అన్వేషించండి

Telangana Bonalu: ఆషాఢ బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

Ashada Bonalu 2024: హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో జులై 7వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే ఆషాఢ బోనాల‌కు ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసింది.

Telangana Bonalu 2024: హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో ఆషాఢ బోనాల సందడి షురూ కానుంది. మొదటగా  గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్‌లో గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు జరుగుతుంది.  ఆషాడ బోనాల పండుగతో జంటనగరాలు దాదాపు నెల రోజుల పాటు కోలహలంగా మారనున్నాయి. బోనాల పండుగను ఆషాఢమాసంలో నిర్వహిస్తారు. బోనాల్లో భాగంగా.. ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి భక్తులు ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. బోనాల పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇక.. జులై 7వ తేదీ నుంచి భాగ్యనగరలో బోనాల జాతర ప్రారంభం కానుంది.  

బోనాల వేడుకకు ప్రభుత్వ నిధులు
జులై 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ బోనాల‌కు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది.  ఈ క్రమంలోనే ఆషాఢ బోనాల‌కు ప్రభుత్వం  రూ. 20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేర‌కు దేవ‌దాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైల‌జా రామ‌య్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.  జంట నగరాల్లో  ఆషాఢ బోనాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ స‌మీక్షలో హైద‌రాబాద్ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.   తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల ఉత్సవాలను నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ  అధికారులను ఆదేశించారు. బేగంపేట‌లో ఉన్న హ‌రిత ప్లాజాలో ఈ స‌మీక్ష జ‌రిగింది. ఈ ఏడాది జులై 7 నుంచి 29తేదీ వ‌ర‌కు అత్యంత వైభ‌వంగా బోనాల పండుగ‌ను నిర్వహించనున్నారు.

గోల్కొండలో తొలిపూజ
ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం(జూలై 7) రోజు జంట నగరాల్లో బోనాల జాతర ప్రారంభమవుతుంది. గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలిపూజ నిర్వహిస్తారు, తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో నెలరోజుల పాటూ ప్రతి గురువారం, ఆదివారం ప్రత్యేక పూజలు చేపడతారు. మళ్లీ గోల్కొండ కోటలోనే చివరి రోజు పూజ నిర్వహించడంతో బోనాల జాతర ముగుస్తుంది.  బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, మెట్రో, ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బస్సు సౌకర్యం ఉండటం వల్ల ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు.  ఉత్సవాల్లో కళాబృందాలను తీసుకురావడంతో పాటు, లేజర్ షోలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

అధికారులపై మంత్రి  సీరియస్ 
మంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి రాని అధికారులపై మంత్రి కొండా సురేఖ  ఆగ్రహం వ్యక్తం చేశారు.  మీటింగ్ కు రాని అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.  లక్షల మంది హాజరయ్యే పండుగకు సంబంధించి మీటింగ్ పెడితే.. మంత్రులు, మేయర్ వస్తే అధికారులు హాజరు కారా అంటూ ప్రశ్నించారు.    గోల్కొండ కోటలో తొమ్మది వారాలు  బోనాలు సమర్పించే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలిపారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget