Rishabh Pant, Kuldeep Yadav Swap: రూ. 27 కోట్ల పంత్ సగం ధరకే ఢిల్లీకి.. కుల్దీప్ ను ఎగరేసుకుపోయిన LSG, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది!
Rishabh Pant and Kuldeep Yadav: లక్నో సూపర్ జాయింట్స్ నుంచి రిషభ్ పంత్ రూ. 15 కోట్ల రివైజ్డ్ శాలరీతో ఢిల్లీ క్యాపిటల్స్ లోకి రాగా, కుల్దీప్ యాదవ్ రూ. 13.50 కోట్లకు లక్నోకు ట్రేడ్ అయ్యాడు.

Rishabh Pant and Kuldeep Yadav Swap In Mega Trade: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) హిస్టరీలోనే మోస్ట్ సెన్సేషనల్ ప్లేయర్ ట్రేడింగ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. లక్నో సూపర్ జాయింట్స్ (LSG) మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ మళ్లీ తన పాత ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రేజీ ట్రేడ్కు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ జూన్ 23 మంగళవారం అఫీషియల్ మీడియా స్టేట్మెంట్ ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. "లక్నో సూపర్ జాయింట్స్ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వస్తున్నాడు, అతని ప్లేస్ లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జాయింట్స్ లో జాయిన్ కానున్నాడు" అని ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. ఈ మెగా డీల్ ఐపీఎల్ సర్కిల్స్ లో ఒక బిగ్గెస్ట్ ఎన్కౌంటర్గా మారింది.
🚨 Announcement 🚨
— IndianPremierLeague (@IPL) June 23, 2026
Rishabh Pant and Kuldeep Yadav complete high-profile trade between @DelhiCapitals and @LucknowIPL.
Rishabh Pant all set to rejoin #DC at INR 15 Crore whereas Kuldeep Yadav will join #LSG at INR 13.5 Crore.
More Details ▶️ https://t.co/64HeOX143I… pic.twitter.com/tIEvj7fgNo
రూ. 12 కోట్ల భారీ శాలరీ కట్.. పంత్ కు ఊహించని దెబ్బ
ఈ ట్రేడింగ్ లో రిషభ్ పంత్కు భారీగా శాలరీ కట్ (పే కట్) అయింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జాయింట్స్ రికార్డ్ స్థాయిలో రూ. 27 కోట్లు పెట్టి పంత్ను కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత కాస్ట్లీ ప్లేయర్గా నిలిచిన పంత్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ లోకి రావడం కోసం ఏకంగా రూ. 12 కోట్లు వదులుకున్నాడు. కేవలం రూ. 15 కోట్ల రివైజ్డ్ ప్రైస్ తోనే పంత్ ఢిల్లీ జెర్సీ వేసుకోబోతున్నాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ తన ప్రెజెంట్ శాలరీ అయిన రూ. 13.50 కోట్ల సేమ్ ఫీజ్తోనే లక్నో సూపర్ జాయింట్స్ లోకి వెళ్తున్నాడు. పంత్ శాలరీ గ్రాఫ్ ఈ రేంజ్ లో పడిపోవడం క్రికెట్ ఫ్యాన్స్ ను బాగా షాక్ కు గురిచేసింది.
One of us. Always. 🐅
— Delhi Capitals (@DelhiCapitals) June 23, 2026
We will miss you, Tiger! 💙❤️ pic.twitter.com/GpCh0sSXaK
పంత్ మార్కెట్ వాల్యూ పడిపోవడానికి రీజన్స్ ఇవే
గత రెండు సీజన్లుగా ఐపీఎల్ లో రిషభ్ పంత్ పర్ఫార్మెన్స్ అస్సలు బాలేదు. లక్నో సూపర్ జాయింట్స్ రూ. 27 కోట్లు పెట్టినా పంత్ ఆ రేంజ్ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. లాస్ట్ రెండు సీజన్లలో కలిపి 28 ఇన్నింగ్స్ ఆడిన పంత్, కేవలం మూడు సార్లు మాత్రమే యాభై కంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేయగలిగాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2025 లో 24.45 యావరేజ్, 133.16 స్ట్రైక్ రేట్తో కేవలం 269 రన్స్ మాత్రమే చేశాడు. 2026 సీజన్ లో కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. 28.36 యావరేజ్, 138.05 స్ట్రైక్ రేట్తో 312 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. బ్యాటింగ్ లోనే కాకుండా కెప్టెన్సీ లోనూ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.
కుల్దీప్ తో కొత్త ప్లాన్
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే లక్నో కెప్టెన్సీ నుంచి పంత్ తప్పుకున్నాడు. అయితే మేనేజ్మెంట్తో వచ్చిన గొడవల వల్లే అతన్ని కెప్టెన్సీ నుంచి సాక్ చేశారనే టాక్ కూడా గట్టిగా నడిచింది. పంత్ బ్యాడ్ ఫామ్ వల్లే లక్నో అతన్ని వదిలించుకోవాలని చూసింది. కరెక్ట్ టైమ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ పాత మ్యాచ్ విన్నర్ ను వెనక్కి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించింది. పంత్ ప్లేస్ లో లక్నో సూపర్ జాయింట్స్ లోకి వెళ్తున్న కుల్దీప్ యాదవ్ ఒంటిచేత్తో మ్యాచ్ లు గెలిపించగల కేపబిలిటీ ఉన్న స్పిన్నర్. లక్నో పిచ్ లపై కుల్దీప్ బౌలింగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ బిగ్ ట్రేడింగ్ ఐపీఎల్ 2027 సీజన్ విజువల్స్ ను కంప్లీట్గా మార్చేయబోతోందని తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















