Telangana Janasena: తెలంగాణలో పవన్ ప్రచారంపై కాంగ్రెస్ నిప్పులు- జాతీయ సమగ్రత కోసం బరిలోకి దిగుతామన్న జనసేన
Congress: తెలంగాణలో బీజేపీ కోసం పవన్ ప్రచారం చేయాలని నిర్ణయించడంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ విమర్శలను జనసేన ఖండించిది.

Congress criticizes Pawan decision to campaign for BJP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ను పవన్ కాదు.. దిష్టికళ్యాణ్ అని సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరించడం లేదని, అందుకే ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి భిక్షాం దేహీ అని అడిగారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్ర నాయకుడని, ఆయన గతంలో తెలంగాణ భాష, యాస గురించి నీచంగా మాట్లాడారని.. అటువంటి వ్యక్తి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని, ఆయన రాజకీయాలు ఆంధ్రాకే పరిమితం చేసుకోవాలని మహేష్ గౌడ్ ఘాటుగా హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్ 😂
— TRPartyOfficial (@TRPartyOfficial) February 4, 2026
దిష్టి కళ్యాణ్ కు సిగ్గులేదు అందుకే తెలంగాణలో ప్రచారానికి వస్తున్నాడు గతంలో తెలంగాణ ప్రజల గురించి నీచంగా మాట్లాడి మళ్ళీ సిగ్గులేకుండా తెలంగాణకు వస్తున్నావ్ - PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ pic.twitter.com/7AXjXFoa8d
మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. జనసేన పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టిన పార్టీ కాదని, అది జాతీయ సమగ్రత కోసం తెలంగాణ గడ్డ మీద ఆవిర్భవించిన పార్టీ అని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తరహాలోనే జనసేన కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే జనసేన చూస్తూ ఊరుకోదని, ప్రజాస్వామ్యబద్ధంగా తమ బలాన్ని నిరూపించుకుంటామని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రచారంపై కాంగ్రెస్ ఎందుకు ఇంతలా భయపడుతోందని వారు ప్రశ్నించారు.
కాంగ్రెస్ తెలంగాణ పార్టీ కాదు, BRS తెలంగాణ పార్టీ కాదు, బీజేపీ తెలంగాణ పార్టీ కాదు, ఈ మూడు పార్టీలు ప్రస్తుతం జాతీయ పార్టీలు.. అలాగే జనసేన కేవలం ఆంధ్రకోసం పెట్టిన పార్టీ కాదు, జాతీయ సమగ్రత కోసం తెలంగాణ గడ్డ మీద పెట్టిన పార్టీ.
— JanaSena Telangana (@JSPTelangana) February 4, 2026
ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తే జనసేన…
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నిక కారణంగా పవన్ ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్తో విజయం సా ధించిన జనసేన, అదే జోష్ను తెలంగాణలోనూ కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఈ "లోకల్ వర్సెస్ నాన్-లోకల్" వివాదం ముదిరిపోతోంది. పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ ఖరారైతే ఈ విమర్శలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.























