అన్వేషించండి

Breaking News Live Telugu Updates: వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ బుధవారానికి వాయిదా

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ బుధవారానికి వాయిదా

Background

నిన్న దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి ఉన్న ద్రోణి/గాలిలోని అనిచ్చితి, ఈ రోజు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రం మట్టానికి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు  41 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 43 డిగ్రీల మధ్యన  కొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC మరియు చుట్టు ప్రక్కల జిల్లాలలో 40 డిగ్రీల  కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.  ఈరోజు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో)  వీచే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు (30 నుంచి 40 కిలో మీటర్ల వేగం) కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. వాయువ్య దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 50 శాతం నమోదైంది. 

ఏపీలో ఎండలు ఇలా
ఏపీలో ఎండలు విపరీతం అయ్యాయి. నేడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వడగాలులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వెదర్ బులెటిన్ లో తెలిపారు.

‘‘రాష్ట్రంలో ఎండలు మరింత విపరీతం కానున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో విశాఖకి తూర్పుగా అధిక పీడన ప్రాంతం కొనసాగుతోంది. దీని వలన పొడిగాలుల తీవ్రత పెరిగి రానున్న మూడు రోజుల వ్యవధిలో మధ్య ఆంధ్రా ప్రాంతం అయిన ఎన్టీఆర్ (విజయవాడ వైపు), గుంటూరు, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం పశ్చిమ భాగాలు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య​, కడప​, కర్నూలు, నంధ్యాల, చిత్తూరు జిల్లాల్లో వేడి 44-45 డిగ్రీల వరకు పలు భాగాల్లో నమోదవ్వనుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వేడి 40 వరకు ఉండనుంది. అలాగే కృష్ణా, కొనసీమ​, బాపట్ల​, కాకినాడ జిల్లాల్లో 36 నుంచి 39 డిగ్రీల మధ్యలోనే వేడి కొనసాగుతుంది. విశాఖ నగరంలో కూడా ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు ఉండనుంది. వేడి తీవ్రత మరో మూడు రోజుల వరకు కొనసాగనుంది.

ఢిల్లీలో విపరీతమైన ఎండలు

సోమవారం (ఏప్రిల్ 17) వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని చాలా రాష్ట్రాలు వేడిగాలుల ఉచ్చులో ఉంటాయని అంచనా. IMD ప్రకారం, రాబోయే 4 రోజులు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, దేశంలోని వాయువ్య ప్రాంతంలో రెండు రోజుల పాటు వేడి గాలులు కొనసాగుతాయి.

20:47 PM (IST)  •  18 Apr 2023

50 కిలోల బంగారం పక్కదారి పట్టిందని ప్రచారం, ఖండించిన టీటీడీ

ఉనికి కోసమే  వారి ఉబలాటం 
- బంగారు మలాం పనుల్లో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందని దుష్ప్రచారం టీటీడీ ఖండన.

    శ్రీగోవింద రాజ స్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందని హిందూ జన శక్తి  సంస్థకు చెందిన లలిత్ కుమార్, ఆదిపట్ల కళాపీఠం అధ్యక్ష్యురాలు కరాటే కల్యాణి సోమవారం ( 17-4-2023) న టీటీడీపై అవాస్తవ ఆరోపణలు చేశారు.  తమ ఉనికిని చాటుకోవడానికి వారు చేసిన నానా యాగీని తీవ్రంగా ఖండిస్తున్నాము.
       బంగారు తాపడం పనులు జరుగుతున్న పాత హుజూర్ ఆఫీసు ప్రాంగణంలో 24 గంటలూ సిసి కెమెరాల నిఘా ఉంటుంది. సంబంధిత సిబ్బంది లోనికి వెళ్ళాలన్నా. రిజిస్టర్ లో పేరు నమోదు చేసి, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసేసే వెళ్ళాలి. ఇది నిషిద్ధ ప్రాంతం. స్ట్రాంగ్ రూమ్, పనిజరిగే ప్రాంతం లో పూర్తి స్థాయిలో అధికారుల నిఘా, విజిలెన్స్ బందోబస్తు కూడా ఉంటుంది. ఇంతటి పటిష్టమైన ప్రాంతం నుండి 50 కిలోల బంగారం పక్కదారి పట్టించారని ఆరోపించడం వారి అజ్ఞానానికి, ప్రచార యావకు నిదర్శనం. 
    ఆలయ శిల్ప సంప్రదాయం ప్రకారం, జీయర్ స్వాములు,అర్చకుల సలహాలు తీసుకుంటూ స్థపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ శిల్పసంపదకు ఇబ్బంది కలిగించే ఆస్కారమే లేదు. ఈ విషయం తెలుసుకోకుండా సదరు వ్యక్తులు అవగాహనా రాహిత్యంతో ఆరోపణలు చేయడం మంచిది కాదు. 
   గోల్డ్ మలాం పనులు  చేసే కూలీలు విశ్రాంతి తీసుకునే ప్రదేశం( ఇది గోల్డ్ మలాం పనులు జరిగే ప్రాంతం కాదు ) లో బంగారు మలాం పనులు చేసే కాంట్రాక్టర్ జ్యోతికి వివాహ ఆహ్వాన పత్రిక అందజేయడానికి ఒక ముస్లిం వ్యక్తి వచ్చారు. సదరు వ్యక్తులు ఈ సమయంలో అతన్ని పట్టుకుని యాగీ చేశారు. గోల్డ్ మలాం పనులకు అతనికి ఏ మాత్రం సంబంధం లేదు. అతనికి ఎలాంటి సబ్ కాంట్రాక్టు ఇవ్వలేదు. పబ్లిసిటీ  పిచ్చితో ఇలాంటి వ్యక్తులు చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరడమైనది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేసిన సదరు వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

