Breaking News Live Telugu Updates: భారత్ లోకి BF 7 కరోనా వేరియంట్ ఎంట్రీ, నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE

Background
భారత్ లోకి BF 7 కరోనా వేరియంట్ ఎంట్రీ, ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ
చైనాను వణికిస్తున్న ప్రమాదకర కరోనా వేరియంట్ బీఎఫ్ 7 భారత్ లోకి ప్రవేశించింది. భారత్ లో బీఎఫ్ 7 కరోనా కేసులు గుర్తించినట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో మొత్తం 3 కేసు నమోదయ్యాయని, గుజరాత్ లో ఇద్దరికి, ఒడిశాలో ఓ వ్యక్తిలో బీఎఫ్ 7 వేరియంట్ ను గుర్తించారు.
ఏసుక్రీస్తు దయవల్లే కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది: తెలంగాణ డీహెచ్ వ్యాఖ్యలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - వివాదాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొన్న సీఎం కెసిఆర్ కాళ్ళు 100 సార్లు మొక్కుత అన్న డీహెచ్.. ఇప్పుడు ఏసు క్రీస్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసుక్రీస్తు దయవల్లే కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని, భారత దేశాభివృద్ధికి క్రైస్తవ మతమే కారణం అన్నారు. జీఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్వహించిన సెమీక్రిస్మస్ వేడుకల్లో హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందన్నారు.
బీజేపీ మాత్రమే కేసీఆర్ను గద్దె దించుతుంది... మాజీ మంత్రి ఈటెల
బీజేపీ మాత్రమే కెసిఆర్ నీ గద్దె దించుతుంది... ఈటెల కామెంట్స్
హనుమకొండ జిల్లా బీజేపీపార్టీ పదాదికారుల సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కెసిఆర్ వైఫల్యాలు అనేకం ఉన్నాయి. వాటిని మనం ప్రజలకు చెప్తే చాలు. మనల్ని ప్రజలు నమ్ముతున్నారు.
బీజేపీ మాత్రమే కెసిఆర్ ను ఒడించగలదు అని అనుకుంటున్నారు.
ప్రజా సమస్యల మీద కెసిఆర్ ఏనాడూ అల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు. కెసిఆర్ ది రాజరిక పాలన. ఆయన అనేక అస్త్రాలు మనకు ఇస్తున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి.
సమస్యలు పట్టించుకోకుండా అధికార మధం.. అహంకారంతో ప్రజలను ఇబ్బందిపెడుతున్నారు. వారు చేసే తప్పులే మనకు అస్త్రాలు. అవి కేసీఆర్ మనకు అందించారు.
రైతులకు రుణమాఫీ ఇవ్వని కేసీఆర్ రైతులకు నేనే చాంపియన్ని అని దేశమంతా చెప్పుకుని తిరుగుతున్నారు.
పెన్షన్లు రెండు నెలలు పెండింగ్ ఉన్నాయి. కరెంట్ బిల్లులు పెంచడం కాదు. బైమంత్ ఉన్న బిల్లులను నెల నెలా వసూలు చేస్తున్నారు.
కెసిఆర్ ప్రత్యక్షంగా పన్నులు వేయరు.. పరోక్షంగా వసూలు చేస్తారు.
గుజరాత్ లో ఆరు సార్లు అధికారం చెలాయించిన తరువాత ఏడవసారి బంపర్ మెజారిటీతో మోదీ గారిని గుజరాత్ ప్రజలు ఆశీర్వదించారు. బీజేపీకె అండగా నిలిచారు. దేశమంతా ప్రజల చూపు బీజేపీ వైపు ఉంది.
వంద కార్యక్రమాలు చేయడం కంటే ఒక్క కార్యక్రమం ప్రభావితం చేసేలా ఉండాలి.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితం: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి
నేను వైసీపీలోనే ఉన్నా.. వారేమీ నన్ను తీసేయలేదు: కడప నగరంలోని వైయస్సార్ ప్రెస్ క్లబ్ లో మాజీమంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి
రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ ఇంత అవినీతిపరుడని అనుకోలేదు
పరిపాలన మొదటిరోజు నుంచే అవినీతి మొదలుపెట్టారు
ఆ పార్టీలో నేను ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉంది
ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే
గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్నా
రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప మరో నేత కాపాడలేరు
పవన్ కల్యాణ్ నిజాయతీని ప్రశ్నించలేం
రాష్ట్రం కోసం వారిద్దరూ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నా
జనవరి 3 నుంచి వివేకా కేసులో మలుపులు తిరగనున్నాయి
వివేకా కేసులో ఎర్ర గంగిరెడ్డే కీలక వ్యక్తి అని సీబీఐ గుర్తించింది
జనవరి 3న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు ఉన్నాయి
సుప్రీం తీర్పు తర్వాత వివేకా కేసులో జిల్లాలో కీలక పరిణామాలు
చాలామంది మెడకు ఉచ్చు బిగిసే అవకాశం ఉంది
వివేకా కేసులో ఒంటరిగా పోరాడుతున్న సునీత ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు
Chandrababu: ఖమ్మం టీడీపీ సభకు బయలుదేరిన చంద్రబాబు
ఖమ్మం టీడీపీ సభకు వెళుతున్న చంద్రబాబుకు దారి పొడవునా తెలుగు తమ్ముళ్లు ఘనస్వాగతం పలుకుతున్నారు. రసూల్ పురలోని ఎన్ టి ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వెళుతున్న బాబుకు మెట్టుగూడలో చౌరస్తాలో సికింద్రాబాద్ పార్లమెంట్ టీడీపీ ఇన్ చార్జ్ వల్లారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు.. ఈ సందర్భంగా వల్లారపు మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వ వైభవం రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ‘‘తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ. ఒక రాష్ట్రానికి పరిమితమయ్యే పార్టీ కాదు. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ ఈ పార్టీ ఉంటుంది. తెలంగాణలో తెలుగు దేశం ప్రభంజనం సృష్టించబోతుంది. అందులో భాగంగా ఈ రోజు తొలి అడుగు పడుతుంద’’ని తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదని హేళన చేసిన టీఆరెస్ పార్టీనే నేడు చచ్చిపోయిందని అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

