అన్వేషించండి

BJP Etala : పార్టీ నిర్ణయాన్ని కాదని ఇండిపెండెంట్లకు మద్దతు ...తెలంగాణ బీజేపీలో ఈటల కలకలం !

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీజేపీ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయంతో విభేదించిన ఈటల రాజేందర్ ఇద్దర్ని బరిలో నిలబెట్టారు. ఇప్పుడీ అంశం బీజేపీలో కలకలం రేపుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఏకగ్రీవం అవకూడదని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇండిపెండెంట్లను నిలబెట్టానని ఈటల రాజేందర్ ప్రకటించడం ఇప్పుడు ఆ పార్టీలో కలకలం రేపుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనేది బీజేపీ అధికారిక నిర్ణయం. అందుకే ఆ పార్టీ తరపున ఎవరూ  నామినేషన్లు వేయలేదు. కానీ హఠాత్తుగా ఈటల రాజేందర్ తాను ఇద్దరు స్వతంత్రుల చేత నామినేషన్లు వేయించానని.. వారిని గెలిపించుకుంటానని ప్రకటించారు. అంతే కాదు ఎలాంటి ఎన్నిక అయినా టీఆర్ఎస్‌కు ఏకగ్రీవం అయ్యే చాన్స్ ఇవ్వకూడదన్నారు. దీంతో తెలంగాణ బీజేపీలో కొత్త చర్చ ప్రారంభమయింది. 

Also Read : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

కరీంనగర్‌ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని ఈటల జోస్యం చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ అక్కడ గెలవబోతున్నారని  చెప్పారు. ఆయన నిన్నామొన్నటి వరకూ టీఆర్ఎస్‌లో ఉన్నారు. కానీ అనూహ్యంగా నామినేషన్ వేసి.. అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఉద్యమకారులకు మేలు చేయడం లేదని రాజీనామా లే్ఖలో ఆరోపించారు. ఆయనకు ఈటల మద్దతు ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. అదే సమయంలో  ఆదిలాబాద్‌లోనూ తానే స్వతంత్ర అభ్యర్థిని పోటీలో నిలిపినట్లు ఈటల తెలిపారు. 

Also Read : తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

ఎన్నికల్లో పోటీ చేయొద్దన్న పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈటల వ్యవహరించారా అన్న చర్చ ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ  భవన్‌లో జరుగుతోంది. ఈటల రాజేందర్ ఇటీవలే పార్టీలోకి వచ్చారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తర్వాత హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయం సాధించారు. అయితే అక్కడ గెలుపు బీజేపీది కాదని ఈటలదేనన్న ఓ ప్రచారం జరిగింది. దీంతో ఈటల విషయంలో బీజేపీలో భిన్నాబిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆయన దూకుడు కొంత మంది సీనియర్ నేతలకు నచ్చడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈటల సొంతంగా ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని నిలబెట్టడం చర్చనీయాంశం అవుతోంది. 

Also Read: Telangana Devolopment : తెలంగాణ ఆదాయం అదుర్స్.. ఏడేళ్ల వృద్ధిపై ఆర్బీఐ లెక్కలు ఇవిగో..!

బీజేపీ జాతీయ పార్టీ. తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా ఎవరు ఎలాంటి అడుగులు వేసినా ఫిర్యాదులు వెళ్తాయి. వారిపై ఓ కన్నేసి ఉంచారు. ప్రస్తుతం ఈటల విషయంలోనూ ఇలాంటి ఫిర్యాదులు పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను నియంత్రించేందుకు బీజేపీలో ఓ వర్గం రెడీగా ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈటలకు ఇక నుంచి గడ్డు పరిస్థితులు ఎతదురు కావొచ్చన్న అభిప్రాయం ప్రారంభమయింది. 

Also Read : కేంద్రం వడ్లు కొనదు... రైతులు వరి పండించొద్దు.. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటన

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Embed widget