అన్వేషించండి

Paris Paralympics 2024: స్వర్ణం గెలిచిన తర్వాత అనర్హత వేటు, ఇంతకీ ఎవరా అథ్లెట్ఏం , జరిగింది?

Paris Paralympics 2024: పారాలింపిక్స్ 2024లో ఇరానియన్ అథ్లెట్ సదేగ్ షాయ్‌ మొదట స్వర్ణాన్ని గెలిచాడు. అయితే ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి పదే పదే నల్ల జెండా చూపి అనర్హతకు గురయ్యాడు.

How Flag Controversy Saw Indias Navdeep Singh Clinch Javelin Throw F41 Gold Medal : పారిస్‌ పారాలింపిక్స్‌(Paris Paralympics 2024)లో అనూహ్య  ఘటన జరిగింది. మరుగుజ్జులకు నిర్వహించే  F41 విభాగంలో పురుషుల జావెలిన్ ఫైనల్‌ జరిగింది. ఈ విభాగంలో పారాలింపిక్స్‌ రికార్డు సృష్టించి మరీ ఇరాన్ పారా అథ్లెట్  స్వర్ణం సాధించాడు. భారత్‌కు చెందిన నవదీప్‌ రజతం సాధించాడు. ఫైనల్ కూడా ముగిసింది. ఈ ఫైనల్ ముగిసిన తర్వాతే ఒలింపిక్ నిర్వహక కమిటీ కీలక ప్రకటన చేసింది. స్వర్ణం గెలిచిన ఇరాన్ అథ్లెట్‌ సదేగ్ షాయ్‌పై అనర్హత వేటు వేసింది. దీంతో భారత్‌కు స్వర్ణం గెలిచింది. ఇంతకీ ఈ ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు ఎందుకు పడిందంటే....

 
వేటు ఎందుకు పడిందంటే..?
పారాలింపిక్స్ 2024లో ఇరానియన్ అథ్లెట్ సదేగ్ షాయ్‌.. తన అయిదో త్రో తో పారాలింపిక్ రికార్డు సృష్టించి స్వర్ణాన్ని గెలిచాడు. మరుగుజ్జులకు నిర్వహించే F41 విభాగంలో 47.32 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడి సాధించాడు. అయితే పారాలింపిక్ కమిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు సదేగ్‌పై అనర్హత వేటు వేశారు. దీంతో రజతం సాధించిన నవదీప్‌కు స్వర్ణం దక్కింది. పారాలింపిక్ కమిటీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి పదే పదే జెండాను ప్రదర్శించినందుకు అతనిపై వేటు పడింది. తొలుత సదేగ్‌కు ఎల్లో కార్డ్ చూపించామని... అయినా అతడు మళ్లీ మళ్లీ జెండా చూపించడంతో అతడిపై అనర్హత వేటు పడింది. ప్రపంచ అథ్లెటిక్స్ నిబంధనల ప్రకారం 'స్పోర్టింగ్ ప్రవర్తన' కారణంగా సదేగ్ షాట్‌పై పోటీ నుంచి తొలగించబడ్డాడని ఒలింపిక్‌ నిర్వహక కమిటీ ప్రకటించింది.
 
ఏమిటా రూల్‌..
అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ప్రవర్తనా నియమావళిలోని రూల్ 8.1ని ఉల్లంఘించినందుకు సదేగ్‌పై అనర్హత వేటు వేశారు. పారాలింపిక్స్‌లో ఆటగాళ్ల ప్రవర్తన సరిగా లేకపోతే వారిని పోటీల నుంచి నిషేధిస్తారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ నియమాలు 8.1 ప్రకారం పారా అథ్లెటిక్స్ క్రీడలో సమగ్రత, నైతికతస ప్రవర్తన అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు, నిర్వాహకులతో సహా క్రీడలో పాల్గొనే వారందరు ఈ ప్రమాణాలను నిలబెట్టేందుకు కట్టుబడాలి. క్రీడను న్యాయంగా, నిజాయతీగా, పారదర్శకంగా నిర్వహించేలా చూసుకోవాలి. కానీ ఇరాన్ అథ్లెట్‌ సదేగ్‌... పోటి సమయంలో పదే పదే నల్లజెండాను ఎగురవేస్తూ కనిపించాడు. ఇది అనుచిత ప్రవర్తనగా భావించిన ఒలింపిక్ నిర్వహక కమిటీ నిషేధం విధించింది. కచ్చితంగా ఇది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని... స్పష్టం చేసింది.  
 
