అన్వేషించండి

Breaking News Live Telugu Updates: ఐదుగురు హైస్కూల్ విద్యార్థులకు కరెంట్ షాక్, ఒకరు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: ఐదుగురు హైస్కూల్ విద్యార్థులకు కరెంట్ షాక్, ఒకరు మృతి

Background

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం అక్టోబరు 29 నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్యన ఏర్పడుతుందని, దీని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్రపై ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. దాని ప్రభావంతో ఈ నెలాఖరులో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అదే సమయంలో 29 నుంచి ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వెదర్ బులెటిన్ తెలిపింది. సాధారణంగా, నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 17న దేశంలోని వాయువ్య ప్రాంతాల నుండి ఉపసంహరించుకోవడం ప్రారంభమవుతాయి. అక్టోబర్ 15 నాటికి దేశం నుండి పూర్తిగా తొలగిపోతాయి.

 “పై పరిస్థితులలో, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్‌లో అక్టోబర్ 29 మరియు 30 తేదీలలో మరియు కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాంలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 30న రాయలసీమ, కేరళలలో, అక్టోబర్ 30న తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలు మరియు ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో కోస్తాంధ్రలో 338.1 మిల్లీమీటర్లు, రాయలసీమలో 223.3 మిల్లీ మీటర్ల సాధారణ సరాసరి వర్షపాతం నమోదవుతుంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలోనే బంగాళాఖాతంలో తుపానులు ఎక్కువగా ఏర్పడతాయని అంచనా వేశారు. వాటిలో అధికంగా దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడులపైనే ప్రభావం ఉండనుంది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజను అక్టోబర్‌ - డిసెంబర్‌ల మధ్యలో కనీసం మూడు తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ ఈ ఏడాది అంతకు మించి పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.


పెరుగుతున్న చలి
ఏపీలోని పలు ప్రాంతాల్లో చలి వాతావరణం నెలకొంది. ఇక అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 15 డిగ్రీలకు పడిపోయాయి. ఇటు తెలంగాణలోనూ చలి తీవ్రత​ పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులు, మేఘాలు లేకపోవడం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ అధికారులు తెలిపారు. వాతావరణంలో తేమ కూడా తక్కువగా ఉంటుంది. తూర్పు కోస్తా నుంచి వీస్తున్న గాలుల తీవ్రత రెండు మూడు రోజుల్లో పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. కాబట్టి, మూడు నాలుగు రోజుల్లో, ఉష్ణోగ్రతలో వ్యత్యాసం కనిపిస్తుందని తెలిపారు.

తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజుల నుంచి వర్షాలు అసలు లేవు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ చలి తీవ్రత సైతం అధికం అవుతోంది. హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 31 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. వాయువ్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వచ్చే 3 రోజులు తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

16:04 PM (IST)  •  28 Oct 2022

ఐదుగురు హైస్కూల్ విద్యార్థులకు కరెంట్ షాక్, ఒకరు మృతి

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికుర్రు హై స్కూల్ కి చెందిన ఐదుగురు విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిని 108లో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. హై స్కూల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న పంచాయితీ భవన నిర్మాణం కోసం ఐరన్ పనులు చేయడం కోసం విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేసుకున్నారు. దీనిని తొలగించకపోవడంతో విద్యార్థులకు షాక్ కు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండుగా ఐదుగురు విద్యార్థుల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

12:28 PM (IST)  •  28 Oct 2022

TTD News: నవంబర్ 1వ తేదీ నుండి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ

నవంబర్ 1వ తేదీ నుండి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభం చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుపతిలోని అలిపిరి లింక్ బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం నిర్మించిన షెడ్ ను వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి  మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగులు అలిపిరి బస్టాండ్ ప్రాంతంలో తమ ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసి వెళుతున్నారని చెప్పారు. ఇలాంటి వాహనాలు కొన్ని చోరీ, డ్యామేజ్ కావడం జరుగుతోందని ఆయన చెప్పారు. ఉద్యోగుల వాహనాలకు భద్రత కల్పించేందుకు రూ.54 లక్షలతో ప్రత్యేకంగా పార్కింగ్ షెడ్ నిర్మించామని తెలిపారు.

తిరుమల పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొండ మీద విధులు నిర్వహించే  కొందరు ఉద్యోగులకు దాతల సహకారంతో విద్యుత్ ద్విచక్ర వాహనాలు అందించనున్నామని చెప్పారు. మిగిలిన వారు కూడా ఆసక్తి చూపితే బ్యాంకు రుణం ఇప్పించి వారికి విద్యుత్ వాహనాలను అందించే ఏర్పాటు చేస్తామని అన్నారు. తిరుపతిలో ఉచిత దర్శనం స్లాటెడ్ టోకెన్ల జారీ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. డిసెంబర్  1వ తేదీ నుండి వీఐపీ బ్రేక్ దర్శనం సమయం మార్పుపై అధ్యయనం చేసి త్వరలోనే అమలు చేస్తామని సుబ్బారెడ్డి వివరించారు. ముందుగా అనుకున్న విధంగా 10 గంటల నుండి 12 గంటలకు అనుకున్నామని,‌ అదే సమయంలో కళ్యాణోత్సవం భక్తులు ఉంటారని, అందుకని ఉదయం 8 గంటలకు 8:30 మధ్య బ్రేక్ దర్శనం ప్రయోగాత్మకంగా ప్రారంభించి పరిశీలిస్తామన్నారు. అంతే కాకుండా తిరుమలలో‌ పర్యావరణ పరిరక్షణ రక్షించేందుకు తిరుమలలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ వాహనాలు అందించడం జరిగిందని, వంద ద్విచక్ర వాహనాలను దాతలు అందించడం జరిగిందని, త్వరలో ఉద్యోగులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు అందజేస్తామని తెలియజేశారు.

11:31 AM (IST)  •  28 Oct 2022

Rega Kantharao: ‘ఇవాళ పెద్దసార్ ప్రెస్ మీట్’ అంటూ ఎమ్మెల్యే ఫేస్ బుక్ పోస్ట్

ప్రలోభాలకు గురైనట్లుగా చెబుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరైన రేగా కాంతారావు కీలక ఫేస్ బుక్ పోస్టు చేశారు. ఇవాళ పెద్ద సార్ ప్రెస్ మీట్ అంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. 

11:24 AM (IST)  •  28 Oct 2022

TS High Court: నేడు హై కోర్టులో బీజేపీ పిటిషన్ పై విచారణ

  • నేడు హై కోర్టులో బీజేపీ పిటిషన్ పై విచారణ
  • మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
  • హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన గుజ్జల ప్రేమెందర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
  • బీజేపీ పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తీసే విధంగా గా వ్యవహరిస్తున్నారని పిటిషన్
  • మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్ కుట్ర చేసిందని పేర్కొన్న పిటిషనర్.
  • సిట్టింగ్ జడ్జితో ఈ కేస్ ని సమగ్రంగా విచారణ జరిపించాలని పిటిషన్
  • పిటీషన్లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్
  • తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ డీజీపీ,సైబరాబాద్ పోలీస్ కమీషనర్, రాజేంద్ర నగర్ ఏసీపీ, మొయినాబాద్ SHO, కేంద్ర హోం ఆఫైర్స్, సీబీఐ, ఎమ్మెల్యే పిలోట్ రోహిత్ రెడ్డి నీ ప్రతివడులుగా చేర్చిన పిటిషనర్
  • సీబీఐతో, సిట్టింగ్ జడ్జ్ తో సమగ్ర విచారణ జరిపించాలని పిటిషన్
11:21 AM (IST)  •  28 Oct 2022

Panjagutta: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకపురి కాలనీలో‌ భారీగా నగదు పట్టివేత

  • పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకపురి కాలనీలో‌ భారీగా నగదు పట్టివేత
  • పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు, కిషన్ రావ్, వేముల‌ వంశీ
  • రూ. 70 లక్షల నగదు‌ స్వాధీనం
  • నగదు సమకూర్చిన మరొక నిందితుడు మధు పరారీ
  • నిందితుడు కిషన్ రావ్ స్వస్థలం హుజురాబాద్
  • నిజాం కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు
  • నిందితుడు కిషన్ రావ్ ది ఏబీవీపీ నేపథ్యం, గతంలో అబిడ్స్ జోన్ ఇన్చార్జి అని తెలిపిన పోలీసులు
11:19 AM (IST)  •  28 Oct 2022

Bandi Sanjay: సవాల్‌తో యాదగిరి గుట్టకు బండి సంజయ్

ఫాంహౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారనే ఆరోపణల విషయంలో రాజకీయ దుమారం యాదగిరిగుట్టను చేరింది. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడంలో బీజేపీ తప్పు ఏమీ లేదని అవసరమైతే లక్ష్మీ నరసింహ స్వామిపై ప్రమాణం చేస్తానని బండి సంజయ్ అక్కడికి బయలుదేరారు. ఈ విషయంలో టీఆర్ఎస్ తప్పు ఏమీ లేకపోతే సీఎం కేసీఆర్ కూడా ఇలాగే ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. యాదాద్రిలో తాను ఒక గంట సేపు వేచి ఉంటానని చెప్పారు. దీంతో శుక్రవారం ఉదయం బండి సంజయ్ యాదాద్రికి బయలు దేరారు. మరోవైపు, బండి సంజయ్ గో బ్యాక్ అంటూ బ్యానర్లతో టీఆర్ఎస్ నేతలు యాదాద్రిలో నిరసనలకు దిగారు. పోలీసులు కూడా బండి సంజయ్ యాదాద్రి పర్యటనకు అనుమతి లేదని చెప్పారు. దీంతో యాదాద్రిలో హైటెన్షన్ నెలకొని ఉంది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
T Rajaiah vs Kadiyam: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Embed widget