అన్వేషించండి

Palamuru Rangareddy Lift Irrigation: 50 శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులెలా పూర్తి చేశారు - పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy Slams KCR BRS: పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వివరాలు వెల్లడించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో నిధుల దుర్వినియోగం, కమీషన్ల దందాపై గణాంకాలతో పాలమూరులో వివరించారు.

CM Revanth Reddy Palamuru Projects:  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతి , గత ప్రభుత్వ వైఫల్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లా ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడమే లక్ష్యంగా తాము కంకణం కట్టుకున్నామని స్పష్టం చేస్తూ, ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తోన్న విమర్శలను గణాంకాలతో సహా తిప్పికొట్టారు.
   
 పదేళ్ల కేసీఆర్ పాలనలో నిధుల దుర్వినియోగం 

తెలంగాణ వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రజలు ఆశించారని, కానీ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో జిల్లాకు ఘోర అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం మొత్తం రూ. 1 లక్ష 81 వేల కోట్లు ఖర్చు పెడితే, అందులో అక్షరాలా లక్ష కోట్లు కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే తగలేశారని మండిపడ్డారు. అత్యంత కీలకమైన, జిల్లాకు జీవనాడి లాంటి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. 

 కమీషన్ల కోసమే పంపులు, లిఫ్టులు.. భూసేకరణ సున్నా 

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా 90 టీఎంసీల నీటిని అందించే అవకాశం ఉందని, జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులతో పాటు దీనిని పూర్తి చేసి ఉంటే జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని రేవంత్ రెడ్డి వివరించారు. పదేళ్లలో కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ, ఆ ధనమంతా కేవలం పంపులు, లిఫ్టుల కాంట్రాక్టుల బిల్లుల రూపంలో కమీషన్లు కొల్లగొట్టడానికే సరిపోయిందని ఆరోపించారు. ఏ ప్రాజెక్టుకైనా ముందస్తుగా కావాల్సిన భూసేకరణను అసలు పూర్తి చేయకుండానే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని కేసీఆర్ భావించారని ప్రశ్నించారు. ఒక్క ఎకరాకు కూడా నీరివ్వకుండా ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్లారని, దీనిపై నాగం జనార్దన్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారని గుర్తుచేశారు.  

 అప్పుల భారం - 30 నెలల్లో కాంగ్రెస్ సాధించింది ఇదే 

గత పదేళ్లలో కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రూ. 84,503 కోట్ల భారీ అప్పును మిగిల్చారని సీఎం వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల కాలంలోనే ఆ అప్పుల కింద రూ. 52,120 కోట్లు కట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ, ఎంతో ఓపికతో తాము 30 నెలల్లో కాంట్రాక్టర్లకు రూ. 22 వేల కోట్లు చెల్లించామని, అందులో రూ. 8 వేల కోట్లు కేవలం పాలమూరు ప్రాజెక్టుల కోసమే ఖర్చు పెట్టామని గణాంకాలను సభ ముందుంచారు. పాలమూరు కోసం తాము ఎంతగా కట్టుబడి ఉన్నామో చెప్పడానికి ఈ నిధులే నిదర్శనమన్నారు.

 బీఆర్ఎస్ 90 శాతం అబద్ధాలు - ఆ సైన్స్ నాకు అర్థం కాదు 

పాలమూరు ప్రాజెక్టులు 90 శాతం పూర్తయ్యాయంటూ బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు చెపుతున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రాజెక్టు అంచనా వ్యయంలో 50 శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయో ఆ సైన్స్, మ్యాథ్స్ తనకు అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు.  నేనేం కేసీఆర్ లాగా 80 వేల పుస్తకాలు చదవలేదు  అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉన్నదంతా దోచుకుపోయి, ఇప్పుడు తాము ప్రాజెక్టులను ఒక కొలిక్కి తెస్తుంటే, ప్రజల్లో తమను దోషులుగా చూపేందుకు బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు ఆడుతోందని, కానీ ప్రజలు అమాయకులు కారని, వారికి అంతా తెలుసని అన్నారు.

 రెండేళ్లలో పూర్తి చేస్తాం - సహకరించండి 

ప్రజలు ఛీదరించుకుంటున్నా సోయి లేకుండా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ నేతలు, తిన్నది అరిగేలా పాదయాత్రలు చేసే బదులు కాశీ వరకు నడిస్తే వారి పాపాలు కొన్నికైనా పోతాయని హితవు పలికారు. ఇప్పటికీ ప్రాజెక్టుల కోసం ఇంకా 4 వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని, రాబోయే రెండేళ్లలో జిల్లాలోని ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని తాము కంకణం కట్టుకున్నామని సీఎం స్పష్టం చేశారు. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికే తాను స్వయంగా జిల్లాలో పర్యటిస్తున్నానని, భూసేకరణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ ఈ పనులు పూర్తి కావని, అలా వదిలేస్తే చరిత్ర మనల్ని క్షమించదని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. చివరగా, జిల్లా బీఆర్ఎస్ నేతలు మాకు ఎలాంటి సాయం చేయనక్కర్లేదు.. ఈ రాబోయే రెండేళ్లు నోరు మూసుకుని ఏమీ మాట్లాడకుండా ఉండటమే వాళ్ళు మాకు చేసే అతిపెద్ద సాయం అని రేవంత్ విజ్ఞప్తిచేశారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Palamuru Rangareddy Lift Irrigation: 50 శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులెలా పూర్తి చేశారు - పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
50 శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులెలా పూర్తి చేశారు - పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Railway Board Rejects Free MMTS: ఉచిత ఎంఎంటీఎస్‌కు రైల్వేబోర్డు నో - తెలంగాణ ప్రభుత్వానికి షాక్
ఉచిత ఎంఎంటీఎస్‌కు రైల్వేబోర్డు నో - తెలంగాణ ప్రభుత్వానికి షాక్
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget