By: ABP Desam | Updated at : 22 May 2022 06:12 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఎం కేసీఆర్
CM KCR : దేశవ్యాప్త పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ చండీగఢ్ లో పర్యటించారు. రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతులు, అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేశారు. దేశచరిత్రలో పంజాబ్ రైతులు రెండు గొప్ప పోరాటాలు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. పంజాబ్ రైతులు హరితవిప్లవంతో దేశ ప్రజల ఆకలిని తీర్చారన్నారు. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. పంజాబ్ రైతుల పోరాట స్ఫూర్తికి సలాంచేస్తున్నానన్నారు. కేంద్రం సాగుచట్టాలు రద్దు చేసేంతవరకు రైతులు పోరాటం ఆగలేదన్నారు. రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు పెడుతోందన్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్రవేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులు అందజేశారు. గాల్వన్లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు.
రైతులు, సైనికుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
చండీగఢ్ లో రైతులు, జావాన్ల కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించారు. చండీగఢ్లోని ఠాగూర్ స్టేడియంలో రైతుల కుటుంబాలకు పరామర్శ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, దిల్లీ, పంజాబ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ పాల్గొన్నారు. అంతకు ముందు ఆదివారం మధ్యాహ్నం దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. అనంతరం విందుభేటీలో ఇద్దరు నేతలు పలు అంశాలపై చర్చించారు. జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు సీఎంలు దిల్లీ నుంచి చండీగఢ్కు వెళ్లారు. సాగుచట్టాలపై ఉద్యమంపై అమరులైన రైతు కుటుంబాలను ముఖ్యమంత్రులు పరామర్శించారు. ఈ సందర్భంగా చండీగఢ్లో రైతులు, సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. అలాగే 543 మంది రైతు కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం సీఎం కేసీఆర్ అందజేశారు.
Chief Minister Sri K. Chandrashekar Rao met with Aam Admi Party (AAP) National Convenor, Delhi CM Sri @ArvindKejriwal at the latter's residence in New Delhi today. pic.twitter.com/kKq06oOcWH
— Telangana CMO (@TelanganaCMO) May 22, 2022
Nizamabad News: నిజామాబాద్ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు, ఎమ్మెల్సీ కవిత సీరియస్!
Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Piyush Goyal On CM KCR : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్పు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్
MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోని ట్రైన్ దిగిపోయిన ఎంపీ
IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్
IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్