తటస్థ అథ్లెట్లుగా
విశ్వ క్రీడల్లో నల్ల జెండాలు ఎగరవేయడం, అనుమతి లేని జెండాలను, గుర్తులను చూపించడం నిబంధనలకు విరుద్ధం. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా రష్యా, బెలారస్ అథ్లెట్లు తటస్థ అథ్లెట్లుగా పోటీ పడుతున్నారు. పారిస్ పారాలింపిక్స్ 2024లో జెండాలను చూపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సదేగ్‌పై అనర్హత వేటుపై ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై అధికారికంగా అప్పీల్ చేసింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Won Hindupuram Municipality Election: హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక
హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక
Telangana MLAs: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్, విచారణ ఈ 10కి వాయిదా
Telangana MLAs: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్, విచారణ ఈ 10కి వాయిదా
Kannapa : ప్రళయ కాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు...
ప్రళయ కాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు... "రుద్ర"గా ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్
Naga Chaitanya Sobhita : నాగ చైతన్య రియల్​ లైఫ్​లో బుజ్జి తల్లి శోభితానే అట.. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో చెప్పేశాడుగా
నాగ చైతన్య రియల్​ లైఫ్​లో బుజ్జి తల్లి శోభితానే అట.. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో చెప్పేశాడుగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Won Hindupuram Municipality Election: హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక
హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక
Telangana MLAs: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్, విచారణ ఈ 10కి వాయిదా
Telangana MLAs: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్, విచారణ ఈ 10కి వాయిదా
Kannapa : ప్రళయ కాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు...
ప్రళయ కాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు... "రుద్ర"గా ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్
Naga Chaitanya Sobhita : నాగ చైతన్య రియల్​ లైఫ్​లో బుజ్జి తల్లి శోభితానే అట.. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో చెప్పేశాడుగా
నాగ చైతన్య రియల్​ లైఫ్​లో బుజ్జి తల్లి శోభితానే అట.. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో చెప్పేశాడుగా
Telangana Caste Survey: తెలంగాణలో ఏ సామాజిక వర్గం వారు ఎంత శాతం ఉన్నారు? లెక్కలు తేల్చిన ప్రభుత్వం, రేపు అసెంబ్లీకి సర్వే నివేదిక
తెలంగాణలో ఏ సామాజిక వర్గం వారు ఎంత శాతం ఉన్నారు? లెక్కలు తేల్చిన ప్రభుత్వం, రేపు అసెంబ్లీకి సర్వే నివేదిక
Student Suicide: ర్యాగింగ్‌ వేధింపులతో మరో విద్యార్థిని బలి, కరీనంగర్‌ మెడికల్ కాలేజీ స్టూడెండ్ ఆ‌త్మహత్య
ర్యాగింగ్‌ వేధింపులతో మరో విద్యార్థిని బలి, కరీనంగర్‌ మెడికల్ కాలేజీ స్టూడెండ్ ఆ‌త్మహత్య
Sandeep Reddy Vanga : 'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్​గా సాయి పల్లవికి ఛాన్స్ మిస్... 'తండేల్' స్టేజ్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా
'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్​గా సాయి పల్లవికి ఛాన్స్ మిస్... 'తండేల్' స్టేజ్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా
Land Mafia in AP: ఏకంగా సీఎం భూమి కబ్జాకు యత్నం - చంద్రబాబు భూమిని కాజేయాలని ల్యాండ్ మాఫియా ప్లాన్
ఏకంగా సీఎం భూమి కబ్జాకు యత్నం - చంద్రబాబు భూమిని కాజేయాలని ల్యాండ్ మాఫియా ప్లాన్
Embed widget