Telangana Formation Day Live Updates: మాచర్ల సెబ్ కార్యాలయంపై మహిళలు దాడి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడులోని మరికొన్ని భాగాలు.. మొత్తం ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో బెంగాల్, తూర్పు బంగాళాకాతంలోని చాలా ప్రాంతాలు, పశ్చిమ మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు మీదుగా ఈ రుతుపవనాలు విస్తరించాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
ఈ ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో శీతల గాలులు వీయనున్నాయి. ఈ గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కూడా గాలులు వీయనున్నట్లుగా వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ గాలుల వేగం కూడా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణలో వాతావరణం ఇలా..
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వచ్చే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగం ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుందని, నగరంలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంటుందని చెప్పారు. కనిష్ఠ గరిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 38 డిగ్రీలుగా ఉంటుందని చెప్పారు. గాలులు గంటకు 10 నుంచి 20 కిలో మీటర్ల వేగంతో ఉంటుందని ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు తగ్గింది. గ్రాముకు నేడు రూ.25 తగ్గింది ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణం తర్వాత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.500 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్లో రూ.47,500 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,820 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో నేడు రూ.67,000 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,000 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,500 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,820గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,000 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర (Todays Gold Rate) ఇలా..
అయితే, ఇతర నగరాల్లోనూ బంగారం ధర నేడు కాస్త తగ్గింది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820 గా ఉంది.
మాచర్ల సెబ్ కార్యాలయంపై మహిళలు దాడి
పల్నాడు జిల్లా మాచర్ల సెబ్ కార్యాలయంపై మహిళలు దాడి చేశారు. సారాయి కేసులో ఉప్పుతోల రాజు అనే వ్యక్తిని సెబ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజును అన్యాయంగా అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. సెబ్ కార్యాలంయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. రాజు భార్య జ్యోతి చంటి బిడ్డతో స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
దిల్లీలో సీఎం జగన్, కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ
ఏపీ సీఎం జగన్ దిల్లీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే దిల్లీ చేరుకున్న సీఎం జగన్, కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ అవ్వనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు.





















