అన్వేషించండి

Rains Effect: వరద బీభత్సం - రైల్వే ట్రాకులు గాల్లో తేలడం, లైన్ల పునరుద్ధరణపై సీపీఆర్వో ఏమన్నారంటే!

Rains in AP | భారీ వర్షాలు , వరదలు తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్దపై తీవ్ర ప్రభావం చూపాయి. వందల రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వరద ప్రభావంపై రైల్వే అధికారుల మాట్లలో..

Andhra Pradesh Rains | రెండు రోజుల ఎడతెరిపి లేకుండా కురిసి భారీ వర్షాలు, ఆపై వరద ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది. లాంగ్ జర్నీ చేసే ప్రయాణికులు రైళ్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వేకి భారీ నష్టాన్నే మిగిల్చాయి భారీ వరదలు. వరద ఎఫెక్ట్ పై దక్షిణ మద్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధధాల అధికారి (CPRO) శ్రీధర్ ను ఏబీపీ దేశం సంప్రదించింది. వరద నష్టం, రైళ్ల రాకపోకల పునరుద్ధరణపై ఆయన పంచుకున్న విశేషాలివే. 

ఏపీ, తెలంగాణాలో రైల్వే ట్రాక్స్ ఎక్కడెక్కడ ధ్వసంమయ్యాయి ?

సీపీఆర్వో: కాజీపేట్, విజయవాడ మధ్యలో రెండు చోట్ల రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కేసముద్రం, మహబూబాబాద్ మధ్యలో మట్టికొట్టుకుపోయి పట్టాలు గాల్లో వేలాడుతూ ఉండిపోయాయి. విజయవాడ సమీపంలో రాయనపాడులో ట్రాక్ పై భారీ స్దాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. స్టేషన్ లోకి వరదనీరు చేరింది. ట్రాక్ కు ఇరువైపులా వరద తీవ్రత కొనసాగుతోంది. ఇది మేజర్ ట్రంక్ రూట్, నార్త్  సౌత్ ను అనుసంధానం చేసే ప్రధాన మార్గం కావడంతో శనివారం సాయంత్రం నుంచి ఈ రోజు వరకూ 481 రైళ్లను రద్దు చేశాం. 13 రైళ్లను పాక్షికంగా  రద్దు చేశాం. 152 రైళ్లను దారిమళ్లించాము. ముఖ్యంగా దక్షిణ మద్య రైల్వే ఏపి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా మీదగా ఉండటం అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం ఉంది. కాజీపేట , విజయవాడ మధ్య ట్రాక్ దెబ్బతినడం, వరద ప్రభావం ఉంటంతో రైళ్ల రద్దుకు ప్రధాన కారణంగా మారింది. 

అనేక చోట్ల రైల్వే ట్రాక్ లు  గాల్లో వేలాడూ కనిపిస్తున్నాయి. అంతలా ప్రభావం చూపడానికి కారణాలేంటి...?

సీపీఆర్వో: డోర్నకల్ సమీపంలో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. మహబూబాద్ లో ఒకేరోజు ఏడాదిలో పడాల్సిన వర్షపాతంలో నలభై శాతం వర్షం పడటంతో ట్రాక్ లు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. వరద ఉధృతి విపరీతంగా ఉంది. మిగతా చోట అంత ప్రభావం చూపలేదు. వర్షం , విపత్తులను ఎదుర్కొనేందుకు  రైల్వే పూర్తిగా సన్నద్దంగా ఉంది. 

ఏఏ మార్గాల్లో వెళ్లే రైళ్లను ఇప్పటివరకు రద్దు చేశారు.. దారిమళ్లింపు మార్గాలేంటి..?

సీపీఆర్వో: ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే వైపు, సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్లే రైళ్లను, సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే  రైళ్లను రద్దు చేశాం. ఈ మార్గాల్లో కొన్ని పాక్షింగా రద్దు చేయడంతోపాటు అవసరమైన చోట కొన్ని రైళ్లను దారి మళ్లించాం. 

విజయవాడ వైపు వెళ్లే రైల్వేట్రాక్ పునరుద్దరణ ఎప్పుడు పూర్తవుతుంది. రాకపోకలు ఎప్పుడు మొదలవుతాయి?

సీపీఆర్వో: రైల్వే ట్రాక్ పై ఇంకా వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ప్రభావం తగ్గితే ఓ అంచనాకు వచ్చే అవకాశాలున్నాయి. ట్రాక్ కు ఏదైనా డ్యామేజ్ జరిగిందా, లేక వరద ప్రభావం తగ్గిన తరువాత రైళ్లు నడపవచ్చా అనేది ఓ అంచనాకు వస్తాం. కేసముద్రం విషయానికి  వస్తే రైల్వే జిఎం, ఉన్నతాధికారలు వెళ్లి స్వయంగా క్షేత్రస్దాయిలో పరిస్థితిని పరిశీలించారు. రేపు సాయంత్రం వరకూ రైళ్ల రాకపోకలు కొంత వరకూ మెరుగుపడే అవకాశాలున్నాయి. ఒకవేళ వరద ఉధృతి ఇంకా పెరిగి, వర్షాలు పడుతుంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 

 

వర్షాలు, వరదల ప్రభావంతో రైల్వే కు ఎంత నష్టం వచ్చింది...?

సీపీఆర్వో: రైల్వే ట్రాక్స్ దెబ్బతినడంతోపాటు రైళ్లు రద్దు చేయడం వల్ల భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. అది ఏస్దాయిలో ఉంటుందనేది ఇప్పుడే అంచనా వేయలేము. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా సాధ్యమైనంత వరకూ వారు గమ్యాన్ని చేరుకునేలా ఏర్పాట్లు చేశాము. ఓ ఐదు రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ముందుకు ,వెనక్కు తీసుకెళ్లలేని పరిస్థితి. వారికి ఉదయం నుంచి బ్రేక్ ఫాస్ట్, లంచ్ , టీ ఇలా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. ఆర్టీసి బస్సులు ఏర్పాటు , జేసిబిల సాయంతో ప్రయాణికులను సురక్షితంగా రక్షించాం. కేసముద్రంలో చిక్కుకున్న ఐదువేల మందిని గమ్యస్థానాలకు చేర్చాం.

రైళ్లు రద్దుతో ఇతర రాష్ట్రాల ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు ఏం సలహా ఇస్తారు?

సీపీఆర్వో: మరో రెండు రోజులు వర్షాల ప్రభావం ఉంది. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు రద్దు చేసుకోవడం మంచిది. వరదల తీవ్రత తగ్గేవరకూ ప్రభావిత ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తప్పవు. ఈ విషయాన్ని ప్రయాణికులు దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని మా సూచన.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget