అన్వేషించండి

BRS Mlas: మీడియా పాయింట్ వద్దకు నో ఎంట్రీ - బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం

BRS Mlas Argument: అసెంబ్లీ నుంచి వాకౌట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

BRS Mlas Argued With Police in Assembly: తెలంగాణ అసెంబ్లీ (TRS Assembly) నుంచి వాకౌట్ అయిన బీఆర్ఎస్ సభ్యులు అనంతరం లాబీల్లో నుంచి బయటకు వచ్చేశారు. అయితే, వారు మీడియా పాయింట్ వద్దకు వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మార్షల్స్, పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి మరీ వారిని నిలువరించారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదనే నిబంధన ఉందని పోలీసులు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. కొత్తగా ఈ రూల్స్ ఏంటంటూ హరీష్ రావు (HarishRao), కేటీఆర్ (KTR) వాదించారు. స్పీకర్ నుంచి తమకు అలాంటి నోట్ రాలేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదని.. పోలీస్ పాలన అంటూ దుయ్యబట్టారు. సభలో మైక్ ఇవ్వరు.. ఇక్కడ కూడా మాట్లాడనివ్వరా.? అంటూ నిలదీశారు. సీఎం స్థాయికి తగని విధంగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారని..  ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందంటూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.

స్పీకర్ మౌఖిక ఆదేశాలు

మీడియా పాయింట్ లో మాట్లాడకూడదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెక్యూరిటీ అధికారి అడ్డుకున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన రూలింగ్ కానీ రాతపూర్వక ఆదేశాలు ఏమన్నా ఉంటే చూపించాలని వారు డిమాండ్ చేశారు. స్పీకర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని అసెంబ్లీ భద్రతా సిబ్బంది, పోలీసులు బీఆర్ఎస్ నేతలకు తెలిపారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, స్పీకర్ తో మాట్లాడి అనుమతి తీసుకొని చెప్తానని చెప్పిన అధికారులు.. స్పీకర్ అనుమతి ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఈ క్రమంలో వారు అడ్డుకున్న చోటే బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ నిరసనలో కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

'ఇదేమి కంచెల పాలనా.?'

అనంతరం, బైఠాయించిన చోటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. 'అసెంబ్లీలో సీఎం రేవంత్  అనుచిత భాషను ఖండిస్తున్నాం. చెప్పలేని భాషలో ఆయన మాట్లాడుతున్నారు. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే స్పీకర్ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. సీఎం భాషకు ధీటుగా బదులు ఇవ్వగలం.. కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు. దీనిపై ప్రశ్నిద్దామంటే అసెంబ్లీలోనూ అవకాశం ఇవ్వడం లేదు. బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు. కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా.?' అంటూ కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా.. మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడవద్దనే నిబంధన ఏదీ లేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తాను కూడా శాసనసభా వ్యవహారాల మంత్రిగా చేశానని.. ప్రభుత్వం కావాలనే ప్రతిపక్షం గొంతు నొక్కుతోందని మండిపడ్డారు.

Also Read: CM Revanth Reddy: 'చచ్చిన పామును ఎవరైనా చంపుతారా?'- కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
CM Revanth Reddy: కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget