అన్వేషించండి

Year Ender 2025: ఎస్టీడీ బూత్‌లో నిరీక్షణ నుంచి 5G వరకు; 25 ఏళ్ల భారత టెలికాం రంగంలో అద్భుతాలు ఇవే!

2000వ సంవత్సరంలో వేసిన పాలసీ సంస్కరణలనే టెలికాం రంగంలో విత్తనంగా మారాయి 4G, 5G అనే నీటిని పంచుకుని, నేడు దేశంలోని ప్రతి మూలకూ తన డిజిటల్ కనెక్టివిటీని అందిస్తోంది. 

25 years Indian Mobile Telecom Evolution: ఒకప్పుడు ఇంట్లో ఫోన్ కనెక్షన్ ఉండటం అనేది ఒక గొప్ప సామాజిక హోదా. ల్యాండ్‌లైన్ కోసం దరఖాస్తు చేసుకుని, నెలలు, ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ నేడు, దేశంలోని మారుమూల గ్రామంలోని సామాన్యుడి చేతిలో కూడా ప్రపంచాన్ని శాసించే స్మార్ట్‌ఫోన్ ఉంది. గత పాతికేళ్లలో భారత టెలికాం రంగం ప్రయాణించిన ఈ సుదీర్ఘ మార్గం కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు, అది ఒక దేశ ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మార్చేసిన మహా విప్లవం. 2000వ సంవత్సరంలో ఒక విలాసంగా ఉన్న మొబైల్ ఫోన్, 2025 నాటికి ప్రతి భారతీయుడి ప్రాథమిక హక్కుగా, అవసరంగా రూపాంతరం చెందింది. 

తొలి అడుగులు: ల్యాండ్‌లైన్ లగ్జరీ నుంచి మొబైల్ ప్రారంభం వరకు

2000వ సంవత్సరానికి ముందు టెలికాం రంగం పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉండేది. 2001 నాటి గణాంకాలను గమనిస్తే, ప్రతి వంద మందిలో కేవలం 3.5 మందికి మాత్రమే ఫోన్ కనెక్షన్ ఉండేది. అప్పట్లో ఎస్టీడీ (STD) బూత్‌ల వద్ద క్యూ కట్టడం, ఫోన్ కాల్స్ కోసం నిరీక్షించడం ఒక సాధారణంగా కనిపించే దృశ్యం. అయితే, నేషనల్ టెలికాం పాలసీ 1999 ప్రైవేట్ ఆపరేటర్ల ప్రవేశానికి మార్గం సుగమం చేసి, లైసెన్స్ ఫీజు విధానంలో మార్పులు తీసుకురావడంతో సరికొత్త శకం మొదలైంది. 2000-2005 మధ్య కాలంలో మొబైల్ ఫోన్లు పట్టణాల నుంచి చిన్న పట్టణాలకు విస్తరించడం ప్రారంభమైంది. అప్పట్లో హ్యాండ్‌సెట్ ధరలు, కాల్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, మాట్లాడే సౌలభ్యం ప్రజలను ఆకర్షించింది.

విస్తరణ పర్వం: పోటీ పెరిగింది.. ధరలు పడిపోయాయి

2006 నుంచి 2010 మధ్య కాలంలో టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. కొత్త కంపెనీల రాకతో కాల్ రేట్లు గణనీయంగా తగ్గాయి. 2006 నాటికే దేశంలో 10 కోట్ల సబ్‌స్క్రైబర్ల మైలురాయిని అధిగమించగా, కొద్ది కాలంలోనే అది బిలియన్ (100 కోట్లు) స్థాయికి చేరుకుంది. ఈ దశలోనే ప్రీపెయిడ్ సేవలు, సెకండ్ బిల్లింగ్ విధానం రావడంతో, మొబైల్ ఫోన్ విలాస వస్తువు నుంచి సామాన్యుడి అవసరంగా మారిపోయింది. అప్పట్లో ఫీచర్ ఫోన్లు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించేవి. 2010లో 3G, బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ యాక్సెస్ స్పెక్ట్రమ్ వేలం జరగడం దేశంలో డేటా యుగానికి పునాది వేసింది.

డేటా విప్లవం: జియో రాకతో మారిన మార్కెట్ ముఖచిత్రం

2011 నుంచి 2014 మధ్య కాలంలో మొబైల్ కేవలం మాట్లాడటానికే కాకుండా, ఇంటర్నెట్ వినియోగానికి ప్రధాన సాధనంగా మారింది. అయితే, 2016లో రిలయన్స్ జియో ప్రవేశం భారత టెలికాం చరిత్రలోనే అతిపెద్ద మలుపు. అత్యంత చౌకైన 4G డేటా, ఉచిత కాల్స్‌తో జియో మార్కెట్ నిర్మాణాన్ని పూర్తిగా మార్చేసింది. దీనివల్ల డేటా వినియోగం ప్రపంచంలోనే భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది. 2014లో 13 మంది ఉన్న పెద్ద ఆపరేటర్లు, ధరల యుద్ధం, కంపెనీల విలీనాల వల్ల 2024 నాటికి కేవలం ముగ్గురు ప్రైవేట్ ప్లేయర్లు, ఒక ప్రభుత్వ సంస్థ (BSNL)కు కుంచించుకుపోయారు.

