అన్వేషించండి

Telangana News : బీఆర్ఎస్‌ ఎంపీ పార్థసారధి రెడ్డికి రేవంత్ సర్కార్ షాక్ - 15 ఎకరాల భూకేటాయింపు నిలిపివేత !

MP Parthasaradhi Reddy : హెటెరో ఓనర్, బీఆర్ఎస్ ఎంపీ పార్థసారధి రెడ్డికి రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చింది. ఆయనకు కేటాయించిన భూములను రద్దు చేసింది.


Land allotted to BRS MP Parthasaradhi Reddy was canceled :  బీఆర్ఎస్ ఎంపీ పార్థసారధి రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం  గట్టి షాక్ ఇచ్చింది. హెటెరో సంస్థల అధిపతిగా ఉన్న ఆయనకు ఆస్పత్రి నిర్మాణానికి అంటూ పదిహేను ఎకరాల అత్యంత ఖరీదైన భూమిని 30 ఏళ్ల లీజుకు గత ప్రభుత్వం కేటాయించింది. ఈ లీజు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

హైటెక్‌సిటీకి కూతవేటు దూరంలో ఉన్న 15 ఎకరాల భూమిని గత సర్కారు తమ ఎంపీకి కారు చౌకగా కట్టబెట్టింది. రూ.4 వేల కోట్ల విలువైన భూమిని.. ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇచ్చింది. అంతేకాదు.. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్‌కు ఎన్నికలకు ముందు గోప్యంగా జారీ చేసిన జీవో ద్వారా ఈ భూమిని ధారాదత్తం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఇది రెండో సారి ఈ భూమి కేటాయించడం . అంతకు ముందు ఓ సారి కేటాయిస్తే  హైకోర్టు రద్దు  చేసింది. 
 

తెలంగాణ ప్రభుత్వం 2018లో 15 ఎకరాలు కేటాయించింది. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం ఖానామెట్ లో భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేసింది.    అయితే, సాయి సింధు ఫౌండేషన్ కి భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవాల్ చేస్తూ రైట్ టు సొసైటీ సభ్యులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే, ప్రభుత్వం నిర్ణయంపై కొంతమంది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.  దీనిపై విచారించిన కోర్టు జీవోను కొట్టివేసింది. భూకేటాయింపుల్లో ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా ఉండేలా పున:పరిశీలన చేయాలంటూ ప్రభుత్వానికి సూచించింది.  ప్రభుత్వం 60ఏళ్లకు భూమిని లీజుకి ఇచ్చింది. ప్రభుత్వ జీవో ప్రకారం 60ఏళ్లకు అద్దె విలువ కోటి 47లక్షల రూపాయలుగా నిర్ణయించింది. అయితే, అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇంత తక్కువకు అద్దెకు ఇవ్వడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ లెక్కన రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.5వేల 344 కోట్ల గండి పడుతుందని తెలిపింది. ఇంత ఖరీదైన భూమిని ఏకపక్షంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం అనేక అనుమానాలకు తావిస్తోందని హైకోర్టు సీరియస్ అయ్యింది. హైకోర్టు రద్దు చేయడంతో.. ఎన్నికలకు ముందు మరోసారి సీక్రెట్ గా భూమిని కేటాయించారు. 

అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోర్టు తీర్పును ఏమాత్రం పట్టించుకోలేదు. పార్థసారథిరెడ్డి ట్రస్టుకు లీజును కట్టబెట్టేందుకే మొగ్గుచూపింది. మరోమారు లీజు నిబంధనలను సవరించింది. 2023 సెప్టెంబరు 25న జీవో-140 ద్వారా సాయిసింధు ఫౌండేషన్‌కు విలువైన భూమిని కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఏడాదికి రూ.50 కోట్ల మేర లీజు చెల్లించాలని, ప్రతి ఐదేళ్లకోసారి లీజుమొత్తాన్ని 10ు మేర పెంచాలని సర్కారు జారీ చేసిన నిబంధనలు చెబుతున్నా.. ‘విచక్షణ అధికారం’ పేరుతో బీఆర్‌ఎస్‌ సర్కారు ఏడాదికి ఎకరాకు రూ.2 లక్షల చొప్పున.. 15.4 ఎకరాలకు రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇస్తున్నట్లు జీవో-140లో స్పష్టం చేసింది. ఇప్పుడీ భూమి కేటాయింపును రేవంత్ సర్కార్ రద్దు చేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Runa Mafi In Telangana: ఇప్పటి వరకు నిరుద్యోగులు- ఇకపై రైతులు రోడ్లపైకి వస్తారు- ప్రభుత్వానికి విపక్షాల హెచ్చరిక
ఇప్పటి వరకు నిరుద్యోగులు- ఇకపై రైతులు రోడ్లపైకి వస్తారు- ప్రభుత్వానికి విపక్షాల హెచ్చరిక
Nara Lokesh: కువైట్ బాధితుడు సేఫ్, వైరల్ వీడియోలోని వ్యక్తిని రక్షించాం: నారా లోకేశ్
కువైట్ బాధితుడు సేఫ్, వైరల్ వీడియోలోని వ్యక్తిని రక్షించాం: నారా లోకేశ్
Allu Arjun: అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసి మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసి మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్'లో రెండో పాట 'మార్ ముంత చోడ్ చింత' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్!
'డబుల్ ఇస్మార్ట్'లో రెండో పాట 'మార్ ముంత చోడ్ చింత' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PCB Threatened BCCI Regarding 2025 Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ సస్పెన్స్‌లో కొత్త అప్‌డేట్ | ABP Desamటీ20ల్లో ఓపెనర్లుగా ఈ నలుగురిలో ఎవరికి ఛాన్స్ | ABP DesamAnant Ambani gifts 2Cr Worth Watches |పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ కి కళ్లు చెదిరే గిఫ్టులిచ్చిన అంబానీVizianagaram Fort Lesser Known Story | దేశానికి ఆఖరి కోటగా చెప్పే విజయనగరం కోటపై ఆసక్తికర విషయాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Runa Mafi In Telangana: ఇప్పటి వరకు నిరుద్యోగులు- ఇకపై రైతులు రోడ్లపైకి వస్తారు- ప్రభుత్వానికి విపక్షాల హెచ్చరిక
ఇప్పటి వరకు నిరుద్యోగులు- ఇకపై రైతులు రోడ్లపైకి వస్తారు- ప్రభుత్వానికి విపక్షాల హెచ్చరిక
Nara Lokesh: కువైట్ బాధితుడు సేఫ్, వైరల్ వీడియోలోని వ్యక్తిని రక్షించాం: నారా లోకేశ్
కువైట్ బాధితుడు సేఫ్, వైరల్ వీడియోలోని వ్యక్తిని రక్షించాం: నారా లోకేశ్
Allu Arjun: అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసి మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
అట్లీ అవుట్‌, అల్లు అర్జున్‌ని కలిసి మరో స్టార్‌ డైరెక్టర్‌! - ఎవరంటే..! 
Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్'లో రెండో పాట 'మార్ ముంత చోడ్ చింత' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్!
'డబుల్ ఇస్మార్ట్'లో రెండో పాట 'మార్ ముంత చోడ్ చింత' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్!
Us Election 2024 : డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం- ఉపాధ్యక్ష అభ్యర్థిగా జె.డి.వేన్స్‌
డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం- ఉపాధ్యక్ష అభ్యర్థిగా జె.డి.వేన్స్‌
Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరో 5 రోజులు ఇంతే - ఐఎండీ
తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరో 5 రోజులు ఇంతే - ఐఎండీ
Madhya Pradesh :డిగ్రీలతో ప్రయోజనం లేదు- పంక్చర్ షాపులు పెట్టుకోండి- బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్
డిగ్రీలతో ప్రయోజనం లేదు- పంక్చర్ షాపులు పెట్టుకోండి- బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్
Telangana: గ్రూప్-2 వాయిదా వేయాలని అభ్యర్ధుల ఆందోళన, అరెస్టు చేసిన పోలీసులు
గ్రూప్-2 వాయిదా వేయాలని అభ్యర్ధుల ఆందోళన, అరెస్టు చేసిన పోలీసులు
Embed widget