అన్వేషించండి

Android Risk Alert: ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం వార్నింగ్, వెంటనే అప్ డేట్ చేసుకోకపోతే ముప్పు తప్పదట!

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. కొన్ని వెర్షన్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. వెంటనే సదరు వినియోగదారులు అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక హెచ్చరికలను జారీ చేసింది. ఆండ్రాయిడ్‌ ఓఎస్ లోని పలు వెర్షన్లలో పలు లోపాలను గుర్తించినట్లు కేంద్ర సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా(CERT-In) తెలిపింది. ఈ లోపాలు తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని హెచ్చరించింది. వీటి ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఆయా స్మార్ట్ ఫోన్లలోని కీలక సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని తేల్చి చెప్పింది.    

ఏ ఆండ్రాయిడ్ ఫోన్లకు సైబర్ ముప్పు ఉందంటే?

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ 10 నుంచి మొదలుకొని ఆండ్రాయిడ్‌ 13 వరకు ఈ లోపాలను గుర్తించినట్లు CERT-In వెల్లడించింది. ఫ్రేమ్‌ వర్క్‌, ఆండ్రాయిడ్‌ రన్‌ టైమ్‌, సిస్టమ్‌ కాంపోనెంట్‌, గూగుల్‌ ప్లే సిస్టమ్‌ అప్‌ డేట్స్‌, కెర్నెల్‌, ఆర్మ్‌ కాంపోనెంట్స్‌, క్వాల్కమ్‌ క్లోజ్డ్‌ సోర్స్‌ కాంపోనెంట్స్‌ లో పలు తప్పుల కారణంగా ఈ సమస్యలు తలెత్తినట్లు తెలిపింది. ఈ లూప్ హోల్స్ ను బేస్ చేసుకుని సైబర్ నేరగాళ్లు ఆయా స్మార్ట్ ఫోన్లలోని ముఖ్యమైన డేటా అంటే, ఫోటోలు, వీడియోలు, బ్యాంక్ వివరాలను దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించింది. సైబర్ నేరస్తులు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లపై దాడి చేసినప్పుడు, ఆయా ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకుని ప్రమాదకరమైన మాల్వేర్ ను పంపిస్తారని చెప్పింది. దీని ద్వారా ముఖ్యమైన సమాచారం తస్కరించి, ఫోన్ పని చేయకుండా చేస్తారని వెల్లడించింది.   

సైబర్ దాడుల ముప్పును ఎలా ఎదుర్కోవాలంటే?  

ఆండ్రాయిడ్‌ 10 నుంచి ఆండ్రాయిడ్‌ 13 వరకు స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు సైబర్ దాడులకు అవకాశం లేకుండా  ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్‌ను అప్‌ డేట్‌ చేసుకోవాలని కేంద్రం సూచించింది.

1. ఇందుకు డివైజ్‌ సెట్టింగ్స్‌ లోకి వెళ్లి 'సిస్టమ్​' అనే ఆప్షన్‌ పై క్లిక్‌ చేయాలి.

2. ఆ తర్వాత 'సిస్టమ్​ అప్​డేట్స్'లోకి వెళ్లాలి.

3. ఏదైనా అప్‌డేట్‌ ఉంటే దాన్ని సెలెక్ట్‌ చేసుకోవాలి.

4. ఆ తర్వాత డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

5. ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఈ  అప్‌ డేట్‌ ప్రక్రియ కొనసాగించాలి.   

వినియోగదారులకు కీలక సూచనలు 

1. విశ్వసనీయమైన సోర్సుల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

2. ఫోన్‌లో మాల్వేర్‌ ఉందా?లేదా? అని తెలుసుకునేందుకు సెక్యూరిటీ యాప్‌ను వినియోగించాలి.

3. గుర్తు తెలియని ఈమెయిళ్లు, అటాచ్‌మెంట్లను తెరవకూడదు.   

4. స్ట్రాంగ్ పాస్‌ వర్డ్‌ తో పాటు యాప్స్‌ లో టు ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ ను వాడాలి.  

5. ఎప్పటికప్పుడు మీ డేటాను బ్యాకప్ చేసుకోవాలి..

6. డేలా బ్యాక్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ పోయినా? లేదంటే దొంగిలించబడినా, మీరు మీ డేటాను తిరిగి పొందే అవకాశం ఉంటుంది.   

మొత్తంగా సైబర్ దాడుల బారిన పడకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆండ్రాయిడ్ వినియోగదారులకు కేంద్రం సూచించింది. 

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
AI Danger: మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
Kagaznagar Crime News: ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అత్యాచారం, కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత- నిందితుడి అరెస్ట్
ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అత్యాచారం, కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత- నిందితుడి అరెస్ట్
Buses To Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
Embed widget