అన్వేషించండి

BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!

BCCI Red Alert: ఫిక్సింగ్ ముగ్గులోకి దింపేందుకు హైదరాబాద్‌ వ్యాపారి ప్రయత్నాలు చేస్తున్నారని బీసీసీఐ హెచ్చరించింది. ఐపీఎల్ పది జట్లు వారి సపోర్టింగ్ స్టాఫ్ జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.

IPL 2025 మ్యాచ్ ఫిక్సింగ్: ఐపీఎల్‌ ఆటగాళ్లకు, యజమానులకు భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త అక్రమ కార్యకలాపాల కోసం ఆటగాళ్లను సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడని హెచ్చరికలో పేర్కొంది. ఒక మీడియా నివేదిక ప్రకారం, BCCI అన్ని క్రికెటర్లు, కోచ్‌లు, కమెంటేటర్లు, సపోర్ట్ స్టాఫ్‌కు ఈ అలర్ట్ ఇచ్చింది. ఈ వ్యాపారవేత్త గురించి జాగ్రత్తగా ఉండమని సూచించింది. ఈ వ్యాపారవేత్త అనేక మంది బుకీలతో సంబంధం కలిగి ఉన్నాడని తెలిసింది. ఈ వ్యక్తి టోర్నమెంట్‌లో స్టాఫ్‌ను సంప్రదించి ఖరీదైన బహుమతులు ఇచ్చి బుట్టలో పడేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. 

క్రిక్‌బజ్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం... ఈ వ్యాపారవేత్త సాధారణంగా మొదట జట్టు యజమానులు, ఆటగాళ్ళు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, కమెంటేటర్ల కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు. యాంటీ-కరప్షన్ యూనిట్ అభిప్రాయం ప్రకారం, ఈ వ్యక్తి గతంలో కూడా అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు.

ఫ్యాన్‌గా మభ్యపెట్టి మోసం చేస్తాడు
ఈ నివేదికలో, హైదరాబాద్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఆటగాళ్ళు, కోచ్‌లు కమెంటేటర్లను ఏదో రూపంలో సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఫ్యాన్‌ అంటూ చెప్పుకొని వాళ్లకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నట్టు పేర్కొంది. జట్లు, వారికి సంబంధించిన వాళ్లు ఉండే హోటళ్లు, ఆడే మైదనాల చుట్టూ తిరుగుతూ మచ్చిక చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. అతను ఆటగాళ్ళు స్టాఫ్‌ను ప్రైవేట్ పార్టీలకు ఆహ్వానించి, ఆభరణాలు సహా అనేక ఖరీదైన బహుమతులు ఇస్తాడు. 

ఈ విషయంలో ఐపీఎల్ 2025లో పాల్గొంటున్న అన్ని జట్లు, ఆ జట్ల తరఫున ఆడుతున్న ఆటగాళ్ళు వారికి సహకరించే వారు సహకరించాలని BCCI రిక్వస్ట్ చేసింది.  మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలకు పూర్తిగా వ్యతిరేకం, క్రికెట్‌ సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని బీసీసీఐ ప్రకటించింది. 

గతంలో ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ 
2013లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ ఘటనను ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అతిపెద్ద స్కామ్‌గా భావిస్తారు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్ళు, ఎస్ శ్రీశాంత్, అజిత్ చాండిలా,  అంకిత్ చౌహాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తరువాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు అధిపతులను కూడా అరెస్ట్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget