అన్వేషించండి

Peddireddy Joins TRS: దళిత బంధు ఆగదు.. నన్ను చంపినా మోసం చేయను.. నొక్కి చెప్పిన కేసీఆర్

మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ దళిత బంధు గురించి మాట్లాడారు.

దళిత బంధు కార్యక్రమం కేవలం ఎన్నికల కోసమే ప్రవేశపెట్టారంటూ విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి సమాధానం ఇచ్చారు. దళిత బంధు పథకం అనేది ఆరునూరైనా ఆగబోదని, ఎవరు ఆపుతారో తానూ కూడా చూస్తానని తేల్చి చెప్పారు. అబద్ధాలు చెప్పే అవసరం తనకు లేదని, తనను చంపినాసరే మోసం చేసేది లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్కసారి చెబితే అది కచ్చితంగా జరిగి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇటీవల తెలంగాణ బీజేపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే సమయంలో పెద్దిరెడ్డి అనుచరులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ దళిత బంధు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రణాళిక ఇలా..
రాష్ట్ర ఆర్థిక పరిమితులు సహా నిధుల లభ్యతను బట్టి ఏడాదికి 2 నుంచి నాలుగు లక్షల దళిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే ఈ పథకం కోసం రూ.లక్ష కోట్లైనా సరే ఖర్చు పెడతామని ప్రకటించానని గుర్తు చేశారు. కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు తెలంగాణ సరైన దారికి చేరుతోందని, ఈ క్రమం ఇలాగే కొనసాగుతుందని సీఎం హామీ ఇచ్చారు. 

ఏదైనా ఏనుగు ఓ దారి గుండా వెళ్తుంటే చుట్టుపక్కల చిన్నచిన్న జంతువులు అరుస్తుంటాయని, అయినా తాను పట్టించుకోబోనని కేసీఆర్ కొట్టిపారేశారు. ఇలాంటి చిల్లర అరుపులను పట్టించుకోబోమని అన్నారు. దళితబంధు అంటే బాంబు పడినట్లుగా ప్రతిపక్షాలు భయపడుతున్నాయని తెలిపారు.

గతేడాదే రావాల్సింది
‘‘ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలన్నీ ఎవరూ అడిగినవి కావు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం అన్నీ ఆలోచించి అన్నింటిని సమకూరుస్తోంది. అలాగే దళిత బంధు ఆలోచన కూడా వచ్చింది. నిజానికి గతేడాదే దాన్ని అమలు చేయాల్సి ఉంది. కరోనా వల్ల ఆలస్యమైంది. బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు ఈ పథకం కోసం కేటాయించాం. గారడీ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుచుకుని అధికారంలోకి వచ్చి, దాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడాలి.’’ అని కేసీఆర్ అన్నారు.

ఎమ్మెల్యేల జీతాలు ఆపి నిధులిస్తున్నాం
‘‘ఎమ్మెల్యేల జీతాలు ఆపి పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నాం. రైతు బంధు, రైతుబీమా చేపట్టడానికి సంవత్సర కాలం పట్టింది. ఇప్పుడు రైతు కుటుంబాలకు వారం, పది రోజుల్లోనే బీమా సొమ్ము వస్తోంది. ఇదే తరహాలో చేనేత కార్మికులకు బీమా కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే వారికీ వస్తుంది.’’ అని కేసీఆర్ అన్నారు.

 

https://twitter.com/trspartyonline/status/1421132721716228098

టాప్ హెడ్ లైన్స్

Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget