![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Raghunandan Rao: ఎమ్మెల్యే రఘనందన్ అసంతృప్త స్వరం! ఆ వంద కోట్లు ఎక్కడివి? బండి సంజయ్పై సంచలన ఆరోపణలు
తెలంగాణ బీజేపీలో అగ్ని పర్వతం బద్దలైనట్లుగా ఒక్కసారిగా అంతర్గత కుమ్ములాటలను తెరపైకి తెచ్చాయి. త్వరలో బీజేపీ అద్యక్షుడు మారిపోతున్నాడంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనన్నారు.
![Raghunandan Rao: ఎమ్మెల్యే రఘనందన్ అసంతృప్త స్వరం! ఆ వంద కోట్లు ఎక్కడివి? బండి సంజయ్పై సంచలన ఆరోపణలు BJP MLA Raghunandan sensational allegations against Bandi Sanjay asking for party president post Raghunandan Rao: ఎమ్మెల్యే రఘనందన్ అసంతృప్త స్వరం! ఆ వంద కోట్లు ఎక్కడివి? బండి సంజయ్పై సంచలన ఆరోపణలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/03/3433f2661d685ed6bb96a6c82013bf341688384437367234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణ బీజేపీలో అధ్యక్షుడి మార్పు వ్యవహారంతో అగ్గిరాజుకుంటోంది. తాను పదేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతుంటే తనను పట్టించుకోవడం లేదంటూ స్వరం పెంచారు బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. అంతేకాదు ఏకంగా ప్రస్తుత తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో జరిగిన ఇష్టాగోష్ఠిలో రఘునందన్ చేసిన సంచలన ఆరోపణలు తెలంగాణ బీజేపీలో అగ్ని పర్వతం బద్దలైనట్లుగా ఒక్కసారిగా అంతర్గత కుమ్ములాటలను తెరపైకి తెచ్చాయి. త్వరలో బీజేపీ అద్యక్షుడు మారిపోతున్నాడంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనన్నారు. వంద కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో బీజేపీ గెలవలేదని, అదే వందకోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాడినని అన్నారు.
ఎన్నికల్లో పుస్తెల తాడు అమ్మి గెలిచిన బండి సంజయ్ కు ఓ పేపర్ యాడ్ ఇచ్చేందుకు వంద కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయంటూ ప్రశ్నించారు. సొంత పార్టీలో అధ్యక్షుడే టార్గెట్ గా రఘనందన్ అసమ్మతి గొంతెత్తారు. దుబ్బాక నుండి తాను గెలిచాను కాబట్టే పార్టీలోకి ఈటల రాజేందర్ వచ్చారని అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నేను పనికిరానా.. అంటూ ఆవేదన వెళ్లగక్కారు.
ఇన్నాళ్లు పార్టీ కోసం నిరంతరం పడ్డ కష్టాన్ని ఎందుకు గుర్తించడం లేదంటూ ప్రశ్నించారు. తన కులమే తనకు శాపంగా మారిందని, తాను వెలమ కులం కాబట్టే తనకు అద్యక్ష పదవి దక్కడంలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో అడుగు ముందుకేసి రాబోయే ఎన్నికల్లో ఈటల బొమ్మ, తన బొమ్మ లేకుండా తెలంగాణలో బీజేపీ గెలవడం కష్టమని అన్నారు.
ఆ మూడింటిలో ఏదో పదవి కోరుతున్న రఘునందన్
తనకు అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదా జాతీయ అధికార ప్రతినిధి పదవి ఇవ్వాల్సిందేని ఎమ్మెల్యే రఘనందన్ రావు డిమాండ్ చేశారు. దుబ్బాక నుండి మళ్లీ గెలుస్తానని అన్నారు. ఏ పార్టీ నుండి విలేకరులు ప్రశ్నించగా.. దానికి క్లారిటీ ఇవ్వలేదు.
పదేళ్ల కాలంలో పార్టీలో తాను కష్టపడినట్లు ఎవరూ కష్టపడలేదని, సేవకు తగిన ప్రతిఫలం దక్కకపోతే నడ్డాకు ఫిర్యాదు చేస్తానని రఘనందన్ అన్నారు. ఢిల్లీలో అధిష్టానం అపాయింట్మెట్ కోసం ఎదురుచూస్తున్నానని, కలిసే అవకాశం ఇస్తే పార్టీలో జరుతున్న అనేక అంశాలను అధిష్ఠానం ముందు ఉంచుతానని అన్నారు. తాను కష్టపడ్డాను కాబట్టే చేసిన పనికి కూలీ అడుగుతున్నానని అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)