అన్వేషించండి

Hyderabad: అపోలో ఆస్పత్రికి ఈటల రాజేందర్ తరలింపు.. బండి సంజయ్, వివేక్ పరామర్శ

బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను ఆపోలో ఆస్పత్రిలో చేర్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్‌ పరామర్శించారు.

హుజూరాబాద్‌లో ప్రజల మద్దతు కూడగట్టేందుకు కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా పాదయాత్ర చేస్తున్న బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం కొండపాకలో మాట్లాడిన తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. కాళ్లకు పొక్కులు రావడం, జ్వరం, బీపీ ఒక్కసారిగా పడిపోవడం వంటివి జరిగాయి. దీంతో ఆయన్ను డాక్టర్ల సూచన మేరకు వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Also Read: Peddireddy Joins TRS: దళిత బంధు ఆగదు.. నన్ను చంపినా మోసం చేయను.. నొక్కి చెప్పిన కేసీఆర్

శనివారం ఈటల రాజేందర్‌ను ఆపోలో ఆస్పత్రిలో చేర్చారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. అస్వస్థతకు గురైన ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్‌ పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈటలను కలిసి పరామర్శించిన వారిలో ఉన్నారు. ఈటల ఆరోగ్య పరిస్థితిపై బండి సంజయ్ వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈటల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈటలకు కోవిడ్ ర్యాపిడ్ టెస్టులో నెగటివ్ వచ్చిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని త్వరలో కోలుకుంటారని చెప్పారు.

మరోవైపు, ఈటల రాజేందర్ త్వరగా కోలుకోవాలని హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్‌లో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. కమలాపూర్ మండల వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఈటల కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈటల అనారోగ్యం బారిన పడడంతో ప్రజా దీవెన యాత్రను ఆయన భార్య ఈటల జమున కొనసాగిస్తారని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. 

ఈ నెల 19న హుజూరాబాద్‌ నియోజకవర్గం కమలాపూర్ మండలం నుంచి ప్రజా దీవెన యాత్రను ఈటల రాజేందర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 222 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగింది. గురువారం జమ్మికుంట మండలం విలాసాగర్‌, పాపయ్యపల్లి, బిజిగిరిషరీఫ్‌, వెంకటేశ్వర్లపల్లి, కాపులపల్లి, కోరపల్లి, సైదాబాద్‌ గ్రామాల్లో ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్ర కొనసాగించారు. వర్షం పడే సమయంలో కూడా ఆయన పాదయాత్ర సాగింది. శుక్రవారం పాదయాత్ర కొనసాగిస్తున్న ఈటల అస్వస్థతకు గురికావడంతో ఆయన అభిమానులు అందోళనకు గురయ్యారు. కోలుకున్న అనంతరం ఈటల ప్రజా దీవెన యాత్ర తిరిగి ప్రారంభించనున్నారు.

Also Read: Hyderabad Woman Case: అతనికి రోజుకో అమ్మాయి కావాలి.. మహిళ హత్య కేసులో సంచలన నిజాలు, అవాక్కైన పోలీసులు

Also Read: Hyderabad: మంచి నీళ్లు కావాలని ఇంట్లోకొచ్చారు.. మర్యాద చేసినందుకు నోట్లో గుడ్డలు కుక్కి బీభత్సం

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kashmir Terror Attack: కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kashmir Terror Attack: కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Musical horn: భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
Mahesh Babu: మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
Embed widget