Breaking News Live Updates: ముగిసిన ఏపీ కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గ నేతల సమావేశం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 10న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 10న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ముగిసిన రాష్ట్రస్థాయి కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గ విస్తృత స్థాయి సమావేశం
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో రాష్ట్రస్థాయి కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. కాపు రిజర్వేషన్లు సాధనకు రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చిందని నేతలు చర్చించారు. పార్లమెంటులో ఇటీవల జరిగిన చట్ట సవరణ ప్రకారం ప్రభుత్వమే 5 శాతం కాపు రిజర్వేషన్ ఇవ్వ వచ్చునని పేర్కొన్నారు. త్వరలో విజయవాడలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల భారీ సమావేశం నిర్వహించాలని చర్చించారు. కాపులకు ఏడాదికి రూ.2 వేల కోట్ల హామీని ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
వృద్ధ దంపతులపై పెట్రోల్.. నిప్పంటించి హత్య
హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కేపీహెచ్బీ కాలనీలోని 6వ ఫేజ్లో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, వారి అల్లుడే పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. దంపతుల కుమార్తెను సాయి కృష్ణ అనే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడని.. ఇటీవల దంపతుల కుమార్తెను ఇతను వేధిస్తున్నందున ఈ అత్తామామలు పోలీసులకు ఫిర్యాదు చేశారని స్థానికులు వెల్లడించారు.





















