అన్వేషించండి

IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో మెరుపులు మెరిపించే ఆటగాళ్లు వీరే !

IPL 2025 Mega Auction | ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లకు భారీ డిమాండ్ రానుంది. అత్యధిక ధరలకు ఫ్రాంచైజీలు వీరిని దక్కించుకునే ఛాన్స్ ఉంది.

IPL Auction 2025 | హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలం (IPL Auction 2025) కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నామని బీసీసీఐ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది దుబాయ్‌లో ఐపీఎల్ వేలం నిర్వహించగా.. వరుసగా రెండో సంవత్సరం మెగా ఆక్షన్ ను విదేశాలలో జరగనుంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, కోల్ కత్తా ఫ్రాంచైజీ శ్రేయస్ అయ్యర్ ను వేలంలోకి వదిలేసింది. మరికొందరు కీలక ఆటగాళ్లు సైతం మెగా ఆక్షన్ లోకి రావడంతో ఈ సీజన్ వేలంలో ఉత్కంఠ నెలకొంది.

ఈ ఏడాది 1,574 మంది ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 1,165 మంది భారత ఆటగాళ్లు ఉండగా, 409 మంది విదేశీ ఆటగాళ్లు వేలం కోసం తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. క్యాప్డ్ ప్లేయర్స్ 320, అన్ క్యాప్డ్ ప్లేయర్లు 1,224 మంది, మరో 30 మంది అసోసియేట్ దేశాల (టెస్ట్ క్రికెట్ ఆడని దేశాల) ఆటగాళ్లు ఉన్నారు.    ఒక్కో ఫ్రాంచైజీ కనిష్టంగా 18, గరిష్టంగా 25 మంది ఆటగాళ్ల వరకు తీసుకోవచ్చు. అంటే ఓవరాల్ ఐపీఎల్ లో 250 మంది వరకు ప్లేయర్లు ఆడే ఛాన్స్ ఉంది. కానీ 46 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోగా, ఈ వేలంలో 204 మంది ఆటగాళ్ల వరకు తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. కొందరు కీలక ఆటగాళ్లపై అన్ని ఫ్రాంచైజీలు ఫోకస్ చేస్తాయి. 

మహ్మద్ షమీ ఛాంపియన్ బౌలర్, అయినప్పటికీ ఫిట్‌నెస్ సమస్య కారణంగా గుజరాత్ టైటాన్స్ అతడ్ని వేలంలోకి రిలీజ్ చేసింది. ఒకవేళ షమీ కోలుకుంటాడని సంకేతాలు వస్తే మాత్రం వేలంలో షమీకి మంచి ధర వస్తుంది. 

IPL 2025 వేలంలో అత్యంత ఖరీదైన బిడ్ లలో రిషబ్ పంత్ ఒకటిగా నిలవనున్నాడు. పలు ఫ్రాంచైజీలు పంత్‌ను దక్కించుకునేందుకు భారీగా వేలం వేస్తాయని అంతా భావిస్తున్నారు. వేలంలో పంత్ రూ. 20 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉందని, డాషింగ్ బ్యాట్ పై అంచనాలు నెలకొన్నాయి. 

లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్‌ని రిలీజ్ చేసింది. లాస్ట్ ఐపీఎల్ చివర్లో లక్నో ఓనర్ అందరి ముందే రాహుల్ పై తీవ్రంగా విరుచుకుపడటాన్ని క్రికెట్ ప్రేమికులు మరిచిపోరు. మంచి బ్యాటర్, స్ట్రోక్ ప్లేయర్ అయినా నిలకడలేమి, స్రైక్ రేట్ రాహుల్ కు సమస్యగా మారింది. వేలంలో రాహుల్ కోసం పోటీ ఉండనుంది.

ముంబై ఇండియన్స్ వదిలేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు సైతం వేలంలో మంచి ధర వస్తుందని అంచనాలు నెలకొన్నాయి. టీ20 క్రికెట్ లో డైనమైట్ ఇన్నింగ్స్ లు ఆడే సత్తా కిషన్ సొంతం. కీపర్ బ్యాటర్ కు డిమాండ్ రావడం కన్ఫామ్. 

Also Read: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు

IPL 2025 వేలంలో బౌలర్లకు సైతం మంచి ధర పెడుతున్నాయి ఫ్రాంచైజీలు. ముఖ్యంగా భారత్ గడ్డపై ఐపీఎల్ అంటే స్పిన్నర్లకు డిమాండ్ వస్తుంది. రాజస్థాన్ రాయల్స్ కు ఎన్నో విజయాలు అందించిన యుజ్వేంద్ర చాహల్‌ను కొనుగోలు చేయడానికి పలు ఫ్రాంచైజీల మధ్య పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

గత ఐపీఎల్ సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ విజయం సాధించింది. కొత్త నాయకుడి కోసం వెతుకుతున్న బృందాలు అతనిని బోర్డులోకి తీసుకురావడానికి రూ. 20 కోట్లను అధిగమించే బలమైన వేలంపాటలు వేయాలని భావిస్తున్నారు.

ఇంగ్లండ్ ప్లేయర్ జాస్ బట్లర్ ను రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేయడం షాకింగ్ విషయం. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడే బట్లర్ సైతం మంచి ధర పలకనున్నాడు. ఓపెనర్ గా టాపార్డర్ లో విలువైన పరుగులు చేసే సత్తా ఉంది. రచిన్ రవీంద్రను చెన్నై రిలీజ్ చేసింది. దాంతో ఈ మెగా వేలంలో న్యూజిలాండ్ బ్యాటర్ కు భారీ డిమాండ్ తో బిగ్ బిడ్డింగ్ సొంతం చేసుకోనున్నాడు. 

లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ టీమిండియాకు ఆడుతున్నాడు. మంచి స్పెల్ తో మ్యాచ్ మలుపుతిప్పగలడు. కానీ పంజాబ్ కింగ్స్ అర్షదీప్ ను రిటెయిన్ చేయలేదు. బుమ్రా తర్వాత భారత కీలక బౌలర్లలో ఒకరిగా ఉన్న అర్ష్‌దీప్ డెత్ ఓవర్లతో పాటు ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు తీయగలడు. ఈ పేసర్ కు సైతం డిమాండ్ వచ్చి భారీ ధరకు అమ్ముడు పోయే ఛాన్స్ ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget