అన్వేషించండి

అసెంబ్లీ ఎన్నికలు 2026

(Source:  Poll of Polls)

Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు వడదెబ్బ, 48 గంటలపాటు వైద్యుల అబ్జర్వేషన్‌లోనే సీఎల్పీ నేత

Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల సూచన మేరకు రెండ్రోజులు పాదయాత్రకు విరామం ఇచ్చారు.

Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర ఎండలతో వడదెబ్బకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలంలోని రుక్కంపేట వద్ద భట్టి స్వల్ప అనారోగ్యం పాలయ్యారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన టెంట్ లోనే భట్టి విక్రమార్కకు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పరదేశి, డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఎండలు తీవ్రంగా ఉండటం వందలాది కిలోమీటర్ల మేర నడుస్తుండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురైందని డాక్టర్లు తేల్చారు. వడదెబ్బకు గురయ్యారని నిర్ధారించారు. ఈ రోజు ఉద‌యం కూడా షుగ‌ర్ లెవెల్స్, బీపీ, ఫ్లూయిడ్స్ ను ప‌రీక్షించారు. వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌డం వ‌ల్ల డీ హైడ్రేష‌న్ ను గురికావ‌డంతో.. త‌గిన విశ్రాంతి త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలని.. అలాగే ఫ్లూయిడ్స్ తీసుకోవాల‌ని సూచించారు. 

48 గంటలపాటు అబ్జర్వేషన్‌లోనే భట్టి

డీహైడ్రేష‌న్ పూర్తిగా తగ్గే వ‌ర‌కూ ఎండ‌ల్లో న‌డ‌వ‌కూడ‌ద‌ని భ‌ట్టి విక్ర‌మార్క‌కు వైద్యులు సూచించారు. 48 గంటల పాటు భట్టి విక్రమార్క పూర్తిగా అబ్జర్వేషన్ అవసరం అని చెప్పారు. అంతేకాకుండా రాబోయే రెండు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. శ‌నివారం ఉద‌యం, సాయంత్రం మరోసారి వైద్యులు భ‌ట్టి విక్ర‌మార్క‌ ఆరోగ్యాన్ని ప‌రీక్షంచ‌నున్నారు.

Also Read: ప్రాణ‌హిత- చేవెళ్ల చేప‌ట్టి ఉంటే, తెలంగాణలో తొలి మూడేళ్ల‌లోనే నీళ్లు పారేవి: భట్టి విక్రమార్క

పాదయాత్రకు రెండ్రోజులు విరామం

డాక్టర్ సూచనల మేరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు శనివారం, ఆదివారం( మే 19, 20 తేదీల్లో) విరామం ప్రకటించారు. అస్వస్థత‌కు గురైన సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్కను ప్రచార క‌మిటీ క‌న్వీన‌ర్, పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర కో ఆర్డినేట‌ర్ అజ్మతుల్లా హుస్సేన్ పరామర్శించారు. ఈ రెండు రోజుల విరామం..త‌రువాత పాద‌యాత్ర కొన‌సాగింపుపై సీఎల్పీ నేత‌తో అజ్మతుల్లా హుస్సేన్ చర్చించారు.

Also Read: Bhatti Vikramarka: 2 రోజులకే పాదయాత్ర ఆపేస్తానన్నారు, జనం అరచేతిలో పెట్టుకొని నడిపించారు: భట్టి విక్రమార్క

భారత్ జోడో యాత్రకు కొనసాగింపే పీపుల్స్ మార్చ్

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పాదయాత్రను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మే 16 తేదీన భట్టి పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేటలోకి ప్రవేశించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్ కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల్లో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ మూడు నియోజకవర్గాల్లోని 62 గ్రామాల్లో పాదయాత్ర చేయాలని భట్టి విక్రమార్క ప్రణాళిక. మొత్తం 12 రోజుల పాటు చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ప్రతీ గ్రామం వద్ద భట్టి విక్రమార్క ప్రజలతో మమేకమయ్యేలా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. మొత్తం మూడు చోట్ల కార్నర్ మీటింగ్ లు నిర్వహించాలని ప్లాన్.

కేంద్ర, రాష్ట్ర విధానాలతో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలుపై ప్రజలతో చర్చిస్తూ భట్టి తన పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ పాదయాత్రను సద్వినియోగం చేసుకుంటున్నారు.  మహబూబ్ నగర్ లో జరిగే పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన ఉదండాపూర్ రిజర్వాయర్ తో పాటు, వట్టెం రిజర్వాయర్లను, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని భట్టి విక్రమార్క పరిశీలిస్తారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
TS SSC Results 2026 District wise Results: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు
తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు
Husky Dogs: ఖరీదైన హస్కీ కుక్కల్ని పెంచి రోడ్డున వదిలేశారు - కాపాడిన స్వచ్చంద సంస్థలు - ఎవరి పని?
ఖరీదైన హస్కీ కుక్కల్ని పెంచి రోడ్డున వదిలేశారు - కాపాడిన స్వచ్చంద సంస్థలు - ఎవరి పని?
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
Dhurandhar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
Bollywood Intimate Scenes:
"ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోతున్నారు, కట్‌ చెప్పినా ఆగడం లేదు" బాలీవుడ్ నటులపై యాక్టర్ సంచలన ఆరోపణలు! 
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Hormuz: హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
Embed widget