News
News
X

Shortest Test Match: 61 బంతుల్లోనే ముగిసిన టెస్ట్ మ్యాచ్ - 25 ఏళ్ల కింద ఇదే రోజు ఏం జరిగింది?

ప్రపంచంలో అత్యంత తక్కువ సమయంలో ముగిసిన టెస్టు మ్యాచ్ మీకు తెలుసా?

FOLLOW US: 
Share:

On This Day in Cricket: సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున క్రికెట్ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో ముగిసిపోయిన టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ 56 నిమిషాల పాటు మాత్రమే సాగింది. ప్రమాదకరంగా కనిపిస్తున్న పిచ్ కారణంగా ఆటగాళ్లు పదే పదే గాయపడటంతో ఈ మ్యాచ్ డ్రా అయింది. అప్పటికి అత్యంత తక్కువ సమయంలో ముగిసిన టెస్టు ఇదే. 2009లో ఇవే రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కేవలం 10 బంతుల్లోనే ముగిసిపోయింది. వర్షం కారణంగా మైదానంలో ఉన్న ఇసుకలో కాళ్లు కూరుకుపోతూ ఉండటంతో మ్యాచ్‌ను నిలిపివేయక తప్పలేదు.

జమైకాలోని కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో ఈ మ్యాచ్ జరిగింది. 1998 జనవరి 29వ తేదీన ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ అథర్టన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అప్పుడు వెస్టిండీస్‌లో కోర్ట్నీ వాల్ష్, కర్ట్లీ ఆంబ్రోస్ వంటి ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. కెప్టెన్ బ్రియాన్ లారా తొలుత వీరిద్దరికి బౌలింగ్ కమాండ్ అప్పగించాడు.

కోర్ట్నీ వాల్ష్, కర్ట్లీ ఆంబ్రోస్ ఇద్దరూ తమ ఫాస్ట్ బౌలింగ్‌తో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టారు. ఈ బౌలర్లకు పిచ్ నుండి చాలా సహాయం లభిస్తుంది. పిచ్‌లో చాలా పగుళ్లు ఉన్నాయి. దానిపై బంతి పడ్డప్పుడల్లా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ శరీరం పైకి అత్యంత వేగంగా వెళుతోంది.

దీంతో జట్టు ఫిజియో పదేపదే రంగంలోకి రావాల్సి వచ్చింది. ఆట ప్రారంభమైన మొదటి 56 నిమిషాల్లోనే ఇంగ్లండ్ ఫిజియో తమ జట్టు ఆటగాళ్ల గాయాన్ని పరీక్షించడానికి, సరిచేయడానికి ఏకంగా ఆరు సార్లు మైదానంలోకి రావాల్సి వచ్చింది.

61 బంతుల తర్వాత డ్రాగా
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మొదటి 44 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేయగలిగారు. అప్పటికే వారు మూడు వికెట్లు కోల్పోయారు. ఎలాగోలా తర్వాత 17 బంతులు వేసిన తర్వాత మ్యాచ్‌ను డ్రా చేయాలని అంపైర్లు నిర్ణయించాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్ 11వ ఓవర్ తొలి బంతి తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ అథర్టన్ అంపైర్ల వద్దకు వెళ్లి పిచ్ గురించి ఫిర్యాదు చేశాడు. దీంతో మ్యాచ్‌ను డ్రాగా డిక్లేర్ చేయాలని అంపైర్లు నిర్ణయించారు. మ్యాచ్ డ్రా అయ్యే సమయానికి ఇంగ్లండ్ జట్టు 10.1 ఓవర్లలో 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఈ లిస్టులో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మూడో స్థానంలో ఉంది. 1993లో కాండీ మైదానంలో జరిగిన మ్యాచ్ కేవలం 12 ఓవర్లలోనే ముగిసింది. మిగతా నాలుగు రోజుల పాటు వర్షం ఆగకుండా పడింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. 12 ఓవర్లలో కేవలం 24 పరుగులకే శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయింది. మనోజ్ ప్రభాకర్ రెండు వికెట్లు పడగొట్టగా, కపిల్ దేవ్‌కు ఒక వికెట్ దక్కింది. లెజండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్‌కు ఇది 125వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఆ తర్వాత కేవలం ఆరు టెస్టులు మాత్రమే ఆడి కపిల్ దేవ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యారు.

Published at : 29 Jan 2023 05:04 PM (IST) Tags: Test Cricket Cricket Records Shortest Test Match

సంబంధిత కథనాలు

IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు ముఖేష్ చౌదరి దూరం - మరి చెన్నై ఎవర్ని సెలెక్ట్ చేసింది?

IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు ముఖేష్ చౌదరి దూరం - మరి చెన్నై ఎవర్ని సెలెక్ట్ చేసింది?

Shaik Rasheed: అండర్-19 వైస్ కెప్టెన్సీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ దాకా - షేక్ రషీద్ గత రికార్డులు ఎలా ఉన్నాయి?

Shaik Rasheed: అండర్-19 వైస్ కెప్టెన్సీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ దాకా - షేక్ రషీద్ గత రికార్డులు ఎలా ఉన్నాయి?

Bhagath Varma: చెన్నై జట్టులో హైదరాబాదీ ప్లేయర్ - ఎవరీ కనుమూరి భగత్?

Bhagath Varma: చెన్నై జట్టులో హైదరాబాదీ ప్లేయర్ - ఎవరీ కనుమూరి భగత్?

Mohammed Siraj: సిరాజ్‌.. ఈసారి ఫైర్‌ చేసేది బుల్లెట్లే! సరికొత్త అస్త్రాలతో RCB పేసర్‌ రెడీ!

Mohammed Siraj: సిరాజ్‌.. ఈసారి ఫైర్‌ చేసేది బుల్లెట్లే! సరికొత్త అస్త్రాలతో RCB పేసర్‌ రెడీ!

Ambati Rayudu: రాయుడంటే ధోనీకి ఎందుకిష్టం! CSK 'మిడిల్‌ హోప్స్‌' అతడిమీదే!

Ambati Rayudu: రాయుడంటే ధోనీకి ఎందుకిష్టం! CSK 'మిడిల్‌ హోప్స్‌' అతడిమీదే!

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు