అన్వేషించండి

Amit Shah Etela Rajender Meet : తెలంగాణలో అధికారం దిశగా బీజేపీ అడుగులు, అమిత్ షాతో ఈటల భేటీ!

Amit Shah Etela Rajender Meet : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ ను దిల్లీకి పిలిచి భేటీ అయ్యారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈటలకు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది.

Amit Shah Etela Rajender Meet : తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. బీజేపీ అధిష్ఠానం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు తెలంగాణపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అవుతున్నారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను దిల్లీకి పిలిచిన అమిత్ షా ఆయనతో భేటీ కావడం ఇప్పుడు  రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈటలను దిల్లీకి సడన్ గా పిలవడంపై ఆయనకు కొత్తగా ఏమైనా బాధ్యతలు అప్పగించబోతున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈటలకు జాతీయ స్థాయిలో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, అందుకే దిల్లీకి రమ్మన్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. 

బీజేపీ వ్యూహాలపై చర్చ! 

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తర్వలో జాతీయ పార్టీని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెసేతర, బీజేపేతర నాయకులతో వరుసగా భేటీ అవుతూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ప్రణాళిక వేస్తున్నారు. మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర మంత్రులు బీజేపీ విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్ తరచూ విమర్శలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మొదలైన అసమ్మతి నేటికీ కొనసాగుతోంది. బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఆందోళన వెనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉందని బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై తెలుసునేందుకు హుటాహుటిన హోంమంత్రి అమిత్‌ షా ఈటలతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో బీజేపీ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. 

Amit Shah Etela Rajender Meet : తెలంగాణలో అధికారం దిశగా బీజేపీ అడుగులు, అమిత్ షాతో ఈటల భేటీ!

ఈటలకు కీలక పదవి! 

టీఆర్ఎస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేకత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పరిస్థితులపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. త్వరలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నట్లు ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్‌ ను ఎదురించి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కీలక పదవి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన దిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరికొంత మంది కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలతో ఈటల భేటీకానున్నట్లు సమాచారం. ఈటలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. రెండురోజుల పాటు ఈటల దిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. కీలక పదవి ప్రకటన తర్వాతే హైదరాబాద్‌కు ఈటల వస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
Embed widget