కోవిడ్ సంక్షోభంతో ఎసెన్షియల్ సర్వీస్‌గా టెలికాం 

2020-21 నాటి కోవిడ్ మహమ్మారి సమయంలో టెలికాం రంగం దేశానికి వెన్నెముకగా నిలిచింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసులు, టెలీ మెడిసిన్ వంటివి టెలికాం మౌలిక వసతులపైనే ఆధారపడి కొనసాగాయి. ఈ కాలంలోనే ప్రజల జీవనశైలిలో డిజిటల్ అడాప్షన్ వేగవంతమైంది. ఫోన్ ఇప్పుడు కేవలం కమ్యూనికేషన్ పరికరం మాత్రమే కాకుండా, విద్య, ఉపాధి వ్యాపారాలకు ప్రధాన వేదికగా మారింది.

2024-2025 గణాంకాలు: స్మార్ట్‌ఫోన్ల జోరు.. ఫీచర్ ఫోన్ల పతనం

తాజా సమాచారం ప్రకారం, 2024లో భారత మొబైల్ మార్కెట్ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది.

  • మొత్తం మొబైల్ ఫోన్లు: సుమారు 20.5 కోట్లు (205 మిలియన్ యూనిట్లు) అమ్ముడయ్యాయి.
  • స్మార్ట్‌ఫోన్లు: 15.1 కోట్లు (151 మిలియన్ యూనిట్లు).
  • ఫీచర్ ఫోన్లు: 5.4 కోట్లు (54 మిలియన్ యూనిట్లు) మాత్రమే షిప్ అయ్యాయి.
  • 5G స్మార్ట్‌ఫోన్లు: ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్లలో 79 శాతం 5G సపోర్ట్ ఉన్నవే కావడం విశేషం.

2025 అంచనాల ప్రకారం, స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు 150 మిలియన్ కంటే స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని ఐడీసీ (IDC) వంటి సంస్థలు పేర్కొన్నాయి. ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో డబుల్ డిజిట్ పతనం కొనసాగుతోంది. 

వినియోగదారులు ఇప్పుడు ప్రీమియమ్, సస్టైనబుల్ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఆత్మనిర్భర్ టెలికాం- బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) పునరుజ్జీవం

ప్రస్తుతం 2025లో భారత టెలికాం రంగం ఆత్మనిర్భర్ దిశగా పెద్ద అడుగు వేసింది. బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేశీ 4G స్టాక్ (టీసీఎస్, తేజాస్ ర్యాన్, సి-డాట్ కోర్ భాగస్వామ్యంతో) ద్వారా దాదాపు 97,500 నుంచి 98,000 టవర్లతో తన నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. ఇది భారత్‌ను ప్రపంచంలోనే స్వదేశీ టెలికాం సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల జాబితాలో నిలబెట్టింది. అలాగే, నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ 2.0 ద్వారా 99.9% జిల్లాల్లో హైస్పీడ్ కనెక్టివిటీని లక్ష్యంగా పెట్టుకోవడం తాజా మైలురాయి.

ప్రజల జీవితాల్లో డిజిటల్ మార్పు

గత పాతికేళ్లలో ఫోన్ వినియోగం కేవలం మాటలకే పరిమితం కాలేదు. డిజిటల్ ఇండియా, యూపీఐ (UPI) విప్లవం టెలికాం మౌలిక సదుపాయాలనే ఆసరాగా చేసుకున్నాయి. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లాల్సిన పని, ఇప్పుడు అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా నిమిషాల్లో పూర్తవుతోంది. వార్తల వినియోగంలో కూడా భారీ మార్పు వచ్చింది. న్యూస్ యాప్‌లు, సోషల్ మీడియా ద్వారా నిమిషానికో అప్‌డేట్ సామాన్యుడికి అందుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొబైల్ వినియోగం పెరగడంతో పట్టణ, గ్రామీణ వ్యత్యాసాలు తగ్గుతున్నాయి.

నిపుణుల విశ్లేషణ -సవాళ్లు

టెలికాం విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ రంగం భారత జీడీపీలో దాదాపు 6 శాతం వాటాను సాధించింది. అయితే, ఏజీఆర్ (AGR) బకాయిలు, స్పెక్ట్రం లైసెన్స్ ఫీజు సమస్యలు, సైబర్ భద్రత వంటి సవాళ్లు ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ, 5G, రాబోయే 6G టెక్నాలజీలు, శాటిలైట్ కమ్యూనికేషన్ వంటివి భవిష్యత్తులో దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించనున్నాయని వారు అంచనా వేస్తున్నారు.

సరికొత్త యుగం వైపు అడుగులు

2000 నుంచి 2025 వరకు సాగిన ఈ టెలికాం ప్రయాణం ఒక మనిషి పాతికేళ్ల జీవిత ప్రయాణాన్ని తలపిస్తుంది. నిరీక్షణతో మొదలై, వేగంతో సాగి, ఇప్పుడు సంపూర్ణ డిజిటల్ ఆధారిత జీవనంగా మారిపోయింది. 2000ల నాటి ఎస్టీడీ బూత్ క్యూల నుంచి 2025 నాటి 5G స్మార్ట్‌ఫోన్ల వరకు భారత్ చేసిన ఈ ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైంది. అద్భుతమైంది. పాలసీ సంస్కరణలు, సాంకేతిక అభివృద్ధి, వినియోగదారుల మారుతున్న అభిరుచులే ఈ విప్లవానికి ప్రధాన కారణాలు. రాబోయే రోజుల్లో భారత్ కేవలం సేవలను వినియోగించుకునే దేశం మాత్రమే కాదు, టెక్నాలజీని ప్రపంచానికి అందించే స్థాయికి చేరుకోవడం ఖాయం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026:విజయ్ మెడకు కరూర్ తొక్కిసలాట కేసు - జననాయగన్ షూటింగ్ వల్లే 41 మంది ప్రాణాలు పోయాయా?
విజయ్ మెడకు కరూర్ తొక్కిసలాట కేసు - జననాయగన్ షూటింగ్ వల్లే 41 మంది ప్రాణాలు పోయాయా?
Telangana Gaddar Awards 2026 : తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026 - విజేతలకు పురస్కారాలు
తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026 - విజేతలకు పురస్కారాలు
Israel-Iran War: దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు! మధ్యప్రాచ్య సంక్షోభం వేళ ముందస్తు చర్యలు!
దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు! మధ్యప్రాచ్య సంక్షోభం వేళ ముందస్తు చర్యలు!
Amazon Prime Series : అమెజాన్ ప్రైమ్ వీడియో మెగా లైనప్ - 55కి పైగా కొత్త సిరీస్‌లు... మీర్జాపూర్ నుంచి గూఢచారి 2 వరకూ కంప్లీట్ లిస్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియో మెగా లైనప్ - 55కి పైగా కొత్త సిరీస్‌లు... మీర్జాపూర్ నుంచి గూఢచారి 2 వరకూ కంప్లీట్ లిస్ట్
Advertisement

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections 2026:విజయ్ మెడకు కరూర్ తొక్కిసలాట కేసు - జననాయగన్ షూటింగ్ వల్లే 41 మంది ప్రాణాలు పోయాయా?
విజయ్ మెడకు కరూర్ తొక్కిసలాట కేసు - జననాయగన్ షూటింగ్ వల్లే 41 మంది ప్రాణాలు పోయాయా?
Telangana Gaddar Awards 2026 : తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026 - విజేతలకు పురస్కారాలు
తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026 - విజేతలకు పురస్కారాలు
Israel-Iran War: దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు! మధ్యప్రాచ్య సంక్షోభం వేళ ముందస్తు చర్యలు!
దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు! మధ్యప్రాచ్య సంక్షోభం వేళ ముందస్తు చర్యలు!
Amazon Prime Series : అమెజాన్ ప్రైమ్ వీడియో మెగా లైనప్ - 55కి పైగా కొత్త సిరీస్‌లు... మీర్జాపూర్ నుంచి గూఢచారి 2 వరకూ కంప్లీట్ లిస్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియో మెగా లైనప్ - 55కి పైగా కొత్త సిరీస్‌లు... మీర్జాపూర్ నుంచి గూఢచారి 2 వరకూ కంప్లీట్ లిస్ట్
Kalvakuntla Kavitha: డాడీ, మోడీ, చిన్న మోడీపై పోరాటం - తన రాజకీయాన్ని తేల్చేసిన కవిత
డాడీ, మోడీ, చిన్న మోడీపై పోరాటం - తన రాజకీయాన్ని తేల్చేసిన కవిత
Iran War Updates: సహనం నశించింది - ఇరాన్‌కు అరబ్ దేశాల హెచ్చరిక - రంజాన్ ముగియగానే విరుచుకుపడతారా?
సహనం నశించింది - ఇరాన్‌కు అరబ్ దేశాల హెచ్చరిక - రంజాన్ ముగియగానే విరుచుకుపడతారా?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు - త్వరలోనే మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం
మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు - త్వరలోనే మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం
Viral News: ఇన్‌స్టాగ్రామ్ చూసి ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేసిన పిల్లలు! చెప్పుతో పొట్టుపొట్టున కొట్టిన తండ్రి; వీడియో వైరల్!
ఇన్‌స్టాగ్రామ్ చూసి ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేసిన పిల్లలు! చెప్పుతో పొట్టుపొట్టున కొట్టిన తండ్రి; వీడియో వైరల్!
Embed widget