సలహా ఇస్తారు?

సీపీఆర్వో: మరో రెండు రోజులు వర్షాల ప్రభావం ఉంది. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు రద్దు చేసుకోవడం మంచిది. వరదల తీవ్రత తగ్గేవరకూ ప్రభావిత ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తప్పవు. ఈ విషయాన్ని ప్రయాణికులు దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని మా సూచన.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Holi party bill: హోలీ పార్టీ చేసుకుని బిల్లు ప్రభుత్వానికి పెట్టారు - చీఫ్ సెక్రటరీపై మండిపడుతున్న పార్టీలు
హోలీ పార్టీ చేసుకుని బిల్లు ప్రభుత్వానికి పెట్టారు - చీఫ్ సెక్రటరీపై మండిపడుతున్న పార్టీలు
New Toll Policy: మరో 15 రోజులే, ఆ తర్వాత ఒక్క టోల్ గేట్‌ కూడా కనిపించదు!
మరో 15 రోజులే, ఆ తర్వాత ఒక్క టోల్ గేట్‌ కూడా కనిపించదు!
GST on UPI Payments:రూ. 2000కు మించి చేసిన యూపీఐ చెల్లింపులపై GST వేస్తారా?
రూ. 2000కు మించి చేసిన యూపీఐ చెల్లింపులపై GST వేస్తారా?
Embed widget