అన్వేషించండి

తెలంగాణ భవన్‌లో రోజంతా BRS నేతల హడావుడి, మోదీ టూర్‌కు దూరంగా సీఎం కేసీఆర్!

బండి సంజయ్ కేంద్రంగా BRS కౌంటర్ల మీద కౌంటర్లుకోల్ బెల్ట్ ఏరియాల్లో బీజేపీ నేతలను తిరగనివ్వబోమని

బీఆర్‌ఎస్‌ నేతలు వరుసబెట్టి బీజేపీకి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా నేతలంతా విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో రోజంతా గులాబీ నేతల హడావిడి కనిపించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకరితర్వాత ఒకరు వచ్చి ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీ మీద ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ మోదీ టూర్‌కు దూరంగా ఉంటారని కూడా క్లారిటీ ఇచ్చారు. సింగరేణి సమ్మె మోత మోగుతుందని అన్నారు. కోల్ బెల్ట్ ఏరియాల్లో బీజేపీ నేతలను తిరగనివ్వబోమని BRS నేతలు తేల్చిచెప్పారు.  

ప్రధాని సభకు కేసీఆర్ రావడం లేదు- వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘ వైస్ చెర్మన్  

ప్రధాని మోదీ తెలంగాణను గందరగోళ పరచాలని చూస్తున్నారన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘ వైస్ చెర్మన్ వినోద్ కుమార్. అభివృద్ధిలో తెలంగాణకు వీసమెత్తు సాయం చేయడం లేదన్నారు. జాతీయ రహదారుల విషయంలో నితిన్ గడ్కరీ దగ్గరికి పోతే నేనేం చెయ్యాలి అని అన్నారని తెలిపారు. ఇప్పుడు ఉన్నది మునుపటి బీజేపీ పార్టీ కాదు. ప్రధాని తెలంగాణకు జాతీయ రహదారులు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నవోదయ విద్యాలయాలు కొత్త జిల్లాలకు ఇవ్వాలనే హామీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు? తెలంగాణ ప్రజలకు చట్టబద్దంగా రావాల్సినవి రావడం లేదని.. మోదీ మేం అడిగిన వాటికి సమాధానం చెప్పాలన్నారు. రేపు ప్రధాని సభకు సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు.. ఆయన ఒక్కరే వచ్చి పోతారని క్లారిటీ ఇచ్చారు వినోద్ కుమార్ 

పాపాలు చేసైనా పవర్‌లోకి రావాలనేదే బీజేపీ సిద్ధాంతం- మంత్రి ఎర్రబెల్లి  

బండి సంజయ్ విచిత్రంగా మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. సంజయ్ విద్యార్థులు జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారని... రెండు పేపర్లు లీక్ కావడానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఎన్ని పాపాలైనా చేయాలి పవర్‌లోకి రావాలి అనేది బీజేపీ విధానమన్నారు. అసలు ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావ్ అని బండిని ప్రశ్నించారు. పొరపాటును ఇప్పటికైనా ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీ అంటే బ్రోకర్. జే అంటే జుమ్లా. పీ అంటే పేపర్ లీకేజ్ పాలిటిక్స్ అన్నారు. బండి మీద యాక్షన్ తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఇందులో సంబంధం ఉన్నట్లే అన్నారు మంత్రి ఎర్రబెల్లి  

నమో అంటే నమ్మక ద్రోహం, మోసం -ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

బీజేపీ అబద్దాల బండి.. దాని నాయకుడు తొండి సంజయ్ అన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బండి రాజకీయాలకు పనికి రాని వ్యక్తి అన్నారు. కేసీఆర్‌ను డైరెక్టుగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారని విమర్శించారు. లీకేజీ వ్యవహారంలో కర్త కర్మ క్రియ సంజయే అన్నారు. పరీక్షపత్రాల లీకేజీలో పట్టపగలే దొరికిన వ్యక్తి బండి సంజయ్ అని.. నమో అంటే నమ్మక ద్రోహం, మోసం అన్నారు. మోడీ ప్రజలను , దేశాన్ని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని తెలిపారు. మోదీకి దమ్ముంటే రాష్ట్రానికి నిధులు తీసుకొని రావాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు

సింగరేణిని అదానీకి అప్పచెప్పే కుట్ర - ఎమ్మెల్యే బాల్క సుమన్ 

బండి సంజయ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మరో ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ప్రజలు సంజయ్ వైఖరిని గమనిస్తున్నారని.. కేంద్రపెద్దలు బండి సంజయ్ గో ఎ హెడ్ అంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో సంజయ్ సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నాడని.. సింగరేణిని ప్రైవేటీకరించక పోతే సింగరేణి బొగ్గు గనులను సింగరేణికి ఎందుకు కేటాయించడం లేదని అడిగారు. ప్రధానికి సీఎం లేఖ రాసినా  సింగరేణికి కేటాయించ లేదని గుర్తు చేశారు. బీజేపీ నేతలు ఎవరూ చెప్పిన మాట మీద నిలబడటం లేదన్నారు.. వేలాదిగా సింగరేణి కార్మికులు ధర్నా చేయబోతున్నారని స్పష్టం చేశారు. సింగరేణిని అదానీకి అప్పచెప్పే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీజేపీ నేతలను సింగరేణి ప్రాంతాల్లో తిరగనివ్వరని తెలిపారు. లీకేజ్ వ్యవహారాల వెనక కేంద్ర పెద్దల హస్తం ఉందని.. విద్యార్థులు జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఎవరిని వదలద్దని సుమన్ అన్నారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ బండి సంజయ్ అన్నారాయన. త్వరలో కేటీఆర్ మీద విచారణ జరుగుతుంది అని చెప్పాడు.. అయన ఏమైనా విచారణాధికారా? తెలంగాణ ప్రజలు అప్రమతంగా ఉండాలని ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు.   

బండి సంజయ్ పోలీసులను కూడా బెదిరిస్తున్నాడు ఎమ్మెల్సీ పల్లా  

పేపర్ లీకేజీ విద్యార్థుల మనసులను బాధించిందన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతంగా పరీక్షలు జరిగాయన్నారు. బండి సంజయ్ అడ్డంగా మాట్లాడుతున్నాడని.. నిన్న ఫోన్ పోయింది అని చెప్పి, ఈ రోజు నా ఫోన్ తో మీకు ఏం పని అంటున్నాడని విమర్శించారు. పోలీసులను కూడా బండి సంజయ్ బెదిరిస్తున్నాడని అన్నారు. లీకేజీకి సూత్రదారులు బీజేపీ నేతలనీ.. పిల్లలను సంస్కారంగా పెంచడంలో కూడా బండి విఫలం అయ్యారని ఎమ్మెల్సీ పల్లా   విమర్శించారు.

 

 

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget