అన్వేషించండి

Breaking News Live: రెండో వన్డేలో వెస్టిండీస్‌కు 238 పరుగుల లక్ష్యం నిర్దేశించిన భారత్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: రెండో వన్డేలో వెస్టిండీస్‌కు 238 పరుగుల లక్ష్యం నిర్దేశించిన భారత్

Background

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. కొన్ని రోజుల కిందటి వరకు ఏపీలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. తాజాగా తెలంగాణలో వర్షాల ప్రభావంతో చలి తీవ్రత అధికమైంది. రెండు వైపుల నుంచి వీచే గాలులతో ఉదయం వేళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏపీ, యానాంలలో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి చలిగాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, కోస్తాంధ్రలో మాత్రం చలి తగ్గడం లేదు.

ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీచే గాలులలో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం  ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అత్యల్పంగా నందిగామలో 16.3 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కళింగపట్నంలో 17.1 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 18.2 డిగ్రీలు, బాపట్లలో 18.3, అమరావతిలో 19.2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది. వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండవని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి ప్రభావం కాస్త తగ్గింది. ఆరోగ్యవరంలో 19 డిగ్రీలు, అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.1 డిగ్రీలు, నంద్యాలలో 19.6 డిగ్రీలు, కర్నూలులో 20 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళ కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.

బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు పెరిగింది. గ్రాముకు రూ.20 చొప్పున ఎగబాకింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.200 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,400 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,530 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.65,100గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,400 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,530గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,100గా ఉంది.

17:25 PM (IST)  •  09 Feb 2022

వెస్టిండీస్ ముందు 238 పరుగుల లక్ష్యం

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లో సూర్యకుమార్ యాదవ్ (64: 83 బంతుల్లో, ఐదు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

13:43 PM (IST)  •  09 Feb 2022

విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు

విశాఖపట్నంలో శారదాపీఠం వార్షికోత్సవాలకు ఏపీ సీఎం జగన్‌ హాజరయ్యారు. రాజశ్యామల యాగం కోసం సీఎంతో పండితులు సంకల్పం చేయించారు. అనంతరం అమ్మవారికి జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత శారదాపీఠంలోని విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాలను సీఎం సందర్శించారు. ఆ తర్వాత జగన్‌ చేతుల మీదుగా కలశ స్థాపన చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలు, పతకాలను సీఎం అందజేయనున్నారు.

13:29 PM (IST)  •  09 Feb 2022

శ్రీ శారదాపీఠం వార్షిక ఉత్సవాలకు హాజరైన సీఎం జగన్

విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేశారు. రాజశ్యామల యాగం, రుద్ర హోమం పూర్ణాహుతికి సీఎం హాజరయ్యారు.

13:16 PM (IST)  •  09 Feb 2022

తిరుపతికి చేరుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పర్యటనలో‌ భాగంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న ఆయన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుపతి పద్మావతి అతిథి గృహంకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేరుకోనున్నారు. కాసేపు విశ్రాంతి తరువాత యోగిమల్లవరం వద్ద నున్న రాహుల్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరు కానున్నారు. అటుతరువాత అక్కడి నుంచి నేరుగా తిరుమలకు పయనం కానున్నారు. అటు తరువాత తిరుమలలోని పద్మావతి అతిధి గృహంలో రాత్రి వెంకయ్య నాయుడు బస చేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనంతరం పద్మావతి అతిధి గృహంకు చేరుకుని అల్పాహారం స్వీకరించి కాసేపు విశ్రాంతి తరువాత మధ్యాహ్నం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు వెంకయ్య నాయుడు తిరిగి వెళ్ళనున్నారు.

12:51 PM (IST)  •  09 Feb 2022

నిర్మల్‌లో ప్రధాని దిష్టి బొమ్మ దహనం

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ  చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధాని వ్యాఖ్యలు యావత్ తెలంగాణా సమాజాన్ని కించ పరిచేలా ఉన్నాయని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజీపీ నాయకులు వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

12:27 PM (IST)  •  09 Feb 2022

విశాఖ: మంత్రి సిదిరి అప్పలరాజుకు శారదా పీఠం వద్ద అవమానం

విశాఖ: రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజుకు శారదా పీఠం వద్ద ఘోర పరాభవం ఎదురైంది. పీఠం లోపలికి వెళ్తుండగా సీఐ అడ్డుకున్నారు. కేవలం మంత్రి మాత్రమే లోపలకి వెళ్లాలని, ఆయన అనుచరుల్ని అనుమతించేది లేదని సీఐ చెప్పడంతో మంత్రి కంగుతిన్నారు. మంత్రి కోరుతుంటే దురుసుగా గెట్ వేసి.. వెళ్తే మంత్రి లోపలకి వెళ్లాలని, లేకుంటే లేదని సిఐ అన్నారు. తనకు క్షమాపణలు చెప్పాలని మంత్రి అప్పలరాజు, అనుచరులు డిమాండ్ చేశారు. సీఐ తగ్గకపోవడంతో మంత్రి అప్పలరాజు అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

11:58 AM (IST)  •  09 Feb 2022

వైజాగ్ చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. విశాఖలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొననున్నారు. విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం జగన్‌ శ్రీ శారదా పీఠం చేరుకోనున్నారు.

11:27 AM (IST)  •  09 Feb 2022

ఉద్యోగుల సమస్యలపై ఒక పరిష్కారానికి రావాలి: సీపీఎం

‘‘కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆడలేక మద్దెలు ఓడ అన్నట్లుగా ఉన్నాయి. ఒప్పందంపై అసంతృప్తిగా ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేక కమ్యూనిస్టులపై దాడికి దిగడం అన్యాయమ’’ని సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మాట తప్పను, మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి  సిపిఎస్‌పై మాట తప్పలేదా? కనీసం దాన్ని గురించి ప్రస్తావన కూడా చేయలేదన్నారు. కమ్యూనిస్టులపై దాడి చేయడం మానుకొని మిగిలి ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై చర్చించి ఒక పరిష్కారానికి రావాలని ఆయన సూచించారు.

10:26 AM (IST)  •  09 Feb 2022

కర్నూలు జిల్లా దేవనకొండలో వివాదం.. టీడీపీ, వైసీపీ నేతల అరెస్ట్

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో చెన్నకేశవ స్వామి ఉత్సవ వివాదం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు(టీడీపీ), మద్దిలేటి నాయుడు(వైసీపీ)ను పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 14న జరగనున్న ఉత్సవం సంప్రదాయంగా తామే నిర్వహించాలని రామచంద్రనాయుడు, తాము నిర్వహిస్తామని మద్దిలేటినాయుడు కుటుంబాల మధ్య పోటీతో వివాదం మొదలైంది.

09:35 AM (IST)  •  09 Feb 2022

రోడ్డుపై నిలబడ్డవారిపైకి దూసుకెళ్లిన ఆటో

ములుగు జిల్లాలోని జంగాలపల్లి క్రాస్ రోడ్డు దగ్గర బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన నిలబడి ఉన్న ముగ్గురిపైకి ఆటో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆటోతో సహా డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Embed widget