అన్వేషించండి

Redmi Book 15 India Price: రెడ్‌మీబుక్ 15 ధర లీక్.. ఫీచర్లు కూడా..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ నుంచి త్వరలో విడుదల కానున్న రెడ్‌మీబుక్ 15 ల్యాప్‌టాప్‌ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఆగస్టు 3న విడుదల కానున్న ఈ ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్లు కూడా బయటకు వచ్చాయి.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ నుంచి త్వరలో విడుదల కానున్న రెడ్‌మీబుక్ (Redmi Book) 15 ల్యాప్‌టాప్‌ ధర, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఆగస్టు 3వ తేదీన విడుదల కానున్న ఈ ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్లు కూడా బయటకు వచ్చాయి. మనదేశంలో రెడ్‌మీ నుంచి విడుదల కానున్న మొదటి ల్యాప్‌టాప్ ఇదే.

దీనిలో ఇంటెల్ కోర్ 11వ జనరేషన్ ఐ3, ఐ5 ప్రాసెసర్లు అందించినట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు లీకైన వివరాల ప్రకారం.. రెడ్‌మీబుక్‌ 15లో 512 జీబీ స్టోరేజ్ ఉండనుంది. ఇది 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో రానుంది. రెడ్‌మీబుక్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు గత వారం షియోమీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో మల్టిపుల్ వెర్షన్లు ఉంటాయా? లేదా? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. 

ఆసుస్ వివో బుక్, షియోమీకి చెందిన ఎంఐ నోట్ బుక్ 13 ఆరిజన్ ఎడిషన్, ఎసర్ స్విఫ్ట్ 3లకు పోటీగా రెడ్‌మీబుక్ 15 ఉండనుందని తెలుస్తోంది. రెడ్‌మీబుక్ 15 ధర ఇండియాలో రూ.50000 వరకు ఉండవచ్చని అంచనా. ఇది చార్కోల్ గ్రే కలర్ ఆప్షన్లో ఉండనున్నట్లు కంపెనీ విడుదల చేసిన టీజర్ ద్వారా తెలిసింది. 

ఈ ల్యాప్‌టాప్‌లో 8 జీబీ ర్యామ్ ఉంటుందని తెలిసింది. అలాగే 256 జీబీ, 512 జీబీ పీసీఐఈలు ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి. ఇది విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లుగా.. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, యూఎస్‌బీ 3.1 టైప్ ఏ, యూఎస్‌బీ 2.0, హెచ్‌బీఎంఐ, ఆడియో జాక్ ఉండనున్నాయి.

దీనికి 65 వాట్స్ ఛార్జర్ కూడా వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు మాత్రం వెల్లడించలేదు. భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్న కొత్త ల్యాప్‌టాప్‌లలో షియోమీ ప్రత్యేకమైన హార్డ్‌వేర్‌ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది చైనాలో తెచ్చిన ల్యాప్‌టాప్‌లలో వాడిన హార్డ్‌వేర్‌‌కు భిన్నంగా ఉందని లీకుల ద్వారా తెలిసింది.  

రెడ్‌మీబుక్ 15తో పాటుగా షియోమీ మరో కొత్త మోడల్ ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ల్యాప్‌టాప్‌ వివరాలు పూర్తిగా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. 

ఆగస్టు 3న విడుదల.. 
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ నుంచి త్వరలో ల్యాప్‌టాప్ రానుంది. రెడ్‌మీ బుక్ (Redmi Book) పేరున్న ఈ ల్యాప్‌టాప్‌ను ఆగస్టు 3వ తేదీన భారత మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు షియోమీ ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్‌ను రెడ్‌మీ నోట్ 10టీ (Redmi Note 10T) స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ విడుదల చేయగా.. తాజాగా ల్యాప్‌టాప్‌ లాంచ్‌ డేట్‌ను వెల్లడించింది. 

మరింత చదవండి: రెడ్‌మీ నుంచి ల్యాప్‌టాప్ .. ఆగస్టు 3న లాంచ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget