By: ABP Desam | Updated at : 08 Oct 2022 08:00 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తెలంగాణకు ఏంచేయలేకపోయిన కేసీఆర్ దేశానికి ఏంచేస్తారని ప్రశ్నించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ సెంటిమెంట్తో పుట్టిన టీఆర్ఎస్ రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పుట్టుకొచ్చిన టీఆర్ఎస్ వాటిని అమలుచేయలేదన్నారు. 2014 నుంచి 2018 వరకు మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదని విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించారన్నారు.
Tantrik told KCR that women Ministers will bring bad luck, so he didn't appoint them in Cabinet
— BJP Telangana (@BJP4Telangana) October 8, 2022
- Union Minister @nsitharaman
This is Shameful and disrespect towards all Women #KCRPracticesBlackMagic pic.twitter.com/xvqZXC98vw
మంత్రాలు, తంత్రాలంటూ
ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. టీఆర్ఎస్ హయాంలో రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని, కానీ చుక్కనీరు కూడా రాలేదన్నారు. నియామకాలు అంటూ గెలిచిన టీఆర్ఎస్ ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను మంత్రివర్గంలో పెట్టుకుంటే మంచిది కాదని తాంత్రికుడు చెప్పడంతో మహిళలకు అవకాశం కల్పించలేదని ఆరోపించారు. మంత్రాలు, తంత్రాలు అంటూ కేసీఆర్ సచివాలయానికి వెళ్లడంలేదని ఆరోపించారు. తెలంగాణను మర్చిపోతున్న టీఆర్ఎస్ కు దేశానికి ఏం చేస్తుందని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.
బండి సంజయ్ ఆరోపణలు
సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తాంత్రికుడి సలహా మేరకే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారన్నారు. తాంత్రికుడి సూచనతోనే సచివాలయానికి వెళ్లడం లేదని, ఫాంహౌజ్ లో నిత్యం నల్ల పిల్లితో క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తనకు ఓ స్వామిజీ తెలిపారని కేసీఆర్ చేస్తోన్న పనులు, వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయం చెబుతున్నానన్నారు. స్వామిజీలు, వేద పండితులతోపాటు సమాజ హితం కోరే వాళ్లంతా కేసీఆర్ క్షుద్ర పూజల నుంచి తెలంగాణను కాపాడాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.
Also Read : Bandi Sanjay : ఫాంహౌజ్ లో కేసీఆర్ క్షుద్ర పూజలు, బండి సంజయ్ సంచలన ఆరోపణలు
Also Read : బండి సంజయ్ తాంత్రిక పూజల విమర్శపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Bhadrachalam MLA: బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ వికెట్! కాంగ్రెస్ లో చేరనున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు!
Telangana constituency wise results: తెలంగాణ తీర్పు: ఏయే నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
Telangana Next CM: సీఎం ఎవరో సోమవారం సీఎల్పీ భేటీలో డిసైడ్ అవుతుంది: డీకే శివకుమార్
బీజేపీ పోరాడితే కాంగ్రెస్ పార్టీ లాభపడింది - బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Barrelakka News: కొల్లాపూర్లో బర్రెలక్క స్థానం ఏంటీ? ప్రచారం ఎక్కువ ప్రభావం తక్కువైందా?
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్కు పూనకాలే
Rajasthan Election Result 2023: రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
/body>