అన్వేషించండి

Jio 5G: ఇకపై 4G స్మార్ట్‌ ఫోన్లలో కూడా 5G సేవలు పొందవచ్చు, ఎలాగో తెలుసా?

దేశంలో 5G సేవలు మొదలయ్యాక.. రిలయన్స్ జియో విస్తృత స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు 4G స్మార్ట్ ఫోన్లు సైతం 5G సేవలు అందుకునే అవకాశం కల్పిస్తోంది.

4G ఫోన్లలో 5G సేవలను పొందే అవకాశం

భారత్ లో ఇప్పుడిప్పుడే 5G సేవలు విస్తృతం అవుతున్నాయి. తొలుత ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో ఆయా టెలికాం సంస్థలు 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం రోజు రోజుకు ఇతర నగరాలకు 5G సర్వీసులను విస్తరిస్తూ పోతున్నాయి. దేశ వ్యాప్తంగా 5G నెట్ వర్క్ తో విస్తృత కవరేజీ కోసం ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సెటప్ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జియో మరో ముందడుగు వేసింది. 4G ఫోన్లు సైతం 5G సేవలను పొందే అవకాశం కల్పిస్తోంది.  Wi-Fi  ద్వారా చాలా మందికి 5G సర్వీసులను అందుకునే వెసులుబాటు అందిస్తోంది. తాజాగా ఈ టెలికాం ఆపరేటర్ రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో సరికొత్త 5G Wi-Fi సేవలను మొదలు పెట్టింది. కీలక ప్రాంతాల్లో Wi-Fi నెట్‌ వర్క్‌ ల ద్వారా వినియోగదారులకు 5G వేగాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే విద్యా సంస్థలు, పుణ్య క్షేత్రాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కమర్షియల్ హబ్‌లు, సహా పలు ప్రాంతాలలో Jio True 5G-ఆధారిత Wi-Fi సేవలను Jio అందిస్తోంది. వీటి ద్వారా  ప్రస్తుత 4G నెట్‌ వర్క్ సపోర్టు చేసే మోబైల్ వినియోగదారులు కూడా  5G నెట్‌వర్క్ ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.  

మరిన్ని నగరాలకు Jio 5G ఆధారిత WI-Fi సేవలు

Jio 5G ఆధారిత Wi-Fi సేవలు, Jio 5G మొబైల్ నెట్‌వర్క్ ను మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది.  ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసి వంటి ఎంపిక చేసిన నగరాల్లో ప్రారంభించిన 5G నెట్‌వర్క్ అత్యంత మెరుగ్గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 5G సేవలను జియో దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ జాబితాలో చెన్నై కూడా చేరింది.

ఉచితంగా అందుబాటులోకి Jio 5G Wi-Fi సేవలు

Jio 5G ఆధారిత Wi-Fi సేవలు రిలయన్స్ జియో వినియోగదారులందరికీ ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. Jio యేతర వినియోగదారులు కూడా ఈ Wi-Fi హాట్‌ స్పాట్‌ లో 5G సేవలను యాక్సెస్ చేయగలరు. కానీ, ఎక్కువ స్పీడ్ తో సేవలను అందుకోలేరు. తక్కువ కెపాసిటీ డేటాను పొందే అవకాశం ఉంది. 

అత్యంత మెరుగ్గా Jio 5G స్పీడ్

Jio 5G నెట్‌వర్క్ ప్రారంభ స్పీడ్ టెస్ట్‌లలో మంచి ఫలితాలను చూపించింది. Airtel  5G నెట్‌వర్క్‌తో పోలిస్తే, Jio యొక్క 5G నెట్‌వర్క్ సాధారణంగా 400-500 Mbps వేగాన్ని అందిస్తోంది. ఇది ప్రస్తుత 4G వేగం కంటే చాలా వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, Jio స్వతంత్ర 5G నెట్‌ వర్క్‌ ను ఉపయోగిస్తోంది. అంటే ఇది పూర్తిగా 5G నెట్ వర్క్ మీదే ఆధారపడి ఉంటుంది. మరింత కవరేజీని అందించడానికి బ్యాకప్‌ గా 4Gపై ఆధార పడదు. మార్చి 2024 నాటికి 5G సేవలు  దేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకుంటాయని జియో ఇప్పటికే వెల్లడించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget