అన్వేషించండి

IPL 2024: ఆటగాళ్లకే కాదు అభిమానులకూ ఆగ్రహం తెప్పించిన ఐపీఎల్ వివాదాలు

Top 5 Controversies In IPL 2024 : ఐపిఎల్ అంటేనే ఉత్కంఠ. అలాంటి లీగ్ లో జరిగిన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆటగాళ్లకే కాదు అభిమానులకూ ఆగ్రహం తెప్పించాయి. అవేంటో చూద్దాం.

Top 5 Controversial Decisions And Issues In IPL 2024 : ఈ ఐపీఎల్(IPL) సీజన్‌లో ఎన్నో రికార్డులు. మరెన్నో ప్రత్యేకతలు. క్రికెట్ అభిమానులకు వినోదం పంచాయి. అలాగే వివాదాలు కూడా ఐపీఎల్‌ను వెన్నాడాయి. వాటిల్లో ఎక్కువగా అంపైరింగ్ నిర్ణయాలు అటు ఆటగాళ్లకు, ఇటు ప్రేక్షకులకు అసహనం తెప్పించాయి. తప్పుడు నిర్ణయాలతో మ్యాచ్‌ ఫలితాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. చివరకు రివ్యూలు చూసి కూడా థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అభిమానులు మండిపడ్డారంటే వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయే అర్థంచేసుకోవచ్చు. 

విరాట్ కోహ్లీ నో బాల్   (RCB vs KKR)

ఈ ఐపిఎల్ లో ఒక  వివాదాలకు కింగ్ కోహ్లీ  బలైపోయాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో హర్షిత్‌ రాణా వేసిన ఒక నోబాల్‌ అతడి బ్యాట్‌ పైభాగంలో తగిలి బౌలరే క్యాచ్‌ పట్టుకున్నాడు. ఫీల్డ్‌ అంపైర్‌ టెలివిజన్‌ అంపైర్‌ సాయం కోరితే...నడుము కంటే ఎక్కువ ఎత్తులో బంతి వచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా థర్డ్‌ అంపైర్‌ కోహ్లీని ఔట్‌గా ప్రకటించాడు. ఆ నిర్ణయానికి కోహ్లీనే ఆశ్చర్యపోయాడు. కింగ్ అభిమానులైతే థర్డ్‌ అంపైర్‌పై దుమ్మెత్తిపోశారు. 

సంజు శాంసన్ (DC vs RR)
గుజరాత్‌ టైటాన్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌లో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజుశాంసన్‌కు గుజరాత్‌ పేసర్‌ మోహిత్‌శర్మ ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా ఓ బంతిని విసిరాడు. దాన్ని ఆడేందుకు శాంసన్‌ ఆఫ్‌ సైడ్‌ వైపు జరిగాడు. కానీ ఫీల్డ్‌ అంపైర్‌  వైడ్‌గా ప్రకటించాడు. రివ్యూ చూస్తే శాంసన్‌ కదలికలను బట్టి బంతి వైడ్‌ కానట్లే కనిపించింది. రెండు సార్లు రిప్లే చూసికూడా ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికే థర్డ్ అంపైర్ ఓటు వేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం గుజరాత్ వంతైంది. 

ఇదే మ్యాచ్ లో సంజు శాంసన్‌ ఔట్‌ కారణంగా ఢిల్లీ  క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ గెలిచే స్థితి నుంచి ఓడిపోయింది. ముకేశ్‌ కుమార్‌ వేసిన 16వ ఓవర్లో సంజు కొట్టిన భారీ షాట్‌ని బౌండరీ లైన్‌ దగ్గర షై హోప్‌ అందుకున్నట్లే అందుకున్నాడు. కానీ అతడి పాదం కొంచెం బౌండరీ లైన్‌కు తగిలినట్లు కనిపించింది. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌.. మూడో అంపైర్‌ ను సాయం కోరాడు. విజువల్స్‌ చూస్తే హోప్‌ పాదం బౌండరీని టచ్‌ చేసినట్లు స్పష్టంగానే కనిపించింది. కానీ సంజు ఔట్‌ అని థర్డ్‌ అంపైర్‌ ప్రకటించడం పెద్ద వివాదాన్ని రాజేసింది.

ఆయుష్ బడోని రన్-అవుట్ (LSG vs MI)
లఖ్‌నవూ-ఢిల్లీ  మ్యాచ్‌లో ఇషాంత్‌శర్మ వేసిన బంతి లెగ్‌సైడ్‌ పడిందని అంపైర్‌ వైడ్‌ ఇచ్చాడు. రివ్యూకి వెళితే టీవీ అంపైర్‌ వైడ్‌ కాదని తేల్చాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ బ్యాటర్‌ ఆయుష్‌ బదోని రనౌట్‌ వివాదాస్పదమైంది. 

రహ్మానుల్లా గుర్బాజ్ (ఫైనల్)
 ఆఖరుకు ఫైనల్ మ్యాచ్‌లో కోల్ కతా బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్... ఎల్బీ కూడా వివాదాస్పదమైంది. ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తప్పని విశ్వాసంతో కనిపించిన గుర్బాజ్.. థర్డ్ అంపైర్‌ నిర్ణయంతో నివ్వెరపోయాడు. కామెంటర్‌ గా ఉన్న రవి శాస్త్రి బాల్ ట్రాకింగ్, ఆల్ట్రా ఎడ్జ్ సరిగా పనిచేయడంలేదని చెబుతున్న సమయంలోనే ఎల్బీగా థర్డ్ అంపైర్ నిర్ణయించడంతో గుర్బాజ్ అసహనంతో మైదానాన్ని వీడాడు. 

రోహిత్ శర్మ ఆడియో వైరల్ 
ఈ సీజన్‌లోనే అసలైన వివాదం హిట్‌ మ్యాన్ రోహిత్ శర్మ తన మిత్రుడు  కేకేఆర్‌ అసిస్టెంట్ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో మాట్లాడిన వీడియోను బయటపెట్టడం.
వీడియో తీయవద్దని రోహిత్ సూచించినా కూడా కెమెరామెన్ చిత్రీకరించడం, దాన్ని కేకేఆర్‌ ట్వీట్ చేయడం వివాదంగా మారింది. ఆ వీడియోలో రోహిత్ చెప్పిన మాటలు స్పష్టంగా వినిపించకపోయినా ‘‘భాయ్‌ నాదేముంది.. ఇదే చివరిది’’అని అన్నట్లు ప్రచారం జరిగింది. ధాని ఆధారంగా ఆయన ముంబయి ఇండియన్స్‌ను వీడుతున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఈ వీడియోను పోస్ట్ చేయడంపై రోహిత్ శర్మ  మండిపడ్డాడు. క్రికెటర్ల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడవద్దని గట్టిగానే సూచించాడు. వ్యూస్ పెంచుకోవడం కోసం ఇలాంటి వైఖరి సరికాదని 
ఎక్స్‌ లో పోస్ట్ చేశాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, లైవ్  మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, లైవ్  మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Hyderabad Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, మాయమాటలతో రప్పించి ఓయో రూములో ఇద్దరు బాలికలపై అత్యాచారం
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, మాయమాటలతో రప్పించి ఓయో రూములో ఇద్దరు బాలికలపై అత్యాచారం
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Embed widget