అన్వేషించండి

Sourav Ganguly: ఐపీఎల్ 2022 ఇక్కడే.. త్వరలో మహిళల ఐపీఎల్ కూడా.. గంగూలీ ఏమన్నారంటే?

ఈసారి ఐపీఎల్‌ను మనదేశంలోనే నిర్వహించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు.

2022 ఐపీఎల్‌ను వీలైనంత వరకు భారత్‌లోనే నిర్వహించేలా చూస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. కరోనావైరస్ భారీ స్థాయికి చేరకపోతే కచ్చితంగా ఐపీఎల్ మనదేశంలోనే జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో గంగూలీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భారత్‌లో పూర్తిస్థాయిలో ఐపీఎల్ జరిగి రెండేళ్లు పైనే అవుతుంది. 2020 ఐపీఎల్ పూర్తిగా యూఏఈలో జరగగా.. 2021 ఐపీఎల్ మొదటి భాగం మనదేశంలో, రెండో భాగంల యూఏఈలో జరిగింది. మొదటి భాగం సగం పూర్తయ్యాక ఆటగాళ్లకు కరోనా సోకడమే దీనికి కారణం. ముంబై, పుణేల్లో ఐపీఎల్ 15వ సీజన్ నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు గంగూలీ తెలిపారు. అయితే ప్రేక్షకులకు ఆహ్వానం ఉంటుందో లేదో తెలియరాలేదు. నాకౌట్ మ్యాచ్‌ల వేదికలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

అయితే ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయం కూడా గంగూలీ తెలపలేదు. పూర్తి స్థాయిలో షెడ్యూల్ సిద్ధం అయ్యాక దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్, అహ్మదాబాద్ జట్లు కూడా ఈ ఐపీఎల్‌లో ఆడనున్నాయి. దీంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరింది.

దీంతోపాటు ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో మహిళ టీ20 చాలెంజ్ పోటీలను కూడా నిర్వహిస్తామని గంగూలీ తెలిపారు. ఈ పోటీలో గతంలో కూడా జరిగాయి. మొత్తం మూడు జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీ పడతాయి. 2018లో ఈ పోటీలు ప్రారంభం అయ్యాయి. అయితే కరోనా కారణంగా 2021లో ఈ పోటీలను నిర్వహించలేదు. ఐపీఎల్ 2022లో వీటిని మళ్లీ జరపనున్నట్లు గంగూలీ పేర్కొన్నారు.

గత కొద్ది కాలంగా మహిళల క్రికెట్‌కు ఆదరణ విపరీతంగా పెరిగింది. భవిష్యత్తులో మహిళల ఐపీఎల్ కూడా నిర్వహించే అవకాశం ఉందని గంగూలీ అన్నారు. కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాక దేశవాళీ మహిళల క్రికెట్‌ను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న మెగా వేలానికి మొత్తం 590 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చాహల్, డేవిడ్ వార్నర్, క్వింటన్ డికాక్, ప్యాట్ కమిన్స్, ఫాఫ్ డుఫ్లెసిస్, జోఫ్రా ఆర్చర్ వంటి పెద్ద పేర్లు కూడా వేలంలో చూడవచ్చు.

10 ఫ్రాంచైజీలు ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఇప్పుడు సూపర్ స్టార్ ఆటగాళ్లు, టాలెంటెడ్ యంగ్‌స్టర్స్‌తో జట్టును బలోపేతం చేసుకోవడానికి అన్ని ఐపీఎల్ టీమ్స్ ప్రయత్నిస్తాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Countries with the Deadliest Snakes : పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
Embed widget