అన్వేషించండి

TRS MPs : పార్లమెంట్ శీతాకాల సమావేశాల బహిష్కరణ.. టీఆర్ఎస్ అధికారిక ప్రకటన !

పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లుగా టీఆర్ఎస్ అధికారిక ప్రకటన చేసింది. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం తీరుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎంపీలు తెలిపారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారికంగా ప్రకటించింది. మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన తర్వాత యథావిధిగా ఎంపీలు సమావేశాలకు హాజరయ్యారు. అయితే ధాన్యం సేకరణ అంశంపై తెలంగామ రైతులను అన్యాయం చేయవద్దని ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో నిరసన వ్యక్తం చేశారు. తర్వాత వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించి బయటకు వచ్చారు. ఈ రోజు నల్ల చొక్కాలతో టీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. వాకౌట్ చేసిన తర్వాత పార్లమెంట్ భవనం బయట మీడియాకు తమ నిర్ణయం వెల్లడించారు. 

Also Read : పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించనున్న టీఆర్ఎస్ ! కారణం అదేనా?

తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని.  వారి వైఖరికి నిరసనగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బహిష్కరిస్తున్నట్లుగా నిర్ణయం ప్రకటించారు. కాసేపు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఎంపీలు వెళ్లిపోయారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఉభయసభల్లో ఎంపీలు ధాన్యం సేకరణ అంశంపై నినాదాలు చేస్తూనే ఉన్నారు. పలుమార్లు సభకు ఆటంకం కలగించారు. పీయూష్ గోయల్ ఈ అంశంపై సమాధానం ఇచ్చినప్పటికీ.. రబీలో ఎంత ధాన్యం సేకరిస్తారో స్పష్టంగా చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. 

Also Read : ఒక్క ఎకరా కబ్జా అని తేలినా ముక్కు నేలకు రాస్తా.. చదువుకున్న.. ఆ చదువులేని కలెక్టర్‌పై కేసు పెడతా: ఈటల

కేంద్రం ఏ విషయం తేల్చి చెప్పకపోవడంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఎంపీలందరూ కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనే  సోమ, మంగళవారాల్లో కేంద్రం నుంచి క్లారిటీ రాకపోతే సమావేశాలను బహిష్కరించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు తమ వ్యూహం ప్రకారం...బయటకు వచ్చేశారు. తదుపరి పోరాట కార్యాచరణను సీఎం కేసీఆర్‌తో సమావేశమైన ఖరారు చేసుకుంటామని ఎంపీలు తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు.

Also Read: Journalist: కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల సాయం.. డిసెంబర్ 15న పంపిణీ

ఎంపీలంతా ఇప్పుడు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆరు చోట్ల జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తమ ఓటర్లను ఇప్పటికే క్యాంప్‌నకు తరలించింది. వివిధ కారణాల వల్ల అసంతృప్తి గా ఉన్న ఓటర్లను ఎంపీలు బుజ్జగించి క్రాస్ ఓటింగ్ జరగకుండా చూసే అవకాశం ఉంది. 

Also Read: Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget