By: ABP Desam | Updated at : 15 Sep 2023 03:02 PM (IST)
తుమ్మలతో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం - 17న పార్టీలో చేరే అవకాశం !
Tummala : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రేతో పాటు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సలహా పలువురు నేతలు హైదరాబాద్లోని తుమ్మల ఇంటికి వెళ్లారు. పదిహేడో తేదీన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో విజయభేరి బహిరంగసభ నిర్వహిస్తోంది. ఆ సభలో తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరే అవకాశం ఉంది.
ఈ నెల 16, 17 తేదీలలో జరుగనున్న సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర అగ్రనేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మలతో కాంగ్రెస్ నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాలలోనే తుమ్మలను కాంగ్రెస్లో చేరేలా ఒప్పించినట్లుగా తెలుస్తోంది. పాలేరు టికెట్ తుమ్మలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పిందని తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆమె స్థానం ఏంటి అనేది క్లారిటీ లేదు. పైగా ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తుందనేది క్లారిటీ లేదు. ఇప్పటికే ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ అక్కడ తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. దీంతో సీటు ఆయనకే దక్కే ఛాన్స్ ఉంది. ఒకవేళ షర్మిల తెలంగాణ ఎన్నికల బరిలో ఉంటే..ఆంధ్రా పెత్తనం అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసి..కాంగ్రెస్కి డ్యామేజ్ చేయవచ్చు అనేది తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ని కేవిపి రామచంద్రరావు నడిపిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్కు నష్టం. అందుకే ఆమెకి జాతీయ స్థాయిలో కీలక పదవి ఇస్తారని అంటున్నారు.
వరుసగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసి.. ఉమ్మడి ఖమ్మం జిల్లా, సత్తుపల్లికి గుర్తింపు తెచ్చారు. ఆ తర్వాత 2004లో జలగం వెంకటరావుపై ఓడిపోయారు. ఇక 2009లో సత్తుపల్లి ఎస్సీకి రిజర్వ్ కావటంతో ఖమ్మం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన జలగం వెంకటరావుపై స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అలాగే 2014లో కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయకుమార్ పైపోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2016లో పాలేరు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధించిన.. ఆయన ఇక్కడి నుంచే 2018 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తుమ్మలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాలలో గట్టి క్యాడర్ సంపాదించుకున్నారు.
ఆర్ఎస్ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తుమ్మల పేరు లేకపోవడంతో బీఆర్ఎస్ లో మనుగడా కష్టమని భావించిన తుమ్మల కాంగ్రెస్ లో చేరుతున్నారు.
Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్
Telangana Election Shedule : పదో తేదీ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ? - ఆ లోపే కీలక హామీలపై ఉత్తర్వులు !
PGECET Seats: పీజీఈసెట్ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు
Top Headlines Today: పవన్కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు - తెలంగాణ కాంగ్రెస్ ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్
తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్
ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్
Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?
Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...
Bandi sanjay on BRS: ప్రధాని టూర్తో ప్రగతిభవన్లో ప్రకంపనలు- బీఆర్ఎస్లో చీలిక ఖాయమన్న బండి సంజయ్
/body>