అన్వేషించండి

KCR Tour: మెదక్‌లో సీఎం కేసీఆర్, జిల్లా ఎస్పీ ఆఫీసు, బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు, హోంమంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ శాంతికుమారి తదితరులు ఉన్నారు.

సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం (ఆగస్టు 23) మధ్యాహ్నమే కేసీఆర్ మెదక్ కు చేరుకున్నారు. ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆ ఆఫీసులో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్రపటాల దగ్గర పూజలు చేశారు. ఈ మంత్రోచ్ఛారణలు జరిపి, అర్చకులు అక్షింతలు వేసి ఆయనను ఆశీర్వదించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు, హోంమంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ శాంతికుమారి, డీజీపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.

టాప్‌లో తెలంగాణ రాష్ట్రమే - కేసీఆర్

ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని అన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో ఏ రాష్ట్రమూ నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలు కూడా బాగా  లేవని అన్నారు. ఉమ్మడి పాలనలో మంజీరా నది దుమ్ముకొట్టుకుపోయిందని విమర్శించారు.

తెలంగాణ వారికి పరిపాలన చేతకాదంటూ ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డిలాగా కొందరు ఎగతాళి చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. కొత్తగా ప్రారంభించుకుంటున్న ఆఫీసులే మన దగ్గర డెవలప్మెంట్ కు నిదర్శనమని అన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. అధికారుల కృషి వల్లే ఇది సాధ్యం అయిందని చెప్పారు. ఉద్యోగాల కల్పనలో కూడా రాష్ట్రం నంబర్ వన్ గా ఉందని అన్నారు. వచ్చే రోజుల్లో పింఛను పెంచుతామని, దివ్యాంగుల పింఛన్ ను రూ.4,016 కు పెంచామని వెల్లడించారు. రాష్ట్రంలో 50 లక్షల మంది పింఛను దారులు ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

63 ఎకరాల సువిశాల స్థలంలో జిల్లా పోలీసు కార్యాలయం నిర్మించారు. జీ ప్లస్ 3 పద్ధతిలో 38.50 కోట్ల వ్యయం ఈ నిర్మాణానికి అయింది. ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే పరేడ్ గ్రౌండ్ ఉంటుంది. ఆ పక్కనే పోలీస్ క్వార్టర్స్ ఉంటుంది. 

ఒక ఎకరా స్థలంలో రూ.60 లక్షల ఖర్చుతో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును నిర్మించారు. జిల్లా నేతలకు సమావేశాలు ఏర్పాటు చేసుకొనేందుకు ఇది వేదిక కానుంది. కార్యాలయంలో మీటింగ్ పెట్టుకోవడానికి అనువుగా ప్రత్యేకంగా పెద్ద హాల్ నిర్మాణం చేపట్టారు. 

దివ్యాంగులకు రూ. 3116 నుంచి రూ. 4116 కు పెంచిన పింఛన్‌ను, టెకేదార్ బీడీ కులవృత్తుల కార్మికులకు పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలించారు. 

భారీ బహిరంగసభ

నేడు భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. ఇదే సభలో దివ్యాంగుల పెన్షన్ పెంపుపై కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు జాబితాను కేసీఆర్ ఇటీవల తెలంగాణ భవన్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభలో సీఎం ఏం మాట్లాడనున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక పెడింగ్ లో ఉన్న నర్సాపూర్ టికెట్ పై ఈ సభలో క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget