అన్వేషించండి

Breaking News Live Telugu Updates: బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదం, ఐదుగురికి గాయాలు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదం, ఐదుగురికి గాయాలు 

Background

బంగాళాఖాతంలో సిత్రాంగ్ తుఫాను కారణంగా ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత​పెరుగుతోంది. వారం రోజుల వరకు తక్కువ వర్షాలు కురవనున్నాయి. అయితే బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. అక్టోబర్ చివరి నుంచి ఈశాన్య రుతుపవనాలు బలంగా మారి వర్షాలను అందిస్తాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ముప్పు ఏపీకి తప్పిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటీవల ఏర్పడిన అల్పపీడనం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ఆపై బంగాళాఖాతంలో వాయుగుండం సిత్రాంగ్ తుపానుగా మారిందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. 

సిత్రాంగ్ తుపాను అక్టోబర్ 24 ఒడిశా తీరాన్ని చేరుకుంటుంది. ఆపై అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య సిత్రాంగ్ తుపాను తీరం దాటుతుందని అంచనా వేశారు.
సిత్రాంగ్ తుపానుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు ఒడిశా, విదర్భా మీదుగా ఉపసంహరించుకుంటున్నాయి. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తున్నాయి. అక్టోబర్ చివరి నాటికి ఏపీలో పూర్తి స్థాయిలో వ్యాపించే అవకాశం ఉంది. ఏపీలో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలుండగా, తెలంగాణలో పలు జిల్లాల్లో చినుకు కూడా లేదు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి.

తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
సిత్రాంగ్ తుపాను ప్రభావంతో వర్షాలు అంతగా కురవకపోయినా చలి తీవ్రత మాత్రం రాష్ట్రంలో పెరుగుతోంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ చలి తీవ్రత సైతం అధికం అవుతోంది. హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 29 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. ఉత్తర దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఈశాన్య రుతుపవనాలు ఉత్తర కోస్తాంధ్రలో విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో నవంబర్ మొదటి వారం నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. సిత్రాంగ్ తుపాను ముప్పు ఏపీపై లేనప్పటికీ, చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పలుచోట్ల తేలికపాటి జల్లుల పడతాయి. సాధారణ వర్షాలున్నాయని, ఎలాంటి వార్నింగ్ జారీ చేయలేదు అమరావతి వాతావరణ కేంద్రం. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్ష సూచన ఉంది. తీరంలో 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, వీటి వేగం 55 కిలోమీటర్లు దాటుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని హెచ్చరించారు. 

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. అయితే దీని ప్రభావం ఏపీపై అంతగా లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో రెండు రోజులు ఒక్కడక్కడా వర్షాలున్నాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. రాయలసీమలోనూ వర్షాలు చాలా తక్కువగా కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఇక్కడ సాధారణ వర్షపాతం నమోదు కానుంది. సిత్రాంగ్ తుపాను ప్రభావం చాలా తక్కువగా ఉంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.

21:09 PM (IST)  •  24 Oct 2022

బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదం, ఐదుగురికి గాయాలు 

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పులగూర్తలో ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.  క్షతగాత్రులను మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ఆదేశించారు. మెరుగైన చికిత్స అందజేయాలని వైద్యులను ఆదేశించారు.

14:26 PM (IST)  •  24 Oct 2022

Kadiam News: కడియం పోలీస్  క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం, గంజాయి దగ్దం

తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ క్వార్టర్ లో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి, బెల్లం, ఖైని, సారా కాసే పాత్రలు సహా పలు వస్తువులు తగలబడిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు . కడియం పోలీస్ స్టేషన్ వెనుక వైపుగల ఈ భవనం ఖాళీగా ఉంటోంది. దీంతో ఇటీవలే ఈ వస్తువులను అందులోకి మార్చి నట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు ఉదయం ఈ వస్తువులు ఉన్న గదిలో నుంచి మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి మంటలను అదుపు చేసారు. ఇదిలా ఉండగా ఆ బిల్డింగ్లో కర్రెంట్ కూడా లేదని చెబుతున్నారు. దీంతో ప్రమాద కారణాలపై భిన్న కధనాలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా దక్షిణ మండలం డి ఎస్పీ ఎమ్ శ్రీ లతను సంప్రదించగా ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.

14:20 PM (IST)  •  24 Oct 2022

Bandi Sanjay: ట్విట్టర్ టిల్లు.. దీనికేం జవాబు చెబుతావ్? - బండి సంజయ్

  • ట్విట్టర్ టిల్లు.. దీనికేం జవాబు చెబుతావ్? - బండి సంజయ్
  • చేనేతపై 5 శాతం జీఎస్టీ పెంచాలన్నది నువ్వే కదా
  • కేటీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ను ప్రదర్శించిన బండి సంజయ్
  • చేనేత కార్మికులకు బతుకమ్మ చీరెలను నేసే అవకాశం ఎందుకు ఇవ్వలేదు?
  • చేనేత వస్త్రాలపై అద్దె రంగులపై 50 శాతం సబ్సిడీ మాట ఎటు పోయింది?
  • ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్దాలు ప్రచారం చేస్తారా?
  • దుబ్బాక, హుజూరాబాద్ లో చెంప చెళ్లుమన్పించినా మారని టీఆర్ఎస్
  • పొరపాటున టీఆర్ఎస్ కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కే ప్రమాదం
  • బండి సంజయ్ వ్యాఖ్యలు
14:15 PM (IST)  •  24 Oct 2022

ఈనెల 27 న గాజుల అలంకరణలో దుర్గమ్మ

ఈనెల 27 న బెజవాడ దుర్గమ్మను గాజులతో అలంకరించనున్నారు. ఇందులో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి గాజులను బహూకరిస్తున్నారు. దీంతో ఇప్పటికే గాజుల అలంకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

12:36 PM (IST)  •  24 Oct 2022

Tirumala News: మంగళవారం సూర్యగ్రహణం.. శ్రీవారి ఆలయం మూసివేత

  • మంగళవారం సూర్యగ్రహణం శ్రీవారి ఆలయం మూసివేత
  • గ్రహానికి 9 గంటలు మునుపే ఆలయాన్ని మూసి వేయడం ఆనవాయితీ 
  • రేపు ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న టీటీడీ అధికారులు 
  • గ్రహణ విడుపు అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించనున్న అర్చకులు 
  • గ్రహణం కారణంగా స్వామి వారి ఆలయాన్ని మూసివేయడంతో తిరుమలకి వచ్చే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరిన టీటీడీ
Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.