మ్యాచ్లు
IPL 2023: మార్చి 3వ తేదీ నుంచి మహిళల ఐపీఎల్! పోటీలో మొత్తం 5 జట్లు
మహిళల ఐపీఎల్ ప్రారంభ సీజన్ న మార్చి 3 నుంచి 26 వరకు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ ఈ తేదీల్లో అమ్మాయిల ఐపీఎల్ ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
IPL 2023: మహిళల ఐపీఎల్ ప్రారంభ సీజన్ న మార్చి 3 నుంచి 26 వరకు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ ఈ తేదీల్లో అమ్మాయిల ఐపీఎల్ ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫిబ్రవరి 26న కేప్ టౌన్ వేదికగా జరగనున్న 2023 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత వుమెన్స్ ఐపీఎల్ జరగనున్నట్లు తెలుస్తోంది.
మీడియా హక్కుల కోసం టెండర్లు
మహిళల ఐపీఎల్ మొదటి 5 సీజన్ల మీడియా హక్కుల కోసం బీసీసీఐ శుక్రవారం టెండర్లు ఆహ్వానించింది. టెండర్ వేసేందుకు డిసెంబర్ 31 చివరితేదీ. ఈసారి ఈ- వేలానికి బదులుగా క్లోజ్డ్- బిడ్ విధానాన్ని అనుసరించాలని బీసీసీఐ నిర్ణయించింది. బిడ్డర్లు టెండర్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలియనున్నాయి. టెలివిజన్, డిజిటల్, టీవీ ప్లస్ డిజిటల్... ఈ మూడు విభాగాలకు బేస్ ధర ఎంతనేది బీసీసీఐ ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది.
మహిళల ఐపీఎల్ కోసం ఈ ఏడాది అక్టోబరులో బీసీసీఐ.. రాష్ట్ర సంఘాలు, తన సభ్యులతో ఒక ప్రణాళిక గురించి చర్చించింది. ఇది బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు.
మహిళల ఐపీఎల్ స్వరూపం
- లీగ్ లో 5 ఫ్రాంచైజీ జట్లు పోటీపడతాయి.
- మొత్తం 22 మ్యాచులు ఉంటాయి.
- ప్రతి జట్టులో గరిష్టంగా ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో పాటు మొత్తం 18 మంది ఉండవచ్చు.
- తుది జట్టులో 5గురు విదేశీ ఆటగాళ్లు (సభ్య దేశాల నుంచి నలుగురు, అసోసియేట్ దేశం నుంచి ఒకరు) ఉండాలి.
- లీగ్ దశలో ప్రతి జట్టు మరో జట్టులో రెండు సార్లు ఆడుతుంది. టేబుల్ టాపర్ గా ఉన్న జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది.
- రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచులో ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు రెండో ఫైనలిస్ట్ గా ఫైనల్ ఆడుతుంది.
March 3 - March 26 🇮🇳
— Georgie Heath (@GeorgieHeath27) December 9, 2022
WOMEN'S IPL 🏏
MARK YOUR CARDS 🗓
*Looks up flights and hunts for work 😂 #BCCI #WIPL #IPL #WomensIPL #WomensCricket #Crickettwitter pic.twitter.com/JQCvExWUvR
పురుషుల ఐపీఎల్
పురుషుల ఐపీఎల్ 2023 ఎడిషన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు. ఇందులో 10 జట్లు ఉంటాయి. అయితే దీనికి తేదీని నిర్ణయించే ముందు బీసీసీఐ విదేశీ ఆటగాళ్ల లభ్యతపై కసరత్తు చేస్తోంది. అలాగే హోం అండ్ ఎవే పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహించనుంది. జూన్ 1 నుంచి 4 వరకు ఇంగ్లండ్ జట్టు లార్డ్స్ లో ఐర్లాండ్ తో ఏకైక టెస్టులో ఆడబోతోంది. కాబట్టి మే నెలాఖరులోగా ఐపీఎల్ ను ముగించాలని బీసీసీఐ భావిస్తోంది. అలాగే యాషెస్ జూన్ 16 నుంది ప్రారంభం కానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets