అన్వేషించండి

Revanth Reddy: పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్‌ అభివృద్ధి - ఎయిర్‌బస్‌ తిరిగేలా ఎయిర్ పోర్ట్ - నిర్మల్‌లో రేవంత్ కీలక ప్రకటన

Nirmal CM Revanth: ఆదిలాబాద్‌కు అభివృద్ధి ఎయిర్ బస్ వేగంతో పని చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. నిర్మల్ బహిరంగసభలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, పారిశ్రామిక వాడపై సంచలన ప్రకటనలు చేశారు.

CM Revanth Nirmal: "ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం.. ఇది పోరాటాల గడ్డ. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్‌లో జరిగిన  ప్రజా పాలన- ప్రగతి బాట బహిరంగ సభలో  ప్రసంగించారు.  జిల్లా అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు బాసర ఐఐటీ  లోనే యూనివర్సిటీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదేశించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించి, నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

తుమ్మిడిహట్టి నిర్మాణం.. పారిశ్రామిక ప్రగతి 

ఆదిలాబాద్ రైతాంగం చిరకాల స్వప్నమైన తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బడ్జెట్ సమావేశాల లోపు ఈ ప్రాజెక్టుపై పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశిస్తూ.. ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. కేవలం సాగునీటికే పరిమితం కాకుండా, ఒకప్పుడు ఎర్రబస్సు తిరగడమే కష్టమైన ఈ ప్రాంతంలో ఎయిర్ బస్ తిరిగేలా ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని, దానికి అనుబంధంగా 10 వేల ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని ఎన్నిసార్లయినా కలుస్తానని, ఇందుకు బీజేపీ ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.

సంక్షేమ పథకాలే ఊపిరి

పేదల సంక్షేమమే తన ప్రభుత్వ ఎజెండా అని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఇప్పటికే అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల పురోగతిని వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని, మహిళా సంఘాలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో సామాన్యుడికి అండగా ఉంటున్నామని తెలిపారు. గత పాలకులు చేసిన అప్పులు రాష్ట్రానికి ఉరితాడుగా మారినా, ప్రజల సంక్షేమం కోసం వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. ఓడిపోయిన వారు చేసే విమర్శలను తాను పట్టించుకోనని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మంచి చేయడానికే ఉపయోగిస్తానని అన్నారు.

మహనీయుల స్మరణ - మున్సిపల్ ఎన్నికల నగారా 

ప్రజలకు సేవ చేసిన మహనీయుల గుర్తుగా చనాక-కొరటా ప్రాజెక్టుకు  సి.రామచంద్రారెడ్డి పేరును, సదర్మట్ బ్యారేజీకి నర్సారెడ్డి  పేరును పెడుతున్నట్లు సీఎం ప్రకటించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల గురించి ప్రస్తావించారు.  మంచి ప్రజాప్రతినిధుల్ని గెలిపించాలన్నారు.  గతంలో గెలిచాం, రేపు గెలుస్తాం, మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసే వారినే రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఎన్నికలు ముగిశాక కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు                    

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget