Bandi Sanjay: కేంద్ర బడ్దెట్లో తెలంగాణకు లక్ష కోట్లు - లెక్కలు వివరించిన బండి సంజయ్
Telangana: వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి తెలంగాణకు లక్ష కోట్లు వస్తాయని బండి సంజయ్ తెలిపారు. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.

One lakh crores: ఈసారి కేంద్ర బడ్జెట్ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించామని బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్ లోని మెర్క్యురీ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ లెక్కలు వివరించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని.. కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని కబోధులు కాంగ్రెస్ నేతలు అని మండిపడ్డారు. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని.. విమర్శించారు. తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల వారీగా కేంద్రం ఏం చేసిందో, రాష్ట్రం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధమా అని కాంగ్రెస్కు బండి సంజయ్ సవాల్ చేశారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో? ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు మేం సిద్దమన్నారు. ప్రధాని హోదాకు గౌరవం ఇవ్వకుండా అవాకులు పేలడం సరికాదనన్నారు.
తెలంగాణకు కేంద్ర బడ్దెట్ లో కేటాయిచిన నిధులు
ట్యాక్స్ డివల్యూషన్ రూపంలో 29 వేల 899 కోట్ల రూపాయలు. గత ఏడాదితో పోలిస్తే 10 శాతం అధిక నిధులు
గ్రాంట్ల రూపంలో 21 వేల 75 కోట్లు
రైల్వేల అభివృద్ధికి 5 వేల 336 కోట్లు
ఇన్ఫ్రాస్ట్రక్చర్, అభివృద్ధి కోసం ఈ ఏడాది బడ్జెట్ లో రూ. 2 వేల 500 కోట్లు
రోడ్లు, రైళ్లు, విమానయాన రంగాల అభివ్రుద్ది కోసం రూ. 28 వేల 302 కోట్లు
విద్యుత్, ఇంధన, నీటిపారుదల రంగాల అభివ్రుద్ది కోసం రూ. 10 వేల 285 కోట్లు
గ్రామాల, పట్టణాల అభివృద్ది కోసం ఈ ఏడాది మొత్తం 6 వేల 320 కోట్లు ఖర్చు చేయబోతున్నం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ఇండ్ల నిర్మాణం కోసం రూ. 2 వేల 120 కోట్లు
వ్యవసాయం, సహకార, పశుసంవర్థక శాఖల ద్వారా రైతులకు రూ. 5 వేల 920 కోట్లు
తెలంగాణలోని ఆరోగ్యం, పారిశుధ్య రంగాల కోసం రూ. 5వేల 790 కోట్లు
విద్యా, క్రీడా రంగాల అభివ్రుద్ధి కోసం రూ. 4 వేల 930 కోట్లు ఖర్చు
MSME పథకాలు, రుణ సబ్సిడీల కోసం రూ. 2 వేల 150 కోట్లు
స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ కోసం 880 కోట్లు
రాష్ట్రంలోని మహిళా, శిశు సంక్షేమ రంగాల అభివ్రుద్ది కోసం 3 వేల 560 కోట్లు
హోం, జాతీయ విపత్తు నిర్వహణ, రక్షణ కార్యక్రమాల అమలుకు రూ. 3 వేల 290 కోట్లు
ఒక్కో రైతుకు 5 లక్షల రూపాయల వరకు క్రెడిట్ కార్డులు
తెలంగాణసహా దేశంలోని యువతకు ఉపాధిని పెంచేందుకు MSME క్రెడిట్ బూస్ట్ కింద 1 లక్షా 50 వేల కోట్లు ఖర్చు
చిన్న వ్యాపారులకు 5 లక్షల రూపాయల వరకు కస్టమ్ క్రెడిట్ కార్డులు
స్టార్టప్ లను ప్రోత్సహించడానికి ఈసారి ఏకంగా 10 వేల కోట్ల రూపాయలతో ఫండ్
తొలిసారిగా వ్యాపారాన్ని, పరిశ్రమలను ప్రారంభించబోయే 5 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల చొప్పున టర్మ్ రుణాలు
బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి
ఏపీతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్ అన్నారు. ఎస్సెల్బీసీ ప్రాజెక్టు కట్టకుండా జాప్యం చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ చీకటి మిత్రులు.. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ రేస్ కేసులేమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ఢిల్లీకి పోయి కాంప్రమైజ్ అయిన మాట నిజం కాదా? మాపై కేసులు పెట్టొద్దు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని అడ్డుకుందామని కేసీఆర్ ప్రతిపాదించారన్నారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేందుకే అభ్యర్థులను నిలబెట్టకుండా కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.
హత్యపై విచారణ చేయించాలి !
భూపాలపల్లి రాజలింగమూర్తి హత్యపై విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.ఒక వ్యక్తిని ప్రాణం తీయడమంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు హతుడి భార్య చేస్తున్న ఆరోపణలపై లోతైన విచారణ జరపాలని.. ఎంక్వైరీ కాకముందే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదన్నారు.





















