అన్వేషించండి

KTR News: పిచ్చోడి చేతిలో రాయిలాగా తెలంగాణలో పరిపాలన- రాజముద్ర మార్పుపై కేటీఆర్ ఫైర్

Telangana State Emblem | తెలంగాణ రాష్ట్ర గేయంతో పాటు రాష్ట్ర చిహ్నం రాజముద్రను ప్రభుత్వం మార్చడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. రాష్ట్రంలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Telangana Government changes to State Emblem | హైదరాబాద్: తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర గేయంలో మార్పులకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టగా, తాజాగా రాష్ట్ర రాజముద్రపై సైతం మార్పులు చేపడుతుండటంతో మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉందంటూ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ రూపొందించిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా- జమునా తహజీబుకి ప్రతీకలుగా కాకతీయ తోరణం, చార్మినార్ ఉండటం.. రాచరిక పోకడనట అంటూ అసహనం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర గీతంలో మాత్రం రాజముద్రలో ఉన్న చార్మినార్ గురించి “గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్“ అని పాడుకోవాలి అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. “కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప” అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి ! అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాని, ఆయన మంత్రి వర్గంలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా ? అని సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

కేటీఆర్ మరో ట్వీట్‌ ఇలా.. 
ఇదేం రెండునాల్కల వైఖరి..! ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన అంటూనే  కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం.. చార్మినార్ చిహ్నంపై ఎందుకంత చిరాకు అని కేటీఆర్ ప్రశ్నించారు. అవి రాచరికపు గుర్తులు కాదు.. వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు అని, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు అని కేటీఆర్ పేర్కొన్నారు. 

కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప 
జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ? కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే ఈ చార్మినార్ చిహ్నం. అధికారిక గీతంలో కీర్తించి.. అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..? రెండు నాల్కల ధోరణి ఏంటని ప్రశ్నించారు. చార్మినార్ అంటే ఒక కట్టడం కాదు.. విశ్వనగరం హైదరాబాద్ కు ఐకాన్ అన్నారు. కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదు.. సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం కానీ.. వాటిని రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే అని, 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే అని కేటీఆర్ రాసుకొచ్చారు.

కర్ణాటకలో కూడా మార్చుతారా? 
కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులు ఉంటే.. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొలగిస్తుందా చెప్పండి. భారత జాతీయ చిహ్నంలో అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన 3 సింహాలు ఉన్నాయి.. జాతీయ పతాకంలో ధర్మచక్రం ఉందని, వాటిని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ? అసెంబ్లీని కూల్చేస్తారా ? నేడు తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు.. రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా అని ఎక్స్ లో కేటీఆర్ ట్వీట్ చేశారు.

గత పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంపై యావత్ రాష్ట్ర ప్రజల ఆమోదం ఉంది. సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకం సైతం ఉందన్నారు. కానీ నేడు రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో తెలంగాణ అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఓరుగల్లు సాక్షిగా... మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరించి, తెలంగాణ ప్రజల్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget