అన్వేషించండి

BJP Janasena : కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జనసేనకు ఇచ్చేస్తారా ? - బీజేపీలో కొత్త రచ్చ

బీజేపీ, జనసేన మధ్య ఇంకా పొత్తులు ఫైనల్ కాక ముందే సీట్ల పంచాయతీ ప్రారంభమయింది. కూకట్ పల్లి, జనసేన జనసేనకు ఇవ్వొద్దని బీజేపీ నేతలు ధర్నాలకు దిగుతున్నారు.

 

BJP Janasena :   తెలంగాణ బీజేపీ- జనసేన పొత్తుపై రగడ ప్రారంభమయింది.  ఈ పొత్తులో భాగంగా జనసేనకు ఏ స్థానం ఇస్తారు.. ఎవరిపై సీటుకు ఎసరు వస్తుందో అన్న భయందోళనలలో పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దీంతో వేరువేరుగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నేతలు సమావేశమయ్యారు. శేరిలింగంపల్లి టికెట్ జనసేనకు ఇవ్వడమనేది కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన శేరిలింగంపల్లి టికెట్ రవి యాదవ్‌కు వచ్చేలా పావులు కదుపుతూ బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం అయినట్లు తెలిసింది.

శేరిలింగంపల్లి జనసేనకు ఇచ్చేది లేదన్న ధర్మపురి అరవింద్

శేరిలింగంపల్లి టిక్కెట్ ను జనసేనకు కేటాయిస్తున్నట్లు గాప్రచారం జరుగుతోందని దీనిపై స్పందించాలని ఓ కార్యకర్త ..సోషల్ మడియాలో ఎంపీ దర్మపురి అరవింద్ ను ప్రశ్నించారు. అయితే తనకు తెలిసి అలాంటిదేమీ లేదని.. అక్కడ రవి యాదవ్ మంచి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారని ఆయన విజయం సాధిస్తారని పేర్కొన్నారు. 

 

కూకట్ పల్లి ఇవ్వొద్దని బీజేపీ నేతల నిరసనలు 

కూకట్ పల్లి టికెట్ జనసేనకు ఇస్తారని తెలియడంతో టికెట్ ఆశించిన మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి  తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.  ఆయన అనుచరులు ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. పొత్తులో భాగంగా కూకట్‌పల్లి అసెంబ్లీ టికెట్‌ను జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్‌ చేశారు. జనసేనకు ఆ స్థానాన్ని కేటాయించి తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దన్నారు. కూకట్‌పల్లి స్థానాన్ని జనసేనకు కేటాయించడమంటే బీఆర్ఎస్‌ను గెలిపించడమేనని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు.  

 

 

పొత్తులు, స్థానాలపై ఇంకా రాని స్పష్టత 

తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఇంకా కొలిక్కి రాలేదు. రెండు పార్టీల మద్య చర్చలు జరుగుతున్నట్లుగా కూడా స్పష్టత లేదు. గతంలో ఓ సారి పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. తర్వాత ఢిల్లీలో వీరిద్దరూ కలిసి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. పవన్ కల్యామ్.. కుటుంబ కార్యక్రమం కోసం ఇటలీ వెళ్లారు. మరో వైపు మూడో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనసేనకు పన్నెండు స్థానాలు కేటాయిస్తారంటూ.. సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. అందులో ఉన్న నియోజకవర్గాల కు చెందిన నేతలు.. ఆందోళనకు గురవుతున్నారు. తమ స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొద్దంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Telangana High Court Order: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget