అన్వేషించండి

Breaking News Live: నరసాపురం ఎంపీ రఘురామ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం.. ఎంపీ భరత్ రామ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Andhra Pradesh Telangana news Updates Breaking News Live on December 28 Tuesday Breaking News Live: నరసాపురం ఎంపీ రఘురామ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం.. ఎంపీ భరత్ రామ్
abplive

Background

రైతు బంధు డబ్బులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో పడనున్నాయి. యాసంగి సీజన్‌లో 66.61 లక్షల మంది రైతులకు, 152.91 లక్షల ఎకరాలకు, రూ.7,645.66 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఎకరం భూమి ఉన్న రైతులకు 28న, రెండెకరాలు ఉన్న రైతులకు 29న, మూడెకరాలు ఉన్నవారికి 30న.. ఇలాగే రోజుకో ఎకరం పెంచుతూ వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామని వ్యవసాయ మంత్రి చెప్పారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 7 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.43,036.63 కోట్లు జమ చేశామని, ఈ సీజన్‌తో కలిపితే రూ.50 వేల కోట్ల మైలురాయిని చేరుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.

వంగవీటి రాధాకు సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకి సెక్యూరిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 2+2 గన్ మెన్ లను కేటాయించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. వంగవీటి రాధాపై రెక్కీ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఇంటిలిజెన్స్ డీజీకి ఆదేశాలు జారీ చేశారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి జగ్గారెడ్డి ఫిర్యాదు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బైలా పాటించడంలేదని లేఖలో పేర్కొన్నారు. 

కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 56కు చేరాయి. గడచిన 24 గంటల్లో 37,839 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 182 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,80,844కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌ లో ఈ వివరాలు ప్రకటించింది. గత 24 గంటలలో కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 4,023కి కరోనాతో మరణించారు. కరోనా బారి నుంచి తాజాగా 181 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 3,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ రికవరీ రేటు 98.90 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.59 శాతం ఉందని బులిటెన్‌లో ప్రకటించింది. నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన వారిలో 10 మందికి కొత్త వేరియంట్‌ సోకింది. వీరి కాంటాక్ట్స్ లో ఇద్దరి వ్యక్తుల్లో ఒమిక్రాన్ వైరస్‌ని గుర్తించారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో 10 మంది కోలుకున్నారు. 

13:57 PM (IST)  •  28 Dec 2021

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్

కడప జిల్లా: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో వేరే వారి పేర్లను చెప్పాలని తనపై ఒత్తిడి పెరుగుతోందని.. పులివెందుల పోలీసులు, ఎస్పీలకు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కదిరి లాయర్ లోకేశ్వర్ రెడ్డి ద్వారా సీబీఐ ఏఎస్పీ అధికారి రామ్ సింగ్ పై పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారు. వీరికి మద్దతుగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు వేరే పేర్లు చెప్పాలని.. కేసు విచారణకు వచ్చిందని.. త్వరగా వేరే వారి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా కృష్ణారెడ్డి చెప్పినట్లు లాయర్ లోకేశ్వర రెడ్డి, మరో కడప లాయర్ అనంత వర ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.

12:18 PM (IST)  •  28 Dec 2021

నరసాపురం ఎంపీ రఘురామ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం.. ఎంపీ భరత్ రామ్

నరసాపురం ఎంపీ రఘురామ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యారని.. తాము రూ. 125 కోట్లతో రాజమహేంద్రవరం సమగ్రాభివృద్ధికి శ్రీకారం చేపడుతున్నామని రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ అన్నారు. రాజమహేంద్రవరానికి మణిహారంలా రాజానగరం నుంచి  కడియపు లంక వరకు పది కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ప్రమాదాలకు కేంద్రంగా నిలుస్తున్న రాజమండ్రి హుకుంపేట జంక్షన్, జొన్నాడ సెంటర్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget