Virat Kohli Creates History: కోహ్లీ సరికొత్త హిస్టరీ - క్వాలిఫైయర్ 1 లో సత్తా.. వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన రన్ మెషీన్
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ గుజరాత్ టైటాన్స్ పై అద్భుత బ్యాటింగ్ తో సరికొత్త రికార్డులను నెలకొల్పాడు.

Virat Kohli Creates History in IPL Qualifier 1 Against GT : ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే 1 సిక్స్, 5 ఫోర్ల సహాయంతో 43 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ తో ఆయన ఐపీఎల్ 2026 సీజన్ లో 600 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలోనే వరుసగా నాలుగు సీజన్లలో 600 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. అలాగే గుజరాత్ టైటాన్స్ పై 500 పరుగుల మార్కును దాటడం ద్వారా, ఐపీఎల్ లో ఎనిమిది వేర్వేరు జట్లపై 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఫస్ట్ ప్లేయర్గా నిలిచాడు.
సీజన్ లో కోహ్లీ రన్ రేట్.. అద్భుతమైన స్ట్రైక్ రేట్
ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన 15 ఇన్నింగ్స్ లో కోహ్లీ 50.00 యావరేజ్, 164.38 అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో 600 పరుగులు చేశాడు. ఆయన ఐపీఎల్ కెరీర్ లో ఒక సీజన్ లో నమోదైన బెస్ట్ స్ట్రైక్ రేట్ ఇదే కావడం విశేషం. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉండగా బెస్ట్ స్కోరు 105* పరుగులుగా ఉంది. 2022 సీజన్ లో కేవలం 341 పరుగులకే పరిమితమై ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ కోహ్లీ, ఆ తర్వాత టి20 క్రికెటర్ గా తనను తాను రీఇన్వెంట్ చేసుకున్న తీరు అసాధారణం. వయసు పెరుగుతున్నా, అంతర్జాతీయ టి20ల నుండి రిటైర్ అయినా ఐపీఎల్ లో ఆయన గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదు.
గత మూడు సీజన్ల పర్ఫార్మెన్స్.. స్పిన్ పై ఆధిపత్యం
కోహ్లీ కంబ్యాక్ జర్నీ 2023 సీజన్ లో 639 పరుగులతో గ్రాండ్గా స్టార్ట్ అయింది. ఆ ఏడాది రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలతో టోర్నమెంట్లో ఫోర్త్ హైయెస్ట్ రన్ గెట్టర్గా నిలిచాడు. ఆ తర్వాత సీజన్ లో స్పిన్నర్లపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఏకంగా 741 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఆ సీజన్ లో 38 సిక్సర్లు బాదడం విశేషం. ఇక గత సీజన్ లో ఆర్సీబీ టైటిల్ విన్నర్ గా నిలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. కఠినమైన కండిషన్స్ లో అడాప్టబిలిటీ చూపిస్తూ 15 ఇన్నింగ్స్ లో 8 హాఫ్ సెంచరీలతో 657 పరుగులు చేసి టీమ్ ను ముందుండి నడిపించాడు.
ఫైనల్ బెర్త్ కోసం పోరాటం..
ఈ ప్రతిష్టాత్మక క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్లు 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్వాలిఫయర్ మ్యాచ్ లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. రజత్ పతిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ (33 బంతుల్లో 93 నాటౌట్, 5 ఫోర్లు, 9 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాసన్ హోల్డర్, కగిసో రబాడ కు రెండేసి వికెట్లు దక్కాయి.
Before You Go
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