17:36 PM (IST)  •  18 Apr 2023

విజయనగరం జిల్లా రాజాంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజయనగరం జిల్లా రాజాంలోని GMRVF క్యాంపస్‌లో నాబార్డు మద్దతుతో కూడిన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని మంగళవారం సందర్శించారు.   రిఫ్రిజిరేషన్z ఎయిర్ కండిషనింగ్ కోర్సులో శిక్షణ పొందిన వారితో సంభాషించారు.  విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ,  జీవనోపాధి, ఉపాధిని కనుగొనడంలో దోహదపడుతుందని ఆయన సూచించారు.  పారిశ్రామికవేత్తగా ఎదగాలని, ఇతరులకు ఉపాధి కల్పించాలని సూచించారు. నాబార్డు డిడిఎం టి.నాగార్జున వ్యవసాయం, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలలో నాబార్డు అభివృద్ధి పనుల గురించి వివరించారు.

16:32 PM (IST)  •  18 Apr 2023

భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను 6 రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టైన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల కస్టడీకి కోర్టు అనుమతించింది. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ లకు ఆరు రోజుల కస్టడీకి అనుతించింది కోర్టు. రేపటి నుంచి 24వ తేదీ వరకు సీబీఐ కస్టడీకి ఇవ్వనున్నారు. 

15:48 PM (IST)  •  18 Apr 2023

వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ బుధవారానికి వాయిదా

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వాయిదా పడింది. బుధవారం ఉదయం 10.30కు హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకావాలని సీబీఐ సూచించింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. నేటి సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన సీబీఐ విచారణ రేపటికి వాయిదా వేశారు. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు విచారిస్తామన్న సీబీఐ అధికారులు.

14:03 PM (IST)  •  18 Apr 2023

Cricket Betting: హైదరాబాద్ ఐపీఎల్ బెట్టింగ్ ముఠాలు అరెస్టు

  • రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్ పల్లి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న రెండు ముటాలను అరెస్టు చేసిన పోలీసులు
  • RCB Vs CHENNAI SUPER KINGS క్రికెట్ మ్యాచ్ పై బెట్టింగ్లకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 46 లక్షలు స్వాధీనం
  • మరికొందరు పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశామన్న రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి 
12:28 PM (IST)  •  18 Apr 2023

TDP Leaders Arrest: ఉండవల్లి వద్ద టీడీపీ నేతల అరెస్టు

  • మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం, ఉండవల్లి కొండ వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకుల అరెస్ట్
  • అక్రమ తవ్వకాలను నిరసిస్తూ మండుటెండను సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపట్టిన టీడీపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఉదయం నుంచి కొండ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న టీడీపీ నాయలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • తవ్వకాలకు సంబంధించిన పర్మిషన్లను చూపించమన్నందుకు అరెస్ట్ 
  • బలవంతంగా టీడీపీ నాయకులను వ్యాన్‌లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
  • అరెస్ట్ చేసిన టీడీపీ నాయకులను రెండు వాహనాలలో స్టేషన్‌కు
  • మహిళలను సైతం బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించిన పోలీసులు
  • స్థానిక ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేసిన టీడీపీ నాయకులు
  • ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు
12:27 PM (IST)  •  18 Apr 2023

DAV Public School: డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటనలో కోర్టు తీర్పు వెల్లడి

బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో గతేడాది ఓ డ్రైవర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితుడిని దోషిగా గుర్తించిన కోర్టు, అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆరు నెలల దర్యాప్తు, కోర్టు విచారణ తర్వాత డ్రైవర్ రజనీ కుమార్‌కు ఈ శిక్ష పడింది. ఇతను ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన సంగతి తెలిసిందే.

10:43 AM (IST)  •  18 Apr 2023

నేడు రాత్రంతా అన్ని ఫ్లైఓవర్లు బంద్, ఆ రెండింటికి మాత్రమే మినహాయింపు

జగ్‌నే కీ రాత్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్లు మూసేస్తున్నట్లు ట్రాఫిక్‌ చీఫ్‌ సుధీర్‌ బాబు వెల్లడించారు. నేడు రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ప్రత్యామ్నాయాలు లేని గ్రీన్‌ల్యాండ్స్‌, లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్లు, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తామని ఆయన చెప్పారు. వీటితో పాటు పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ (నెక్లెస్‌ రోడ్‌)ను కూడా మూసేస్తున్నట్లు ప్రకటించారు. వాహన చోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని, ఏవైనా సహాయ సహకారాలు కావాలంటే 9010203626 నెంబరులో సంప్రదించాలని సుధీర్‌ బాబు వెల్లడించారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
Embed widget