అన్వేషించండి

Jio Free Data: 21 జీబీ వరకు డేటా ఫ్రీగా ఇస్తున్న జియో - ఆఫర్ కోసం ఏం చేయాలి?

ఏడో వార్షికోత్సవం సందర్భంగా జియో తన వినియోగదారులకు ఉచితంగా డేటా అందిస్తుంది.

రిలయన్స్ జియో తన వినియోగదారులకు 21 జీబీ వరకు డేటాను ఉచితంగా అందిస్తోంది. 2023 సెప్టెంబర్ 5వ తేదీన జియో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే జియో రాకతో మనదేశంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఏడో వార్షికోత్సవం సందర్భంగా జియో తన వినియోగదారులకు కొన్ని ప్లాన్ల ద్వారా ఉచిత డేటాను అందిస్తుంది.

కేవలం బోనస్ డేటా మాత్రమే కాకుండా అజియో, నెట్‌మెడ్స్ వంటి వాటికి డిస్కౌంట్ కూపన్లు కూడా లభిస్తున్నాయి. రూ.299, రూ.749, రూ.2,999 ప్లాన్ల ద్వారా రీఛార్జ్ చేస్తే అదనపు డేటా లాభాలు లభించనున్నాయి. ఈ ఆఫర్ కూడా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య అందుబాటులో ఉండనున్నాయి.

రూ.299 ప్లాన్
వీటిలో రూ. 299 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటా, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభించనున్నాయి. జియో ఫ్రీ డేటా ప్లాన్ కింద 7 జీబీ డేటా ఉచితంగా లభించనుంది.

రూ.749 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. దీని లాభాలన్నీ పై ప్లాన్ తరహాలోనే ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా 14 జీబీ డేటా ఉచితంగా లభించనుంది. రెండు 7 జీబీ వోచర్లు లభించనున్నాయి. మై జియో యాప్‌లో ఈ వోచర్లు తీసుకోవచ్చు.

రూ.2,999 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. దీని ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా లభించనుంది. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అందించనున్నారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 21 జీబీ డేటా ఉచితంగా లభించనుంది. దీంతో పాటు మరిన్ని ఇతర లాభాలు కూడా లభించనున్నాయి.

మరోవైపు రిలయన్స్ జియో ఇటీవలే కొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అదే జియో భారత్ వీ2 4జీ. ప్రస్తుతం 2జీ మొబైల్ ఉపయోగిస్తున్న 25 కోట్ల మంది వినియోగదారులే లక్ష్యంగా ఈ ఫోన్‌ను తీసుకువచ్చినట్లు జియో తెలిపింది. ఈ ఫీచర్ ఫోన్లకు ప్రత్యేకమైన ప్లాన్లు కూడా ప్రకటించింది. జియో భారత్ వీ2 4జీ ధరను రూ.999గా నిర్ణయించారు. ప్రస్తుతం మనదేశంలో ఇంటర్నెట్ ఫీచర్ ఉన్న ఫోన్లలో అత్యంత చవకైనది ఇదే. రెడ్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్‌లో 1.77 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. జియో సినిమా, జియో సావన్, జియో పే సర్వీసులను జియో భారత్ వీ2 4జీ ద్వారా ఉపయోగించవచ్చు. దీని వెనకవైపు 0.3 మెగాపిక్సెల్ వీజీఏ కెమెరా ఉంది. 1000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌ను జియో భారత్ వీ2 4జీ అందించనుంది. స్టోరేజ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. ఫోన్ వెనకవైపు కార్బన్ లోగోను కూడా చూడవచ్చు. 

Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP DesamRayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP DesamJanasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Viral News: చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Embed widget