అన్వేషించండి

Jio 5G: ఇకపై 4G స్మార్ట్‌ ఫోన్లలో కూడా 5G సేవలు పొందవచ్చు, ఎలాగో తెలుసా?

దేశంలో 5G సేవలు మొదలయ్యాక.. రిలయన్స్ జియో విస్తృత స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు 4G స్మార్ట్ ఫోన్లు సైతం 5G సేవలు అందుకునే అవకాశం కల్పిస్తోంది.

4G ఫోన్లలో 5G సేవలను పొందే అవకాశం

భారత్ లో ఇప్పుడిప్పుడే 5G సేవలు విస్తృతం అవుతున్నాయి. తొలుత ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో ఆయా టెలికాం సంస్థలు 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం రోజు రోజుకు ఇతర నగరాలకు 5G సర్వీసులను విస్తరిస్తూ పోతున్నాయి. దేశ వ్యాప్తంగా 5G నెట్ వర్క్ తో విస్తృత కవరేజీ కోసం ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సెటప్ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జియో మరో ముందడుగు వేసింది. 4G ఫోన్లు సైతం 5G సేవలను పొందే అవకాశం కల్పిస్తోంది.  Wi-Fi  ద్వారా చాలా మందికి 5G సర్వీసులను అందుకునే వెసులుబాటు అందిస్తోంది. తాజాగా ఈ టెలికాం ఆపరేటర్ రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో సరికొత్త 5G Wi-Fi సేవలను మొదలు పెట్టింది. కీలక ప్రాంతాల్లో Wi-Fi నెట్‌ వర్క్‌ ల ద్వారా వినియోగదారులకు 5G వేగాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే విద్యా సంస్థలు, పుణ్య క్షేత్రాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కమర్షియల్ హబ్‌లు, సహా పలు ప్రాంతాలలో Jio True 5G-ఆధారిత Wi-Fi సేవలను Jio అందిస్తోంది. వీటి ద్వారా  ప్రస్తుత 4G నెట్‌ వర్క్ సపోర్టు చేసే మోబైల్ వినియోగదారులు కూడా  5G నెట్‌వర్క్ ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.  

మరిన్ని నగరాలకు Jio 5G ఆధారిత WI-Fi సేవలు

Jio 5G ఆధారిత Wi-Fi సేవలు, Jio 5G మొబైల్ నెట్‌వర్క్ ను మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది.  ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసి వంటి ఎంపిక చేసిన నగరాల్లో ప్రారంభించిన 5G నెట్‌వర్క్ అత్యంత మెరుగ్గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 5G సేవలను జియో దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ జాబితాలో చెన్నై కూడా చేరింది.

ఉచితంగా అందుబాటులోకి Jio 5G Wi-Fi సేవలు

Jio 5G ఆధారిత Wi-Fi సేవలు రిలయన్స్ జియో వినియోగదారులందరికీ ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. Jio యేతర వినియోగదారులు కూడా ఈ Wi-Fi హాట్‌ స్పాట్‌ లో 5G సేవలను యాక్సెస్ చేయగలరు. కానీ, ఎక్కువ స్పీడ్ తో సేవలను అందుకోలేరు. తక్కువ కెపాసిటీ డేటాను పొందే అవకాశం ఉంది. 

అత్యంత మెరుగ్గా Jio 5G స్పీడ్

Jio 5G నెట్‌వర్క్ ప్రారంభ స్పీడ్ టెస్ట్‌లలో మంచి ఫలితాలను చూపించింది. Airtel  5G నెట్‌వర్క్‌తో పోలిస్తే, Jio యొక్క 5G నెట్‌వర్క్ సాధారణంగా 400-500 Mbps వేగాన్ని అందిస్తోంది. ఇది ప్రస్తుత 4G వేగం కంటే చాలా వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, Jio స్వతంత్ర 5G నెట్‌ వర్క్‌ ను ఉపయోగిస్తోంది. అంటే ఇది పూర్తిగా 5G నెట్ వర్క్ మీదే ఆధారపడి ఉంటుంది. మరింత కవరేజీని అందించడానికి బ్యాకప్‌ గా 4Gపై ఆధార పడదు. మార్చి 2024 నాటికి 5G సేవలు  దేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకుంటాయని జియో ఇప్పటికే వెల్లడించింది. 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget