అన్వేషించండి

Peddireddy Joins TRS: దళిత బంధు ఆగదు.. నన్ను చంపినా మోసం చేయను.. నొక్కి చెప్పిన కేసీఆర్

మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ దళిత బంధు గురించి మాట్లాడారు.

దళిత బంధు కార్యక్రమం కేవలం ఎన్నికల కోసమే ప్రవేశపెట్టారంటూ విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి సమాధానం ఇచ్చారు. దళిత బంధు పథకం అనేది ఆరునూరైనా ఆగబోదని, ఎవరు ఆపుతారో తానూ కూడా చూస్తానని తేల్చి చెప్పారు. అబద్ధాలు చెప్పే అవసరం తనకు లేదని, తనను చంపినాసరే మోసం చేసేది లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్కసారి చెబితే అది కచ్చితంగా జరిగి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇటీవల తెలంగాణ బీజేపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే సమయంలో పెద్దిరెడ్డి అనుచరులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ దళిత బంధు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రణాళిక ఇలా..
రాష్ట్ర ఆర్థిక పరిమితులు సహా నిధుల లభ్యతను బట్టి ఏడాదికి 2 నుంచి నాలుగు లక్షల దళిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే ఈ పథకం కోసం రూ.లక్ష కోట్లైనా సరే ఖర్చు పెడతామని ప్రకటించానని గుర్తు చేశారు. కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు తెలంగాణ సరైన దారికి చేరుతోందని, ఈ క్రమం ఇలాగే కొనసాగుతుందని సీఎం హామీ ఇచ్చారు. 

ఏదైనా ఏనుగు ఓ దారి గుండా వెళ్తుంటే చుట్టుపక్కల చిన్నచిన్న జంతువులు అరుస్తుంటాయని, అయినా తాను పట్టించుకోబోనని కేసీఆర్ కొట్టిపారేశారు. ఇలాంటి చిల్లర అరుపులను పట్టించుకోబోమని అన్నారు. దళితబంధు అంటే బాంబు పడినట్లుగా ప్రతిపక్షాలు భయపడుతున్నాయని తెలిపారు.

గతేడాదే రావాల్సింది
‘‘ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలన్నీ ఎవరూ అడిగినవి కావు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం అన్నీ ఆలోచించి అన్నింటిని సమకూరుస్తోంది. అలాగే దళిత బంధు ఆలోచన కూడా వచ్చింది. నిజానికి గతేడాదే దాన్ని అమలు చేయాల్సి ఉంది. కరోనా వల్ల ఆలస్యమైంది. బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు ఈ పథకం కోసం కేటాయించాం. గారడీ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుచుకుని అధికారంలోకి వచ్చి, దాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడాలి.’’ అని కేసీఆర్ అన్నారు.

ఎమ్మెల్యేల జీతాలు ఆపి నిధులిస్తున్నాం
‘‘ఎమ్మెల్యేల జీతాలు ఆపి పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నాం. రైతు బంధు, రైతుబీమా చేపట్టడానికి సంవత్సర కాలం పట్టింది. ఇప్పుడు రైతు కుటుంబాలకు వారం, పది రోజుల్లోనే బీమా సొమ్ము వస్తోంది. ఇదే తరహాలో చేనేత కార్మికులకు బీమా కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే వారికీ వస్తుంది.’’ అని కేసీఆర్ అన్నారు.

 

https://twitter.com/trspartyonline/status/1421132721716228098

టాప్ హెడ్ లైన్స్

Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Prakash Goud Son Santosh Goud Allegations: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget