అన్వేషించండి

Tips For Laptop: ల్యాప్ టాప్ వాడుతున్నారా? అయితే ఈ తప్పులు చేస్తున్నారా చూసుకోండి

ల్యాప్ టాప్ వాడకం ఎక్కువైంది. కానీ వాటిని వాడేటప్పుడు చేసే తప్పుల గురించి.. ఆలోచించం. మనకు తెలియకుండానే.. చిన్నచిన్న తప్పులు చేస్తుంటాం.

 

కరోనా కారణంగా ల్యాప్ టాప్ వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇలా చాలా మంది ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని కొనేముందు అనేక రకాలుగా విచారించి కావాల్సిన ఫీచర్స్‌తో మనకు అనుకూలమై ధరలో నచ్చిన మోడల్‌ను ఎంచుకుంటాం. కానీ వాటిని సరిగా ఉపయోగిస్తున్నామా లేదా అనేదే అసలు పాయింట్. కొన్నిసార్లు నిర్లక్ష్యంతోనో.. లేకుంటే అవగాహన లేకుండా... వాటిని ఉపయోగించేప్పుడు తప్పులు చేస్తుంటాం. అదే ల్యాప్ టాప్ పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఇలా అయితే కొన్ని రోజులకే ల్యాప్ టాప్ పై ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ల్యాప్ టాప్ కి మంచిది,

మనకు అవసరం ఉన్నా... లేకున్నా.. ఓ తెగ ఛార్జింగ్ పెడుతుంటాం. 24 గంటలు ఛార్జింగ్ ఎక్కాల్సిందే అన్నట్టు చేస్తుంటాం.  ఇలా చేయడం మంచిది కాదు. 24 గంటలు  ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి ఉంచడం వల్ల ల్యాప్‌టాప్‌లోని కొన్ని లోపలి కాంపోనెంట్స్‌ కాలిపోయే ఛాన్స్ ఉంది. అందుకే గేమింగ్, వీడియో ఎడిటింగ్‌ చేసేప్పుడు మినహాయించి మిగిలిన సందర్భాల్లో ల్యాప్‌టాప్‌ ఆన్‌ చేసి ఉపయోగించకున్నా, స్లీప్‌ మోడ్‌లో ఉంచినా ఛార్జర్‌ తొలగించడం బెటర్.  ల్యాప్‌టాప్ బ్యాటరీ ఎక్కువ కాలం ఎలాంటి సమస్య లేకుండా పనిచేస్తుంది.

మనం ఏదో బిజీలో ఉంటాం.. వర్క్‌ టేబుల్‌పై ఉండే ల్యాప్‌టాప్‌, ఇతరత్రా వైర్ల గురించి పెద్దగా పట్టించుకోం. వాటిని సరిచేసుకునేందుకు ఇంట్రస్ట్ చూపించం. పనిలో పడి అటు ఇటు నడుసున్నప్పుడు మన కాళ్లకు తగలడం లేదా కుర్చీ కింద పడి వైర్లు పాడవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో వైర్లు తెగిపోతుంటాయి. అందుకే ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌ వైర్‌ లేదా ఇతరత్రా వైర్లను వీలైనంత వరకు మీకు అడ్డంలేకుండా చూసుకోండి.

ల్యాప్ టాప్ తీసుకున్నామో లేదో.. ఎలా పడితే అలా ఓపెన్ చేస్తాం... అయితే ల్యాప్ టాప్ ఓపెన్ చేసే పద్ధతిలోనూ తేడా ఉంటుంది. ల్యాప్‌టాప్‌ను సరైన పద్ధతిలో ఓపెన్ చేస్తున్నామా..లేదా అనేది ఆలోచించం. చాలామంది ల్యాప్‌టాప్‌ను సైడ్‌ కార్నర్ వైపు నుంచి ఓపెన్ చేస్తుంటారు. దాని వల్ల ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ ఒకవైపు మాత్రమే ఒత్తిడి ఏర్పడి డిస్‌ప్లే పాడయ్యే అవకాశం ఉంది. అందుకే ల్యాప్‌టాప్ తెరిచేముందు కీప్యాడ్ భాగం మీద ఒక చేతిని ఉంచి మరో చేత్తో స్క్రీన్‌ మధ్య భాగంలో పట్టుకుని తెరవడం మంచిది. దానివల్ల ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదు.

ల్యాప్‌టాప్‌లకు కూడా విడిగా కూలింగ్ పాడ్ ఉపయోగిస్తుంటారు. మరి ల్యాప్‌టాప్‌లకు కూలింగ్ పాడ్ ఉపయోగించాలా..వద్దా అంటే ఉపయోగించడమే బెటర్. ల్యాప్‌టాప్‌ని టేబుల్ మీద ఉంచి ఉపయోగిస్తున్నప్పుడు కిందివైపున ఉండే వెంటిలేటర్స్ ద్వారా ఎయిర్‌ఫ్లో ఆగిపోయే అవకాశం ఉంది. దానివల్ల ల్యాప్‌టాప్‌లోని కొన్ని సున్నితమైన భాగాలు కాలిపోవచ్చు. అందుకే ల్యాప్‌టాప్‌లో ఎయిర్‌ఫ్లో నిరంతరాయంగా జరగాలంటే కూలింగ్ పాడ్‌ లేదా ల్యాప్‌టాప్‌ కింది భాగం గాలి తగిలేలా చిన్నపాటి స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలి.
ఇంట్లో లేదా ఆఫీస్‌లో చాలా మంది తమ పని అయిపోయాక ల్యాప్‌టాప్ ను షట్‌డౌన్‌ చేయకుండా స్లీప్‌ మోడ్‌ లేదా హైబర్‌నేట్‌ మోడ్‌లో పెట్టెస్తుంటారు. చాలా సేపు ఇలా చేయడం వల్ల మీ ల్యాప్‌టాప్‌ పనితీరు పాడవుతుంది. మీరు షట్‌డౌన్‌ చేయాలనుకున్నప్పుడు ప్రాసెస్‌ ఆలస్యమవుతుంది. అందుకే మీ పని అయిపోయిన వెంటనే పీసీని షట్‌డౌన్ చేయాలి. 

ల్యాప్‌టాప్ కొన్నప్పుడు చాలా మంది తెలియక హార్డ్‌డిస్క్‌ను వేర్వేరు భాగాలు చేయకుండా ఉపయోగిస్తుంటారు. దానివల్ల ఓఎస్‌, ప్రోగ్రాం ఫైల్స్‌తోపాటు మీకు సంబంధిచిన ఇతరత్రా ఫైల్స్‌ కూడా ఒకే చోట స్టోర్‌ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు అవసరమైన ఫైల్స్‌ను ప్రతిసారీ వెతికి తీసుకోవాల్సి వస్తుంది. దీని బదులు మీ హార్డ్‌డిస్క్‌ను ఒకటి కన్నా ఎక్కువ భాగాలుగా విభజిస్తే ఓఎస్‌, ప్రోగ్రాం ఫైల్స్ ఒకదాన్లో, మీకు ప్రొఫేషనల్, వ్యక్తిగత సమాచారం మిగిలిన వాటిలో సేవ్ చేసుకోవచ్చు. ఓఎస్‌ కోసం 60జీబీ నుంచి 70 జీబీ వరకు మెమొరీ కేటాయిస్తే సరిపోతుం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Embed widget