Breaking News Live Telugu Updates: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియామకం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు అన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఆదివారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. యానాంలో విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పల్నాడు, పాడేరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడతాయని సైతం వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
రుతుపవనాల ప్రభావంతో నేడు సైతం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో గాలుల అసహజత ఉండటం వలన ఈ రోజు కూడా ఉదయం లేదా రాత్రివేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం జిల్లాల్లొ విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని సూచించారు. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల వర్షపు నీరు అక్కడే నిలిచిపోయి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయి. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరో 3 గంటల్లో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, వికారాబాద్, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు.
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియామకం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేశారు. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సతీష్చంద్ర శర్మను బదిలీ చేసింది. ఆయన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్కు పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆ మేరకు కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ సతీశ్చంద్ర శర్మ దిల్లీ హైకోర్టు సీజేగా బదిలీఅయ్యారు.
Jagityala DSP Pushed: జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ ను నెట్టివేసిన రైతు సంఘం నేత పన్నాల తిరుపతి రెడ్డి
జగిత్యాలలో రైతుసంఘం ధర్నాలో ఉద్రిక్తత
జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ ను నెట్టివేసిన రైతు సంఘం నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ మధ్య జరిగిన చెరకు రైతుల అరెస్ట్ కు నిరసనగా జగిత్యాల చౌరస్తాలో ధర్నా చేపట్టిన రైతు సంఘం నాయకులు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న డిఎస్పీ ప్రకాష్ వారితో మాట్లాడటానికి ప్రయత్నించగా దురుసుగా వ్యవహరించి తోసేసిన తిరుపతి రెడ్డి
దీంతో స్టేషన్ కు తరలించిన పోలీసులు. ఈ మధ్య కేటీఆర్ పర్యటన సందర్భంగా కాన్వాయ్ ని అడ్డుకునే యత్నం చేసిన పలువురు చెరకు రైతులను అరెస్ట్ చేసినందుకు నిరసనగా ధర్నా చేపట్టిన రైతు నాయకులు





















