అన్వేషించండి

IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు

IPL Mega Auction 2025 | ఐపీఎల్ మెగా వేలంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు యువ క్రికెటర్లను అదృష్టం వరించింది. చెన్నై, పంజాబ్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు వారిని తీసుకున్నాయి.

AP Cricketers Sold at IPL 2025 Auction : అమరావతి: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్లను అదృష్టం వరించింది. ఏపీకి చెందిన ముగ్గురు క్రికెటర్లను ఫ్రాంచైజీలు వేలంలో తీసుకున్నాయి. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ వేలంలో ఏపీకి చెందిన యువకులు సోల్డ్ అయ్యారు. షేక్ రషీద్, పైల అవినాష్, సత్యనారాయణ రాజులను వేలంలో తీసుకోవడంతో ఆ కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. 


ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుంటూరుకి చెందిన షేక్ రషీద్‎ను చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కొనుగోలు చేసింది. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు చెన్నై మరోసారి షేక్ రషీద్ ను తీసుకుంది. గతంలోనూ చెన్నై షేక్ రషీద్ ను తీసుకోవడం తెలిసిందే. చెన్నై అతడిపై నమ్మకం ఉంచి మరోసారి వేలంలో తీసుకుంది. షేక్ రషీద్ ఇదివరకే ఐపీఎల్ వేలంలోకి సోల్డ్ అయిన క్రికెటర్ కాగా, సత్యనారాయణ రాజు, పైల అవినాష్ లకు మాత్రం వేలంలోకి రావడం ఇదే తొలిసారి.

తూర్పు గోదావరి జిల్లా చెందిన సత్యనారాయణ రాజు‎ సైతం వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల బేస్ ప్రైజ్ కు నిలిచిన సత్యనారాయణ రాజు‎ను తీసుకుంది. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై జట్టు సత్యనారాయణను తీసుకోవడం విశేషం. విజయవాడకు చెందిన క్రికెటర్ పైల అవినాష్‎ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైస్ కు  పంజాబ్ కింగ్స్ పైల అవినాష్ ను కొనుగోలు చేసింది.  

తెలంగాణ యువ క్రికెటర్ కు నిరాశ
మరో తెలుగు యువ క్రికెటర్ ఐపీఎల్ వేలానికి రిజస్టర్ చేసుకున్నా నిరాశే ఎదురైంది. ఏ ఫ్రాంచైజీ అతడ్ని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అరవెల్లి అవనీష్ రావు జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో పాల్గొన్నాడు. కానీ వేలంలో అవనీష్ రావు అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలాడు. భారత అండర్ 19 ప్రాతినిథ్యం వహించిన అవనీష్ ను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో నిరాశే ఎదురైంది. 

Also Read: Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget