అన్వేషించండి

BRS MLA పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు, అక్రమ నిర్మాణాలే కారణం 

MLA Palla Rajeshwar Reddy : బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదయింది. ఇరిగేషన్ శాఖకు చెందిన భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

BRS MLA Palla Rajeshwar Reddy : భారత రాష్ట్ర సమితికి చెందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అంటూ బీఆర్ఎస్ నేతలు ఒకవైపు విమర్శలు చేస్తుండగా.. తాజాగా అదే పార్టీకి చెందిన జనగామ ఎమ్మెల్యేపై కేసు నమోదయింది.

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో 1.5 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆక్రమించిన ఈ స్థలంలో అనురాగ్ ఇన్స్టిట్యూషన్ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు ఇరిగేషన్ శాఖకు చెందిన ఏఈ పరమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సంస్థ చైర్మన్ గా ఉన్న రాజేశ్వర్ రెడ్డిపై పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్యేకు సమాచారాన్ని అందించారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెడుతోందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

చట్ట ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేసిన ఎమ్మెల్యే 

హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి విచారణ సందర్భంగా హైకోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తనను, అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత కక్షపూరితంగా వ్యవహరించిన తాను మాత్రం చట్ట ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణానికి చట్ట ప్రకారం అన్ని అనుమతులు తెచ్చుకున్నట్లు వెల్లడించారు. 2024 ఆగస్టు 22న ఇరిగేషన్ ఇంజనీర్ తమ విశ్వవిద్యాలయాన్ని పరిశీలించారని, మరుసటి రోజు గాయత్రి ట్రస్టు, అనురాగ్ సంస్థలు నాదం చెరువు బఫర్ జోన్లో ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు తమను కనీసం సమాచారం అడగకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వివరించారు.

అనుమతి లేకుండా నిర్మాణాలు చేయలేదు 

గాయత్రి ట్రస్ట్, అనురాగ్ సంస్థలు గడిచిన 25 ఏళ్లలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టలేదని వెల్లడించారు. గతంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కలిసి పరిశీలించి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో లేవంటూ ఎన్వోసీ ఇచ్చారన్నారు. 2018లో అప్పటి మేడ్చల్ కలెక్టర్ జిల్లా స్థాయి కమిటీ వేసి పరిశీలించిన తర్వాతే ఎన్వోసీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇరిగేషన్, రెవిన్యూ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎయిర్ పోర్ట్ అథారిటీలు అన్నీ ఎన్వోసీలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అన్ని శాఖల అనుమతులను పరిశీలించిన తర్వాతే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని వెల్లడించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం తనపై, తన సంస్థలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ ఆరోపించారు. జనగామలో వ్యక్తిగతంగా తనపై నాలుగు కేసులు, హైదరాబాదులో రెండు కేసులు పెట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనురాగ్ యూనివర్సిటీపై అన్ని శాఖలతో నిత్యం సోదాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఏమి దొరకకపోవడంతోనే 2017లో అనుమతులు ఇచ్చిన ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తనపై మరో కేసు నమోదు చేయించినట్లు పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా చట్ట పరిధిలో న్యాయం కోసం పోరాటం చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Embed widget