అన్వేషించండి

IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో మెరుపులు మెరిపించే ఆటగాళ్లు వీరే !

IPL 2025 Mega Auction | ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లకు భారీ డిమాండ్ రానుంది. అత్యధిక ధరలకు ఫ్రాంచైజీలు వీరిని దక్కించుకునే ఛాన్స్ ఉంది.

IPL Auction 2025 | హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలం (IPL Auction 2025) కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నామని బీసీసీఐ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది దుబాయ్‌లో ఐపీఎల్ వేలం నిర్వహించగా.. వరుసగా రెండో సంవత్సరం మెగా ఆక్షన్ ను విదేశాలలో జరగనుంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, కోల్ కత్తా ఫ్రాంచైజీ శ్రేయస్ అయ్యర్ ను వేలంలోకి వదిలేసింది. మరికొందరు కీలక ఆటగాళ్లు సైతం మెగా ఆక్షన్ లోకి రావడంతో ఈ సీజన్ వేలంలో ఉత్కంఠ నెలకొంది.

ఈ ఏడాది 1,574 మంది ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 1,165 మంది భారత ఆటగాళ్లు ఉండగా, 409 మంది విదేశీ ఆటగాళ్లు వేలం కోసం తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. క్యాప్డ్ ప్లేయర్స్ 320, అన్ క్యాప్డ్ ప్లేయర్లు 1,224 మంది, మరో 30 మంది అసోసియేట్ దేశాల (టెస్ట్ క్రికెట్ ఆడని దేశాల) ఆటగాళ్లు ఉన్నారు.    ఒక్కో ఫ్రాంచైజీ కనిష్టంగా 18, గరిష్టంగా 25 మంది ఆటగాళ్ల వరకు తీసుకోవచ్చు. అంటే ఓవరాల్ ఐపీఎల్ లో 250 మంది వరకు ప్లేయర్లు ఆడే ఛాన్స్ ఉంది. కానీ 46 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోగా, ఈ వేలంలో 204 మంది ఆటగాళ్ల వరకు తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. కొందరు కీలక ఆటగాళ్లపై అన్ని ఫ్రాంచైజీలు ఫోకస్ చేస్తాయి. 

మహ్మద్ షమీ ఛాంపియన్ బౌలర్, అయినప్పటికీ ఫిట్‌నెస్ సమస్య కారణంగా గుజరాత్ టైటాన్స్ అతడ్ని వేలంలోకి రిలీజ్ చేసింది. ఒకవేళ షమీ కోలుకుంటాడని సంకేతాలు వస్తే మాత్రం వేలంలో షమీకి మంచి ధర వస్తుంది. 

IPL 2025 వేలంలో అత్యంత ఖరీదైన బిడ్ లలో రిషబ్ పంత్ ఒకటిగా నిలవనున్నాడు. పలు ఫ్రాంచైజీలు పంత్‌ను దక్కించుకునేందుకు భారీగా వేలం వేస్తాయని అంతా భావిస్తున్నారు. వేలంలో పంత్ రూ. 20 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉందని, డాషింగ్ బ్యాట్ పై అంచనాలు నెలకొన్నాయి. 

లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్‌ని రిలీజ్ చేసింది. లాస్ట్ ఐపీఎల్ చివర్లో లక్నో ఓనర్ అందరి ముందే రాహుల్ పై తీవ్రంగా విరుచుకుపడటాన్ని క్రికెట్ ప్రేమికులు మరిచిపోరు. మంచి బ్యాటర్, స్ట్రోక్ ప్లేయర్ అయినా నిలకడలేమి, స్రైక్ రేట్ రాహుల్ కు సమస్యగా మారింది. వేలంలో రాహుల్ కోసం పోటీ ఉండనుంది.

ముంబై ఇండియన్స్ వదిలేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు సైతం వేలంలో మంచి ధర వస్తుందని అంచనాలు నెలకొన్నాయి. టీ20 క్రికెట్ లో డైనమైట్ ఇన్నింగ్స్ లు ఆడే సత్తా కిషన్ సొంతం. కీపర్ బ్యాటర్ కు డిమాండ్ రావడం కన్ఫామ్. 

Also Read: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు

IPL 2025 వేలంలో బౌలర్లకు సైతం మంచి ధర పెడుతున్నాయి ఫ్రాంచైజీలు. ముఖ్యంగా భారత్ గడ్డపై ఐపీఎల్ అంటే స్పిన్నర్లకు డిమాండ్ వస్తుంది. రాజస్థాన్ రాయల్స్ కు ఎన్నో విజయాలు అందించిన యుజ్వేంద్ర చాహల్‌ను కొనుగోలు చేయడానికి పలు ఫ్రాంచైజీల మధ్య పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

గత ఐపీఎల్ సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ విజయం సాధించింది. కొత్త నాయకుడి కోసం వెతుకుతున్న బృందాలు అతనిని బోర్డులోకి తీసుకురావడానికి రూ. 20 కోట్లను అధిగమించే బలమైన వేలంపాటలు వేయాలని భావిస్తున్నారు.

ఇంగ్లండ్ ప్లేయర్ జాస్ బట్లర్ ను రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేయడం షాకింగ్ విషయం. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడే బట్లర్ సైతం మంచి ధర పలకనున్నాడు. ఓపెనర్ గా టాపార్డర్ లో విలువైన పరుగులు చేసే సత్తా ఉంది. రచిన్ రవీంద్రను చెన్నై రిలీజ్ చేసింది. దాంతో ఈ మెగా వేలంలో న్యూజిలాండ్ బ్యాటర్ కు భారీ డిమాండ్ తో బిగ్ బిడ్డింగ్ సొంతం చేసుకోనున్నాడు. 

లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ టీమిండియాకు ఆడుతున్నాడు. మంచి స్పెల్ తో మ్యాచ్ మలుపుతిప్పగలడు. కానీ పంజాబ్ కింగ్స్ అర్షదీప్ ను రిటెయిన్ చేయలేదు. బుమ్రా తర్వాత భారత కీలక బౌలర్లలో ఒకరిగా ఉన్న అర్ష్‌దీప్ డెత్ ఓవర్లతో పాటు ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు తీయగలడు. ఈ పేసర్ కు సైతం డిమాండ్ వచ్చి భారీ ధరకు అమ్ముడు పోయే ఛాన్స్ ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget