అన్వేషించండి

Bhatti Vikramarka: ఇందిరమ్మ ఇళ్లపై భట్టి గుడ్ న్యూస్, ధరణి బంగాళాఖాతంలోకే - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

Bhatti Vikramarka Adilabad: ఆదిలాబాద్‌ను గుండెల్లో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వం తమదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పాదయాత్రలో తాను బస చేసిన ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని అన్నారు.

Adilabad News: ‘ఇందిరమ్మ రాజ్యంలో పోడు భూములకు పట్టాలిస్తాం, చేతులు పట్టుకొని మీ భూములు దున్నిస్తాం.. రుణాలు సైతం ఇస్తాం ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామ’ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం (ఆగస్టు 7) ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. భూ పోరాటాల ద్వారా సంక్రమించిన భూములపై హక్కులు తిరిగి వారు పొందేందుకు ప్రజల మధ్య చర్చ జరగాలి.. అసెంబ్లీ లోను చర్చ జరిపిస్తాం.. అందరి ఆమోదంతో సమగ్ర భూ చట్టం తెస్తామని తెలిపారు. ఎన్నికల ముందు ఏఐసిసి ఆదేశం మేరకు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేశాను.. సీఎల్పీ నేతగా నేను ఓవైపు.. నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోవైపు ఆదిలాబాద్ నుంచే యాత్రలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. 

మండుటెండల్లో ప్రారంభించిన నా పాదయాత్ర రెండు రోజులు లేదంటే రెండు గ్రామాలకే పరిమితం అవుతుంది ఆ తర్వాత ఆగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రజల సమస్యలు వింటూ 1365 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశాను. ఆ పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాం... ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారం కోసం కంకణ బద్ధులమై ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి అంది వచ్చిన అవకాశాన్ని అనుభవించకుండా అధికారం ఒక బాధ్యత అని నడుచుకుంటున్నాం, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏ ఒక్క హామీని మర్చిపోకుండా అమలు చేస్తున్నాం అన్నారు. 

ఇందిరమ్మ ఇళ్లకు ప్రణాళికలు
మొదటి సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. కొద్ది రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం. ఐదు లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తాం, ఎస్సీ ఎస్టీలకు అదనంగా లక్ష రూపాయలు జత చేసి ఇస్తున్నాం. ఇది ప్రజల ప్రభుత్వం వచ్చే ప్రతి రూపాయి కూడా దుబారా కాకుండా అర్థవంతంగా ప్రజలకే ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

నాడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి పేపర్ లీక్ లేకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం.. మరో 30 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది త్వరలో వారికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. గ్రూప్ వన్, టు, త్రీ, ఎలక్ట్రిసిటీ, సింగరేణిలో ఏడాది మొత్తం ఏ తేదీన ఏ పరీక్ష జరుగుతుందో ఇటీవల జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో విడుదల చేశాం. ఇది ఈ రాష్ట్ర యువత కోసం మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా వారి స్థితిగతులను మార్చే పనులు చేపడతామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ లో గతంలో కొనసాగిన పథకాలను పునరుద్ధరిస్తాం, అందుకు తాజా బడ్జెట్లో 35 వేల కోట్లకు పైబడి నిధులు కేటాయించినట్లు తెలిపారు. పాదయాత్ర సందర్భంగా బస చేసిన ప్రతి ప్రాంతాన్ని సందర్శిస్తానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. 
  
నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని, పోటీ పరీక్షలకు హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు పోకుండా నియోజకవర్గ, కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్లను త్వరలో ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. నిష్ణాతులైన వారిచే ఆన్లైన్లో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ప్రజాయుద్ధనక గద్దర్ అన్న ఆరోగ్యం బాగా లేనప్పటికీ మండుటెండలను సైతం లెక్కచేయకుండా నాతోపాటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకునే నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేనప్పటికీ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను గద్దర్ అన్న ఆలోచన విధానాన్నే మా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నదనీ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ప్రభుత్వం మాది అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో 400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సంపద సృష్టిస్తాం, పేద ప్రజలకు పంచుతామని డిప్యూటీ సీఎం సభలో తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget